కొత్తరకం వైరస్పై WHO ఏమందంటే..!
యునైటెడ్ కింగ్డమ్లో బయటపడ్డ కొత్తరకం కరోనా వైరస్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టి సారించింది.
లండన్: యునైటెడ్ కింగ్డమ్లో బయటపడ్డ కొత్తరకం కరోనా వైరస్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టి సారించింది. విస్తృత వేగంతో వైరస్ వ్యాపిస్తోందని వస్తోన్న వార్తలపై స్పందించిన డబ్ల్యూహెచ్ఓ.. వైరస్పై సమగ్ర సమాచారం తెలిసేవరకు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ‘యూకే అధికారులతో అనుక్షణం సంప్రదింపులు జరుపుతున్నాం. వారు చేస్తోన్న పరిశోధనలు, విశ్లేషణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు మాకు అందిస్తున్నారు. వైరస్కు సంబంధించిన పూర్తి సమాచారం మాకు అందిన వెంటనే దాన్ని ప్రజలకు వెనువెంటనే చేరవేస్తాం’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ సమయంలో వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఆయా ప్రభుత్వాల సూచనల మేరకు ప్రజలందరూ అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తిచేసింది.
విమాన ఆంక్షలు విధిస్తోన్న దేశాలు..
యూకేలో బయటపడ్డ కొత్తరకం కరోనా వైరస్తో దేశాలన్నీ మరోసారి అప్రమత్తమవుతున్నాయి. ముందుజాగ్రత్త చర్యగా యూకే వచ్చిపోయే అంతర్జాతీయ విమాన సర్వీలపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నాయి. ఇప్పటికే ఐరోపాలోని పలు దేశాలు వివిధ దేశాలకు అంతర్జాతీయ విమానాలను రద్దుచేయగా, తాజాగా కెనడా కూడా యూకేకు నడిచే విమాన సర్వీసులను నిలిపివేసింది. ప్రస్తుతం 72 గంటలపాటు సర్వీసులను నిలిపివేస్తున్నామని.. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు.
అదే దారిలో మరిన్ని దేశాలు..
యూకేలో కొత్తరకం వైరస్పై ఆందోళన పెరుగుతోన్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా మరిన్ని దేశాలు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, చిలీ, కొలంబియా దేశాలు యూకేకు విమానాలను రద్దు చేశాయి. ఈక్వెడార్ కూడా ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. యూకేకు మరో 48గంటలపాటు విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. ఇదే దారిలో ఐర్లాండ్ కూడా నిర్ణయం తీసుకుంది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఇటలీ కూడా యూకే నుంచి విమానాలను నిలిపివేసింది. మరో అడుగు ముందుకు వేసిన ఇటలీ.. గడిచిన రెండు వారాల్లో ఎవరైనా బ్రిటన్ సందర్శిస్తే..వారిని కూడా ఇటలీలోకి అనుమతించడం లేదు. ఇక పోర్చుగల్ మాత్రం తమ పౌరులను మాత్రమే యూకే నుంచి అనుమతిస్తోంది. అది కూడా కొవిడ్ నెగటివ్ రిపోర్టు ఉన్నవారిని మాత్రమే విమానాల్లో అనుమతిస్తున్నారు. బ్రిటన్లో కొత్తరకం వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే విమానాలపై 24గంటలపాటు ఆంక్షలు ఉంటాయని బెల్జియం ఇప్పటికే ప్రకటించింది. సౌదీ అరేబియా, టర్కీ, ఇజ్రాయిల్, నెదర్లాండ్స్, లాత్వియా, ఎస్టోనియా, చెక్ రిపబ్లిక్లు యూకే, దక్షిణాఫ్రికా దేశాలకు నడిచే విమానాలపై తాత్కాలికంగా ఆంక్షలు విధించాయి. యూకే పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు.
కఠిన లాక్డౌన్ ఆంక్షలు..
కొత్తరకం కరోనా వైరస్తో అప్రమత్తమైన బ్రిటన్ ప్రభుత్వం కఠిన లాక్డౌన్ అమలు చేస్తోంది. క్రిస్మస్ వేళ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం అక్కడి టైర్-4 నిబంధనలను అమలు చేస్తోంది. ఇక యూకేకు ప్రపంచ దేశాలు విమాన సర్వీసులు ఆంక్షలు విధిస్తోన్న నేపథ్యంలో ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ నేతృత్వంలో అత్యవసర సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ఇవీ చదవండి..
బ్రిటన్లో కొత్త కలవరం
కొత్త రకం కరోనాపై టీకా పనిచేస్తుందా?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!