Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
ఏడేళ్ల వయసులో కిడ్నాప్కు గురై తన కుటుంబానికి దూరమైన ఓ బాలిక తొమ్మిదేళ్ల తర్వాత తిరిగి తన సొంతింటికి చేరింది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా ఉన్న......
ముంబయి: ఏడేళ్ల వయసులో కిడ్నాప్కు గురై తన కుటుంబానికి దూరమైన ఓ బాలిక తొమ్మిదేళ్ల తర్వాత తిరిగి తన సొంతింటికి చేరింది. సస్పెన్స్ థ్రిల్లర్ని తలపించేలా ఉన్న ఈ ఘటన మహారాష్ట్ర ముంబయిలోని అంధేరిలో వెలుగుచూసింది. అయితే, బాలిక తిరిగి తన కుటుంబాన్ని చేరడానికి ఓ డిజిటల్ మిస్సింగ్ పోస్టరే కీలక ఆధారంగా పనిచేసింది. వివరాల్లోకి వెళ్తే.. అది 2013 జనవరి 22. పూజ (7) ఉదయాన్నే తన సోదరుడితో కలిసి అంధేరిలోని ఓ పాఠశాలకు వెళ్లింది. అయితే, అక్కడ హెన్రీ జోసెఫ్ డిసౌజా అనే వ్యక్తి ఆమెకు ఐస్క్రీమ్ ఆశచూపి కిడ్నాప్ చేశాడు. పూజను ఎవరూ గుర్తు పట్టలేరని నిర్ధారించుకున్నాక హెన్రీ ఆమెను కర్ణాటకలోని ఓ హాస్టల్లో చేర్పించాడు. బాలిక పేరును అన్నె డిసౌజాగా మార్చాడు. అయితే, కొన్నాళ్లకు హెన్రీ దంపతులకు బిడ్డ పుట్టడంతో పూజను తీసుకొచ్చి ఇంటి పనులు చేయించుకోవడంతో పాటు సరిగా చూసుకొనేవారు కాదు. అలా తొమ్మిదేళ్లు గడిచిపోయాయి.
ఆ పోస్టర్లో నాలుగు నెంబర్లు పనిచేయలేదు.. చివరకు..
కానీ, హెన్రీనే తన తండ్రిగా భావిస్తూ వచ్చిన పూజకు ఒక రోజు షాకింగ్ విషయం తెలిసింది. అతడు తాగిన మైకంలో ఉన్నప్పుడు ఆమె తన కూతురు కాదన్న విషయం పూజ వద్దే చెప్పాడు. దీంతో షాక్ అయిన బాలిక.. తన గత ఆనవాళ్లను తెలుసుకొనే ప్రయత్నం చేసింది. ఇందుకోసం తన ఫ్రెండ్ సహకారం తీసుకొని ఇంటర్నెట్లో శోధన కొనసాగించింది. Pooja missing అని వెతకగా.. చివరకు 2013లో తాను మిస్సింగ్ అయినట్టుగా ఉన్న పోస్టర్ ఒకటి కంటపడింది. దాంట్లో ఐదు ఫోన్ నంబర్లు ఉండగా.. నాలుగు నంబర్లు పనిచేయలేదు. చివరకు ఐదో నంబర్కు డయల్ చేయగా.. ఆ నంబర్ ఆమె కుటుంబం పొరుగున నివసించే రఫీక్ అనే వ్యక్తిది. దీంతో పూజ తన గురించి మొత్తం విషయాన్ని చెప్పింది. ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన రఫీక్ వీడియో కాల్ చేసి బాలికను పూజగా గుర్తించాడు. ఆ తర్వాత ఆమె తల్లితో మాట్లాడే ఏర్పాటు చేయించాడు. పూజను చూడగానే తల్లి గుర్తుపట్టి.. మొబైల్ స్క్రీన్పై ఒకరినొకరు చూసుకొని ఉద్వేగానికి లోనయ్యారు.
చివరకు ఈ విషయం పోలీసులకు తెలియడంతో రంగంలోకి దిగారు. డిసౌజాను అరెస్టు చేసి.. పూజను ఆమె కుటుంబంతో కలిపారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తన బిడ్డ ఎక్కడుందో, ఏమైపోయిందో తెలియక నరకయాతన అనుభవించిన ఆ తల్లికి బాలికను చూడగానే పట్టరాని సంతోషంతో కౌగిలించుకున్న దృశ్యాలు అక్కడున్నవారిని భావోద్వేగానికి గురిచేశాయి. అయితే, కిడ్నాపైన తర్వాత పూజ తన తండ్రిని కోల్పోయింది. చిన్నప్పుడు తమనుంచి దూరమైన పూజ మళ్లీ ఇన్నేళ్ల తర్వాత తమను కలుసుకోవడంతో బాలిక తల్లి, సోదరుడి ఆనందానికి అవధుల్లేవు. మరోవైపు, హెన్రీని అరెస్టు చేసిన పోలీసులు కిడ్నాపింగ్, చట్టవ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలపై కేసులు నమోదు చేశారు. పిల్లలు పుట్టకపోవడం వల్లే ఆ దంపతులిద్దరూ బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్టు తెలిపిన పోలీసులు.. ఈ కేసులో అతడి భార్యను కూడా నిందితురాలిగా పేర్కొన్నట్టు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. -
నూడుల్స్లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!
నూడుల్స్లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. -
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు. -
రాహుల్పై పరువు నష్టం కేసు.. విచారణ మే 2కు వాయిదా
కేంద్ర హోం మంత్రి అమిత్షాను ఉద్దేశించి ఆరేళ్ల క్రితం కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై విచారణను ఉత్తర్ప్రదేశ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మే 2కు వాయిదా వేసింది. -
మణిపుర్లో మానవహక్కుల ఉల్లంఘన
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో జాతుల ఘర్షణ అనంతరం గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని అమెరికా పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?