టీకా తీసుకునే సమయం కోసం చూస్తున్నాను: ట్రంప్

సాధారణ ప్రజలకంటే శ్వేతసౌధంలోని ఉన్నతాధికారులకు మొదట కొవిడ్‌-19 టీకా ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వెలువడిన క్రమంలో.. తన సిబ్బంది టీకా కోసం వేచిచూడాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు.

Published : 15 Dec 2020 01:51 IST

శ్వేతసౌధ సిబ్బంది కొంతకాలం వేచిచూడాలన్న అధ్యక్షుడు

వాషింగ్టన్: సాధారణ ప్రజలకంటే శ్వేతసౌధంలోని ఉన్నతాధికారులకు మొదట కొవిడ్‌-19 టీకా ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వెలువడిన క్రమంలో.. తన సిబ్బంది టీకా కోసం వేచిచూడాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు.  ‘ప్రత్యేకంగా అవసరమైతే తప్ప, టీకా కార్యక్రమంలో భాగంగా శ్వేతసౌధంలో పనిచేసే సిబ్బంది కొంతకాలం తరవాత టీకా తీసుకోవాలి. నేను టీకా తీసుకునేందుకు ఎలాంటి ప్రణాళిక వేసుకోలేదు. అయితే, సరైన సమయంలో దాన్ని తీసుకోవడానికి ఎదురుచూస్తున్నాను’ అని ట్రంప్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. 

ఫైజర్ టీకాకు అమెరికా అనుమతి ఇవ్వడంతో సోమవారం నుంచి ప్రజలకు టీకా పంపిణీ ప్రారంభం కానుంది. సాధారణ ప్రజలకంటే ముందుగా శ్వేతసౌధంలోని ఉన్నతాధికారులకు టీకా ఇస్తారని వార్తలు వెలువడ్డాయి. అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే సిబ్బంది తొలుత దాన్ని తీసుకుంటారని సంబంధిత అధికారులు తెలిపారు. తాజాగా ట్రంప్ మాత్రం తమ సిబ్బందిని వేచి ఉండాలని సూచించారు. 

ఇదిలా ఉండగా..తొలివిడత టీకా కార్యక్రమంలో భాగంగా అమెరికా వ్యాప్తంగా 30 లక్షల డోసులను పంపిణీ చేయనున్నారు. వీటిని ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ యూనిట్స్‌లో పనిచేస్తోన్న వైద్య సిబ్బంది, నర్సింగ్ హోమ్‌ల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ఇవ్వనున్నారు. తర్వాత మళ్లీ మూడు వారాలకు వీరందరికి రెండో డోసు అందిస్తారు.

ఇవీ చదవండి:

నీరు లేక..కొవిడ్ బారిన..

అమెరికా..ఊపిరి పీల్చుకో

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని