వందేభారత్‌ మిషన్‌: 10లక్షల మంది వెనక్కి!

వివిధ దేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే వందేభారత్‌ మిషన్‌ ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఐదో దశలో భాగంగా భారతీయులను వెనక్కి తీసుకొస్తున్నారు.

Published : 12 Aug 2020 17:51 IST

కొనసాగుతుతోన్న వందేభారత్‌ మిషన్‌ ఐదో ఫేజ్‌

దిల్లీ: కరోనా విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా విమానయానంపై ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో వివిధ దేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే వందేభారత్‌ మిషన్‌ ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఐదో దశలో భాగంగా భారతీయులను వెనక్కి తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 10లక్షల మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి వెల్లడించారు. 

మరో లక్షా 33వేల మంది వివిధ దేశాలకు తరలివెళ్లినట్లు కేంద్రమంత్రి తెలిపారు. మే 7న ప్రారంభమైన ఈ మిషన్ ప్రస్తుతం ఐదో ఫేజ్‌ కొనసాగుతోంది. ఆగస్టు ఒకటో తేదీన ప్రారంభమైన వందేభారత్‌ ఫేజ్‌-5 ఈనెల 31వరకు కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ దశలో దాదాపు 53దేశాల నుంచి 700 విమానాల ద్వారా మరో లక్షా 20 వేల మందిని స్వదేశానికి తీసుకురానున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని