హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి దీపావళి వేడుకలు

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దీపావళి వేడుకలను హైదరాబాద్‌లో జరుపుకొన్నారు. నగరంలోని ఆయన కుమారుడి నివాసంలో దీపాలు వెలిగించారు. తన సతీమణి ఉషా నాయుడుతో కలిసి వెంకయ్యనాయుడు...........

Published : 14 Nov 2020 20:11 IST

హైదరాబాద్‌: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దీపావళి వేడుకలను హైదరాబాద్‌లో జరుపుకొన్నారు. నగరంలోని ఆయన కుమారుడి నివాసంలో దీపాలు వెలిగించారు. తన సతీమణి ఉషానాయుడుతో కలిసి వెంకయ్యనాయుడు దీపాలు వెలిగించి వేడుకలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇతర కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. దీపం వెలుగులతో చీకటి మాయమైనట్లే.. దీపావళి కాంతులతో అందరి జీవితాల్లో మంచి మార్పు రావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయంగా జరుపుకొనే ఈ దీపావళి స్ఫూర్తితో అందరం ఆత్మస్థైర్యాన్ని పొంది.. ఆత్మనిర్భర భారత్‌ నిర్మాణం దిశగా కంకణబద్ధులమవుదామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచించినట్టుగా ఈసారి దీపావళి సందర్భంగా జవాన్ల త్యాగాన్ని గౌరవిస్తూ.. వారి కోసం ఒక దీపాన్ని వెలిగించి వారికి సంఘీభావాన్ని తెలియజేద్దామని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని