26 గంటలు శిథిలాల కిందే..

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో భవనం కూలిన ఘటనలో ఓ మహిళ..

Updated : 26 Aug 2020 13:51 IST

క్షేమంగా బయటపడ్డ ఓ మహిళ

ముంబయి: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో భవనం కూలిన ఘటనలో ఓ మహిళ 26 గంటలపాటు శిథిలాల కింద బిక్కుబిక్కుమంటూ గడిపింది. ఒక రోజు గడిచిపోవడంతో మిగతావారు ఎవరూ బతికి ఉండరేమో అని భావిస్తున్న సమయంలో మేరున్నీస అబ్దుల్‌ హమీద్‌‌ కాజీ ప్రాణాలతో బయటపడటంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఆమెను సురక్షితంగా బయటకు తీసిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాయి. ఇదే ఘటనలో ఓ నాలుగేళ్ల బాలుడు 18 గంటల తర్వాత క్షేమంగా బయటపడ్డ సంగతి తెలిసిందే.

రాయ్‌గఢ్‌ జిల్లా కాజల్‌పురా ప్రాంతం మహద్‌ పట్టణంలో సోమవారం సాయంత్రం ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. దాదాపు 75 మంది భవన శిథిలాల కింద చిక్కుకుపోగా ఇప్పటివరకు 60 మందికి పైగా నివాసితులను సహాయక బృందాలు కాపాడాయి. 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పలువురిపై కేసులు నమోదు చేశారు. బిల్డర్‌తోపాటు ఆర్కిటెక్ట్‌పై పలు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని