అందుకే అర్ధరాత్రి అంత్యక్రియలు..
హాథ్రస్ బాధితురాలికి అర్థరాత్రి దహన సంస్కారాలు నిర్వహించడానికి గల కారణాలను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వివరించింది.
సుప్రీంకు వివరించిన యూపీ ప్రభుత్వం
దిల్లీ: హాథ్రస్ ఘటనలో బాధితురాలికి అర్ధరాత్రి దహన సంస్కారాలు నిర్వహించడానికి గల కారణాలను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వివరించింది. మరుసటి రోజు భారీ స్థాయిలో శాంతిభద్రతలకు ముప్పు తలెత్తే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ నివేదిక కారణంగానే తాము ఆ విధంగా చేయాల్సి వచ్చిందని తెలిపింది. ఈ ఘటనలో దాడికి గురైన 19 ఏళ్ల దళిత యువతి.. సెప్టెంబర్ 29 ఉదయం దిల్లీ సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో మరణించింది. కాగా ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించిన పోలీసులు.. అదే రోజు రాత్రి 2:30 గంటలకు కుటుంబ సభ్యులెవరూ లేకుండానే అంత్యక్రియలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా ఈ విషయమై యూపీ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి ఓ అఫిడవిట్ సమర్పించింది.
‘‘సఫ్దర్జంగ్ ఆస్పత్రి వద్ద చోటుచేసుకున్న ధర్నా మాదిరిగానే మరిన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్నట్లు హాథ్రస్ జిల్లా యంత్రాంగానికి సెప్టెంబర్ 29 ఉదయం నిఘా వర్గాల నివేదికలు అందాయి. అంతేకాకుండా ఈ మొత్తం అంశానికి కులం, మతం రంగు పులిమి దానిని స్వప్రయోజనాలకు ఉపయోగించే ప్రయత్నం జరుగుతోందని కూడా నివేదికలో వెల్లడించారు’’ అని దానిలో పేర్కొంది. దీనిని నివారించేందుకే తాము అత్యవసరంగా బాధితురాలి అంతిమ సంస్కారాలు నిర్వహించామని యూపీ ప్రభుత్వం సుప్రీంకు తెలియజేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!