మాతృభాషపై ప్రేమంటే ఏ భాషా నేర్చుకోవద్దనికాదు!
మాతృభాషపై ప్రేమ పెంచుకోవడమంటే ఇతర భాషలు నేర్చుకోవద్దని కాదని, అన్ని బాషలు నేర్చుకొని మాతృభాషను మనసులో నిలుపుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగు భాషా దినోత్సవం ........
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
దిల్లీ: మాతృభాషపై ప్రేమ పెంచుకోవడమంటే ఇతర భాషలు నేర్చుకోవద్దని కాదని, అన్ని బాషలు నేర్చుకొని మాతృభాషను మనసులో నిలుపుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యవహారిక భాషోద్యమ నేత గిడుగు రామ్మూర్తి పంతులుకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ‘‘మన భాష- మన సమాజం- మన సంస్కృతి’’ పేరుతో దక్షిణాఫ్రికా తెలుగు సమాఖ్య అంతర్జాల సదస్సు నిర్వహించడం అభినందనీయని ట్వీట్ చేశారు. ప్రపంచం నలుమూలల నుంచి హాజరైన ఇతర సంస్థలను ఆయన అభినందించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు రామ్మూర్తి విజ్ఞానం అందరికీ అందాలనే సంకల్పంతో వ్యవహారిక భాషోద్యమానికి నాంది పలికారని కొనియాడారు. పుస్తకాల్లోనూ సులభమైన భాషను వాడాలని ఉద్యమించారని గుర్తుచేశారు. తద్వారా తెలుగు భాషాభివృద్ధిని కాంక్షించారన్నారు. మాతృభాషను కాపాడుకోవడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అన్నారు.
ఆదర్శవంతమైన సమాజ నిర్మాణానికి భాష, సంస్కృతులే పునాది అని వెంకయ్యనాయుడు అన్నారు. ప్రైవేటీకరణ నేపథ్యంలో పలు భాషలు అంతరించే ప్రమాదంలో పడ్డాయని పేర్కొన్న ఆయన.. వాటిని కాపాడుకోవాలని కోరారు. మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తూనే ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, రష్యా, జపాన్, ఇటలీ, బ్రెజిల్ దేశాల ఒరవడిని ఆదర్శంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పురోభివృద్ధి కోరుకొనేవారు పూర్వ వృత్తాన్ని మరవకూడదన్న పెద్దల మాటను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మన కట్టు, బొట్టు, భాష, యాస, పండుగలు, పబ్బాలు.. ఇలా అన్నింటినీ గౌరవించుకొని మన సంస్కృతిని కాపాడుకోవాలని, ముందుతరాలకు అందించాలని కోరారు. భాష ద్వారా మంచి సంస్కృతి, తద్వారా ఆదర్శమంతమైన సమాజ నిర్మాణం దిశగా ప్రతిఒక్కరూ చొరవ తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
తెలుగులో ప్రధాని మోదీ ట్వీట్
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఆయన తెలుగులో ట్వీట్ చేసి ఆకట్టుకున్నారు. తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్న అందరికీ, ముఖ్యంగా యువతకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. తన సాహిత్యంతో, సాంఘిక సంస్కరణ దృక్పథంతో ఎన్నో తరాలపై చెరగని ముద్రవేసిన గిడుగు వేంకట రామ్మూర్తి పంతులుకు నివాళులర్పిస్తున్నట్టు ట్విటర్లో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని