వెయ్యికిపైగా చైనీయుల వీసాలు రద్దు..!
భద్రతా కారణాలతో అమెరికా నిర్ణయం
విద్యార్థి వీసాలను చైనా దుర్వినియోగం చేస్తోందని ఆరోపణ
వాషింగ్టన్: చైనాపై అగ్రరాజ్యం అమెరికా ప్రతీకార చర్యలు కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటివరకు వెయ్యి మందికిపైగా చైనీయుల వీసాలను రద్దు చేసినట్లు తాజాగా ప్రకటించింది. భద్రతాపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా విదేశాంగశాఖ వెల్లడించింది. మే నెలలో అమెరికా అధ్యక్షుడి ప్రకటన ఆధారంగా ఈ వీసాల రద్దు చేసినట్లు పేర్కొంది. ‘చైనా నుంచి అమెరికాకు వస్తోన్న విద్యార్థులు, పరిశోధకులకు చైనా మిలటరీతో సంబంధాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి వారు అమెరికాకు చెందిన సమాచారాన్ని తస్కరించకుండా నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ చీఫ్ చాడ్ వోల్ఫ్ వెల్లడించారు. చట్టవ్యతిరేక వ్యాపార పద్ధతులు, గూఢచర్యం పేరుతో అమెరికా మేధో సంపత్తితోపాటు కరోనా వైరస్ పరిశోధనా సమాచారాన్ని తస్కరించేందుకు విద్యార్థి వీసాలను చైనా దుర్వినియోగం చేస్తోందని చాడ్ వోల్ఫ్ మరోసారి ఆరోపించారు.
హాంగ్కాంగ్లో చైనా ఆగడాలను ఆరికట్టే చర్యల్లో భాగంగా ఈ మధ్యే అమెరికా అధ్యక్షుడు వెలువరించిన ప్రకటన కింద ఈ వీసా రద్దు చర్యలు తీసుకుంటున్నామని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఇందులోభాగంగానే ఇప్పటివరకు వెయ్యికిపైగా చైనీయుల వీసాలను రద్దు చేశామని పేర్కొన్నారు. అయితే, ఇలాంటి ప్రమాదం పొంచివున్న విద్యార్థుల సంఖ్య తక్కువేనని, ఇక్కడి చట్టాలకులోబడి వచ్చే విద్యార్థులు, పరిశోధకులకు అమెరికా ఎప్పుడూ ఆహ్వానం పలుకుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారికి చైనాయే కారణమంటూ ఆ దేశం తీరుపై అమెరికా గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా చైనాలోని షిన్జియాంగ్ ప్రాంతంలో కార్మికులను అణచివేతకు గురవుతున్న విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. దీంతో అక్కడినుంచి వచ్చే వస్తువులను అమెరికా మార్కెట్లోకి రాకుండా నిరోధిస్తామని స్పష్టం చేసింది. అంతేకాకుండా హాంగ్కాంగ్ విషయంలోనూ చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అమెరికా.. ఇలా సమయం దొరికినప్పుడల్లా ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలాఉంటే, అమెరికాలో దాదాపు 3లక్షల 60వేల మంది చైనీయులు ఉన్నత విద్యతోపాటు పరిశోధనలు కొనసాగిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Anubrata Mondal: 30 కార్ల కాన్వాయ్తో వచ్చి.. తృణమూల్ ‘బాహుబలి’ని అరెస్టు చేసి!
-
General News
Andhra News: ఆ బకాయిలపై సమాధానం చెప్పండి: ఏపీకి సుప్రీంకోర్టు నోటీసులు
-
India News
Modi - Raksha Bandhan: పీఎంవో సిబ్బంది కుమార్తెలతో మోదీ రక్షా బంధన్.. చూస్తారా!
-
Crime News
హైదరాబాద్ వచ్చేందుకు పాకిస్థానీ యువతి యత్నం.. నగర పోలీసుల ఆరా..
-
General News
YS Vijayamma: వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం
-
India News
IT Raids: వ్యాపారి ఇళ్లల్లో నోట్ల గుట్టలు.. లెక్కించడానికే 13 గంటలు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (11/08/2022)
- Vishal: షూటింగ్లో ప్రమాదం.. నటుడు విశాల్కు తీవ్ర గాయాలు
- Prashant Kishor: నీతీశ్ అందుకే భాజపాను వీడారు..!
- Hanumakonda: రైలెక్కించి పంపారు.. కాగితాల్లో చంపారు
- Viral Video: చీమల్ని తిన్న వీడియోకు 10మిలియన్ల వ్యూస్!
- Rohit sharma: ఈ ప్లాన్తోనే భారత క్రికెట్కు మంచి భవిష్యత్ను అందిస్తాం: రోహిత్ శర్మ
- సెక్స్ కోరే అమ్మాయిలు వేశ్యలతో సమానం: నటుడు వివాదాస్పద వ్యాఖ్యలు
- Heart Attack: గుండెపోటు ఎలా వస్తుందో తెలుసా..?
- Aamir Khan: ‘గత 48గంటల నుంచి నేను నిద్రపోలేదు’ : ఆమిర్ఖాన్
- Shilpa Shetty: చిత్రీకరణలో గాయపడ్డ శిల్పాశెట్టి