మెదడును చదివే పరికరం వచ్చేసింది!
శరీరంలో ప్రతి అవయవ పని తీరును తెలుసుకునేందుకు సరికొత్త పరిజ్ఞానం అందుబాటులో ఉంది. మానవ హృదయం రక్తాన్ని ఎలా పంపు చేస్తుందో లైవ్లో ఓ కంప్యూటర్ తెరమీదనే చూసే సాంకేతికతను మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కేవలం గుండె మాత్రమే కాదు ఊపిరిత్తులు...
ఇంటర్నెట్డెస్క్: శరీరంలో ప్రతి అవయవ పని తీరును తెలుసుకునేందుకు సరికొత్త పరిజ్ఞానం అందుబాటులో ఉంది. మానవ హృదయం రక్తాన్ని ఎలా పంపు చేస్తుందో లైవ్లో ఓ కంప్యూటర్ తెరమీదనే చూసే సాంకేతికతను మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కేవలం గుండె మాత్రమే కాదు ఊపిరిత్తులు, కాలేయం, మూత్రపిండాలు ఇలా అన్ని అవయవాల పని తీరును నిర్ధిష్టంగా అంచనా వేయవచ్చు. కానీ, మానవ మెదడు ఎలా పని చేస్తుంది? ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాడీ కణాలు ఎలా ప్రతిస్పందిస్తాయో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. మరి కొన్ని రోజుల్లో అది కూడా సాకారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికాకు చెందిన ‘కెర్నల్’ అనే అంకుర సంస్థ దీని కోసం ప్రత్యేకంగా హెల్మెట్ లాంటి రెండు పరికరాలను అభివృద్ధి చేసింది. దీని ద్వారా మెదడు పని తీరును తెలుసుకునే వీలుంటుంది.
అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ తాజాగా తాము రూపొందించిన హెల్మెట్లను పదుల సంఖ్యలో మార్కెట్లోకి తీసుకురానుంది.వీటి విలువ 50 వేల డాలర్లు. అయితే మెదడును చదివే టెక్నాలజీ ఇప్పటికే కొంతవరకు అభివృద్ధి చెందింది. అయితే ఇప్పుడున్న టెక్నాలజీతో మెదడును పని తీరును తెలుసుకునే ఎలక్ట్రానిక్ యంత్రాలు భారీ పరిమాణంలో పెద్ద మొత్తంలో స్థలాన్ని ఆక్రమిస్తాయి. అంతేకాకుండా ఎవరి మెదడును పరీక్షించాలనుకున్నారో ఆ వ్యక్తి ఆ గదిలోనే ఉండాల్సి ఉంటుంది. కానీ, అభివృద్ధి చేసిన పరికరం మాత్రం హెల్మెట్ పరిమాణంలోనే ఉంటుంది. అంతేకాకుండా ఎక్కడకు కావాలంటే అక్కడికి దీనిని తీసుకెళ్లే వెసులుబాటు ఉంటుంది.
కెర్నల్ అభివృద్ధి చేసిన పరికరాల్లో రెండు రకాలున్నాయి. 1. ఫ్లో 2. ఫ్లక్స్. ఫ్లో - బ్రెయిన్ ఇంటర్ఫేస్ ద్వారా మెదడు రియల్ టైం డేటాను రికార్డు చేయవచ్చు. అంతేకాకుండా దానికి అమర్చిన లేజర్ పరికరాల ద్వారా మెదడు కార్యకలాపాలను కచ్చితత్వంతో తెలుసుకునే వీలుంటుంది. హెల్మెట్కు అమర్చిన యూఎస్బీ కేబుల్ ద్వారా కంప్యూటర్కు కనెక్ట్ చేసినట్లయితే మెదడు పని తీరును తెరపై వీక్షించవచ్చు.
ఫ్లక్స్ హెల్మెట్ ద్వారా మెదడులోని నాడీకణాల (న్యూరాన్లు) వేగాన్ని పరిశీలించవచ్చు. ఏ పని చేస్తున్నప్పుడు న్యూరాన్లు ఎలా ప్రతిస్పందిస్తు్న్నాయో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు సంతోషంగా ఉన్నప్పుడు, బాధ సమయంలోనూ, కోపం వచ్చినప్పుడు ఇలా వివిధ సందర్భర్లాల్లో నూరాన్లు ఎలా స్పందిస్తున్నాయో, దానికి అనుగుణంగా మెదడు ఎలా నిర్ణయాలు తీసుకుంటుందో తెలుసుకునే వీలుంటుంది.అయితే ఈ రెండు హెల్మెట్లు కలిపి 50 వేల డాలర్లా? లేదా ఒక్కో హెల్మెట్ ధర 50 వేల డాలర్లా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఎలా పని చేస్తుంది?
హెల్మెట్ లాంటి పరికరాన్ని వ్యక్తి తలకు అమరుస్తారు. హెల్మెట్లోని లేజర్ కిరణాలు పుర్రె ద్వారా మెదడులోకి ప్రవేశిస్తాయి. మెదడులో కోట్ల సంఖ్యలో న్యూరాన్లు ఉంటాయి. మనకు ఎలాంటి భావోద్వేగం కలిగినా ఇవి ప్రతిస్పందిస్తాయి. అంతేకాకుండా మన ఆలోచనల్నింటికీ ఇవే మూలం. అందువల్ల మెదడులోకి ప్రవేశించిన లేజర్ కిరణాలు న్యూరాన్ల పని తీరును పసిగట్టి ఆ ప్రక్రియను రికార్డు చేస్తాయి. ‘మాగ్నెటోఎన్స్ఫలోగ్రఫీ’ ద్వారా మెదడు పని తీరును చిత్రీకరిస్తాయి. ఎలాంటి సందర్భాల్లో ఎలా ప్రతిస్పందిస్తున్నామో ఇవి తెలుసుకుంటాయి.ఫ్లో హెల్మెట్ పరికరం ద్వారా రక్తంలోని ఆక్సిజన్స్థాయిలను కూడా తెలుసుకోవచ్చు. తొలుత వీటిని మెదడుపై పరిశోధన చేసే సంస్థలకు పంపిణీ చేయనున్నారు. ఎవరైనా ప్రవేటు వ్యక్తులు ఆసక్తి ఉంటే కొనుగోలుచేయవచ్చని కెర్నల్ సంస్థ సీఈవో జాన్సన్ వెల్లడించారు.
నష్టమూ ఉంటుందా?
కెర్నల్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ పరికరాల వల్ల నష్టమూ ఉంటుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు, తమ సిబ్బందితో వీటిని ధరింపజేసి వారి మనసులో ఏముందో తెలుసుకునే వీలుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ పరికరాలను సక్రమ మార్గంలో ఉపయోగిస్తే ఎంతో మేలుంటుందని కెర్నల్ యాజమాన్యం చెబుతోంది. ముఖ్యంగా మానసిక రోగుల స్థితిని అంచనా వేసి వారిని మామూలు మనుషులుగా చేసేందుకు దీనిని ఉపయోగించుకోవచ్చని చెబుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు