భారత్తో కయ్యం.. జిన్పింగ్ సీటుకే ఎసరు!
భారత్తో కయ్యానికి విఫలయత్నం చేసిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తన సీటు కిందకు తానే నీరు తెచ్చుకుంటున్నారు. భారత్ని కవ్వించి భంగపడ్డ ఆయన తన ప్రాబల్యం తగ్గిందని తానే బహిర్గతం చేసుకున్నారు.........
అంతర్జాతీయ పత్రిక ‘న్యూస్వీక్’లో ఆసక్తికర కథనం
ఇంటర్నెట్ డెస్క్: భారత్తో కయ్యానికి విఫలయత్నం చేసిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తన సీటు కిందకు తానే నీరు తెచ్చుకుంటున్నారు. భారత్ని కవ్వించి భంగపడ్డ ఆయన తన ప్రాబల్యం తగ్గిందని తానే బహిర్గతం చేసుకున్నారు. వాస్తవాధీన రేఖ వెంట అతిక్రమణలకు పాల్పడి ఏకంగా తన రాజకీయ జీవితాన్నే పణంగా పెట్టుకుంటున్నారు. ఈ మాటలు అన్నది అమెరికాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు గోర్డన్ జీ చాంగ్. ‘ది కమింగ్ కొలాప్స్ ఆఫ్ చైనా’ అనే పుస్తకం రాసిన ఈయన భారత్తో చైనా వివాదాలపై తన అభిప్రాయాల్ని ‘న్యూస్వీక్’ అనే ప్రముఖ అంతర్జాతీయ పత్రికలో ప్రచురించారు. ఆ వివరాల ప్రకారం..
భారత్పై చైనా దుందుడుకు వైఖరిని పథక రచన చేసింది షీ జిన్పింగే. ఆయన అధికారం చేపట్టిన తర్వాత భారత్ పట్ల చైనా దూకుడుగా వ్యవహరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఇటీవల వాస్తవాధీన రేఖ వెంట జరిగిన అతిక్రమణలు ఘోరంగా విఫలమయ్యాయి. జిన్పింగ్ ఒత్తిడితో ముందుకు సాగిన ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ’ అనేక ఎదురుదెబ్బలు చవిచూడాల్సి వచ్చింది. భారత్ను ఎదుర్కోలేక చావు దెబ్బ తిన్న జిన్పింగ్ పరువు దక్కించుకొనేందుకు త్వరలోనే మరో భారీ అతిక్రమణకు పాల్పడే అవకాశం ఉందని గోర్డన్ విశ్లేషించారు.
1962 యుద్ధం తర్వాత భారత్ రక్షణాత్మక ధోరణి అవలంబిస్తూ వస్తుండడంతో చైనా అనేక సార్లు దాన్ని అదునుగా వాడుకొని అతిక్రమణలకు పాల్పడిందని గోర్డన్ చెప్పకొచ్చారు. అయితే, భారత్ వైఖరి ప్రస్తుతం చాలా మారిందని.. ప్రతిదాడికి ఏమాత్రం వెనుకాడడం లేదని విశ్లేషించారు. జూన్లో గల్వాన్లో జరిగిన ఘర్షణను అందుకు నిదర్శనంగా ఉటంకించారు. ఈ దాడిలో భారత్కు చెందిన సైనికులు 20 మంది మరణించగా.. చైనా 43 మందిని కోల్పోయిందని గుర్తుచేశారు. ఇక ఇటీవల పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలో కీలక పర్వత ప్రాంతాల్ని స్వాధీనం చేసుకోవడం పట్ల చైనా సైతం కంగు తిన్నదని కుండబద్దలు కొట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ను చైనా ఏ మేరకు ఎదుర్కోగలదన్నది ప్రశ్నార్థకమేనని తెలిపారు. చివరి సారిగా 1979లో వియత్నాంతో చైనా నేరుగా సైనిక ఘర్షణకు దిగింది. దీంట్లో చైనా అనుకున్న మేర విజయం సాధించలేకపోయింది. అనంతరం భారీ స్థాయిలో సైనిక, ఆయుధ ఆధునికీకరణకు శ్రీకారం చుట్టింది. అయినా, యుద్ధ క్షేత్రంలో వారి సామర్థ్యం తగిన స్థాయిలో లేదని తాజా ఘటనల్ని చూస్తే అర్థమవుతోందని గోర్డన్ అభిప్రయపడ్డారు.
ఆక్రమణదారులకు భారత్ ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. సరికొత్త ధైర్య సాహసాల్ని ప్రదర్శిస్తూ ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో షీ జిన్పింగ్ తన ప్రభావాన్ని చాటుకునేందుకు మరోసారి పీఎల్ఏను వాడుకోవచ్చు. భారత్ పైకి దాడికి ఎగదోయవచ్చు. ఇలా తన రాజకీయ ప్రయోజనాల కోసం జిన్పింగ్ మిలిటరీని విస్తృత స్థాయిలో వాడుకోవడం పీఎల్ఏలోని ఓ వర్గానికి ఏమాత్రం ఇష్టం లేదు. ఈ సారి జిన్పింగ్ ఒత్తిడికి తలొగ్గి భారత్పై ఘర్షణకు దిగినా పై చేయి సాధించడం మాత్రం అనుమానమే. అదే జరిగితే పీఎల్ఏలో ఆయనపై ఉన్న వ్యతిరేకత తీవ్ర రూపం దాల్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే మాజీ సైనికుల పట్ల జిన్పింగ్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై చైనా వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రకంగా భారత్తో తలపడుతూ.. జిన్పింగ్ తన సీటుకే ఎసరు పెట్టుకుంటున్నారని గోర్డన్ విశ్లేషించారు. పొరుగుదేశాల్ని బెదిరింపులతో లొంగదీసుకోవాలన్న జిన్పింగ్ వైఖరి ఇప్పటికే బెడిసి కొడుతున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?