మోడెర్నా టీకా: యూఎస్ వైద్యుడికి తీవ్ర అలర్జీ
మోడెర్నా కొవిడ్-19 టీకాను స్వీకరించిన ఓ వైద్యుడికి తీవ్ర అలర్జీ లక్షణాలు కనిపించినట్లు అమెరికన్ మీడియా వెల్లడించింది. బోస్టన్కు చెందిన ఆ వైద్యుడికి అంతకు ముందే షెల్ఫిష్(షెల్ ఫిష్ తిన్నవెంటనే వచ్చే అలర్జీ) అలర్జీ ఉండటం గమనార్హం.
వెల్లడించిన అమెరికన్ మీడియా సంస్థ
వాషింగ్టన్: మోడెర్నా కొవిడ్-19 టీకాను స్వీకరించిన ఓ వైద్యుడికి తీవ్ర అలర్జీ లక్షణాలు కనిపించినట్లు అమెరికన్ మీడియా వెల్లడించింది. బోస్టన్కు చెందిన ఆ వైద్యుడికి అంతకు ముందే షెల్ఫిష్ అలర్జీ ఉండటం గమనార్హం.
ఇటీవల బోస్టన్ మెడికల్ సెంటర్కు చెందిన జెరియాట్రిక్ ఆంకాలజీ వైద్యుడు హొస్సీన్ సదర్జాదేహ్ మోడెర్నా టీకా వేయించుకున్నారు. ఆ వెంటనే తనకు తీవ్ర ప్రతిస్పందనలు కలిగాయని ఆ వైద్యుడు వెల్లడించారు. మైకం కమ్మేసినట్లు, గుండె వేగంగా కొట్టుకున్నట్లు అనిపించిందని తెలిపారు. మోడెర్నా టీకా దేశవ్యాప్త పంపిణీ ప్రారంభమైన తరవాత వెలుగులోకి వచ్చిన సీరియస్ కేసు ఇది. దీనిపై బోస్టన్ మెడికల్ సెంటర్ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఆ వైద్యుడికి వచ్చిన అలర్జీకి సంబంధించి వెంటనే చికిత్స చేయించుకున్నారు. ఎమర్జెన్సీ విభాగానికి తరలించి ఆయన అనారోగ్యానికి గల కారణాలను విశ్లేషించాం. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారు’ అని పేర్కొంది.
ఇదిలా ఉండగా..కొవిడ్ మహమ్మారిని తరిమికొట్టేందుకు అమెరికాలో కొద్దిరోజులుగా మోడెర్నా, ఫైజర్ టీకాల పంపిణీ కార్యక్రమం జరుగుతోన్న సంగతి తెలిసిందే. మోడెర్నా కంటే ముందుగా అమెరికన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఫైజర్ టీకాకు సంబంధించి కూడా అలర్జీ కేసులు వెలుగుచూశాయి. వాటికి గల కారణాలపై ఆ దేశ ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్డీఏ విచారణ జరుపుతోంది.
ఇవీ చదవండి:
యూకే రిటర్న్స్: నాలుగేళ్ల చిన్నారికి కరోనా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా