కరోనా వేళ..గాలికాలుష్యంతో మరింత ముప్పు!
గాలి కాలుష్యం వల్ల కరోనా మరణాల ముప్పు మరింత ఎక్కువగా ఉండే అవకాశాలున్నట్లు తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
అమెరికా పరిశోధనల్లో వెల్లడి
వాషింగ్టన్: కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. గాలి కాలుష్యం వల్ల దీని ముప్పు మరింత పెరిగే అవకాశాలున్నట్లు తాజాగా మరో పరిశోధన వెల్లడించింది. ముఖ్యంగా నైట్రోజన్ డయాక్సైడ్ వాయువు తీవ్ర అస్వస్థతకు గురైన కరోనా రోగుల్లో తీవ్రతను మరింతగా పెంచుతున్నట్లు పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. జనవరి నుంచి జులై వరకు అమెరికాలోని దాదాపు 3,122 ప్రాంతాల్లో గాలిలో ఉండే పార్టికల్ మాటర్(పీఎం2.5), నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోన్ స్థాయిలను సమీక్షించారు. అనంతరం, పట్టణాల్లో ఉండే కాలుష్యం కరోనా తీవ్రతను మరింత పెంచుతున్నట్లు పరిశోధకులు తేల్చారు. తాజాగా ఈ పరిశోధన నివేదిక ది ఇన్నోవేషన్ జర్నల్లో ప్రచురితమయ్యింది.
గాలికాలుష్యం వల్ల కరోనా రోగుల్లో ఎలాంటి ప్రభావాలు ఎదురవుతున్నాయనే విషయంపై అమెరికా శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా కొవిడ్ మరణాలు సంభవిస్తున్న తీరును పరిగణనలోకి తీసుకున్నారు. ముఖ్యంగా కొవిడ్ మరణాల రేటు, మరణాల సంఖ్యను విశ్లేషించారు. కొవిడ్ సోకిన వ్యక్తి మరణించడంలో కేవలం నైట్రోజన్ డయాక్సైడ్ వాయువు పాత్ర కీలకంగా ఉన్నట్లు పరిశోధనలో గుర్తించారు. ముఖ్యంగా నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయి గాలిలో 4.6పీపీబీ (పార్ట్స్ పర్ బిలియన్) పెరుగుదలతో 11శాతం కొవిడ్ మరణాలు పెరుగుతున్నట్లు గ్రహించారు. ఇది కొవిడ్ మరణాల రేటులో 16శాతం. కేవలం నైట్రోజన్ డయాక్సైడ్ వాయువు 4.6పీపీబీకి తగ్గించగలిగినట్లయితే దాదాపు 14,672మంది కొవిడ్ సోకిన వారిని మృత్యువు నుంచి కాపాడవచ్చని పరిశోధకులు తేల్చారు. వీటితోపాటు పీఎం2.5 కాలుష్యకారకాల ప్రభావం కొవిడ్ మరణాలపై స్వల్పంగా ఉండగా.. ఓజోన్ ప్రభావం మాత్రం అంతగా లేదని పరిశోధనా బృందం తేల్చింది.
దీర్ఘకాలంతో పాటు స్వల్ప సమయంలో కూడా గాలికాలుష్యానికి గురైనప్పుడు వీటి ప్రభావం మానవ శరీరంపై కచ్చితంగా ఉంటుందని పరిశోధకులు స్పష్టంచేస్తున్నారు. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి, తీవ్రమైన మంట కలిగించడంతోపాటు శ్వాసకోశ వ్యాధులు ప్రమాదాన్ని మరింత పెంచుతాయని అమెరికాలోని ఎమోరీ యూనివర్సిటీ శాస్త్రవేత్త డోంఘై లియాంగ్ అభిప్రాయపడ్డారు. దీంతో పట్టణాల్లోని గాలికాలుష్యం వల్ల తీవ్ర అస్వస్థతకు గురైన కొవిడ్ రోగులు మరణాలకు దారితీస్తుందని పేర్కొంటున్నారు. నైట్రోజన్ డయాక్సైడ్ వాయువు ఎక్కువ మోతాదులో ఉండే న్యూయార్క్, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, ఆరిజోనా రాష్ట్రాల్లోని మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో నివసించే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
కరోనావైరస్ శ్వాసకోశ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ఇప్పటికే పలు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శ్వాసకోశ వ్యాధిగ్రస్తులున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. న్యూమోనియా, ఆస్తమా వంటి వ్యాధులతోపాటు చలికాలంలో గాలి కాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధులు మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఏటా 70 లక్షల మంది వాయుకాలుష్యం మూలంగా ప్రాణాలు కోల్పోతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఇలాంటి సమయంలో కేవలం అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం తీవ్రత అధికంగా ఉన్న నగరాల్లో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టడంతోపాటు ప్రజలు తగుజాగ్రత్తలు తీసుకోవాలని నిపుణలు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది. -
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
వచ్చే ఏడాదిలో నిర్వహించే పలు ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన తేదీలతో యూపీఎస్సీ క్యాలెండర్ను విడుదల చేసింది. UPSC 2025 Calendar -
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
India-US: భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ అమెరికా ఇచ్చిన నివేదికపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. అది పూర్తి పక్షపాతంగా ఇచ్చారని దుయ్యబట్టింది. -
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్పై ప్రధాని మోదీ (Modi) తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై తాజాగా మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు. -
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
క్రికెట్ అభిమానులు జాగ్రత్తగా ఉండండి..! చెన్నై ఆటగాడు ధోనీ (MS Dhoni) పేరుతో ఓ ఇన్స్టా మెసేజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా