ఊబకాయులను అద్దెకిస్తారట!
జపాన్లో వ్యక్తుల్ని అద్దెకివ్వడం కొత్తేమి కాదు.. ఓదార్పునివ్వడానికి, కాసేపు బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్గా నటించడానికి, ఒకరికి తమ బదులు క్షమాపణ కోరడానికి ఇలా అనేక పనులకు అక్కడ అద్దెకు మనుషులు దొరుకుతారు. ఇలాంటి ప్రతి సర్వీసుల్లోనూ అందంగా, ఆకర్షణీయంగా ఉండేవారికే డిమాండ్
ఇంటర్నెట్ డెస్క్: జపాన్లో వ్యక్తుల్ని అద్దెకివ్వడం కొత్తేమీ కాదు.. ఓదార్పునివ్వడానికి, కాసేపు బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్గా నటించడానికి, ఒకరికి తమ బదులు క్షమాపణ కోరడానికి ఇలా అనేక పనులకు అక్కడ అద్దెకు మనుషులు దొరుకుతారు. ఇలాంటి ప్రతి సర్వీసుల్లోనూ అందంగా, ఆకర్షణీయంగా ఉండే వారికే డిమాండ్ ఉంటుంది. కానీ, ఇటీవల లావుగా ఉండే వారిని కూడా అద్దెకు ఇచ్చేందుకు ఓ సంస్థ ఏర్పాటైంది. ఇప్పటికే పదుల సంఖ్యలో ఆ సంస్థలో ఉద్యోగులుగా మారిపోయారు. ఇంతకీ లావుగా ఉండేవాళ్లను అద్దెకు తీసుకొని ఏం చేస్తారు? అనేగా మీ సందేహం.. అయితే ఇది చదివేయండి..
జపాన్కు చెందిన బ్లిస్ అనే వ్యక్తి లావుగా ఉండే వారి కోసం ‘క్యూ జిల్లా’ పేరుతో ఫ్యాషన్ బ్రాండ్ను ప్రారంభించాడు. బ్రాండ్ ప్రకటనల కోసం లావుగా ఉండే మోడల్స్ను వెతికితే ఎవరూ దొరకలేదట. దీంతో తనకు లావుగా ఉండే మోడల్స్ కావాలని ఓ ప్రకటన ఇచ్చాడు. దీంతో తన కస్టమర్లలోనే చాలా మంది మోడలింగ్ చేస్తామని ముందుకొచ్చారు. దీంతో 2017లో ఊబకాయులకు టాలెంట్ హంట్ పేరుతో కార్యక్రమం నిర్వహించాడు. టాలెంట్ ఉన్నవాళ్లకు మోడల్స్గా అవకాశమిచ్చాడు. అయితే, కొన్నాళ్లకు అతడికో వినూత్న ఆలోచన వచ్చింది. ఊబకాయుల్ని అద్దెకు ఇస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించాడు. అలా ప్రారంభమైందే ‘దెబుకారీ’ సంస్థ.
ఎవరైనా కాస్త లావుగా ఉంటే.. ఎంతో బాధపడిపోతుంటారు. అదే తన కంటే లావుగా ఉన్నవాళ్లు పక్కన ఉంటే కాస్త సన్నగా కనిపిస్తారట. అదే పాలసీని ఇక్కడ ఉపయోగిస్తున్నారు. ఎవరైనా కాస్త లావుగా ఉన్నవాళ్లు ఏ పార్టీకో, మీటింగ్కో వెళ్లినప్పుడు వారి వెంట ఈ ఊబకాయుల్ని తీసుకెళ్తే కాస్త సన్నగా కనిపిస్తారు. దీంతో లావుగా ఉన్నాననే ఆత్మన్యూనత పోయి ధైర్యం వస్తుందట. అలాగే, ఎవరైనా లావుగా ఉండే స్నేహితులు/సన్నిహితులకు దుస్తులు కొనాలంటే ఈ అద్దె ఊబకాయుల్ని వెంట తీసుకెళ్లి షాపింగ్ చేయొచ్చు. శరీర బరువు తగ్గించే ఫిట్నెస్ సంస్థలు, డైట్ ప్లాన్ ఇచ్చే సంస్థలు వీరిని అద్దెకు తీసుకొని ప్రకటనలు రూపొందించుకోవచ్చు. ఇలాంటి ఎన్నో అవసరాలను ఊహించే బ్లిస్ ఈ సంస్థను నెలకొల్పాడు. వీరి అద్దె గంటకు 2000 జపాన్ యెన్లు(రూ.1,315) ఉంటుందట. ఇప్పటికే కొందరు ఉద్యోగులుగా మారగా.. కొన్ని రోజుల కిందట దెబుకారీ సంస్థ మరో ప్రకటన విడుదల చేసింది. వంద కిలోలకు మించి బరువు ఉన్న అబ్బాయిలు/ అమ్మాయిలు తమ సంస్థలో ఉద్యోగులుగా చేరొచ్చని వెల్లడించింది. అద్దె పూర్తిగా ఉద్యోగికే వెళ్తుంది. కేవలం సంప్రదింపుల ఫీజు కింద కంపెనీలు/వ్యక్తుల నుంచి కొంత మొత్తం డబ్బును సంస్థ తీసుకుంటుందని తెలిపింది. ఇప్పటికే ఈ సంస్థ టోక్యో, ఒసాకా, అయిచీ వంటి నగరాల్లో తమ సేవల్ని అందిస్తోంది. విడ్డూరంగా ఉంది కదా.. జపాన్లో అంతే మరి!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Respiratory Infections: చైనాలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కలకలం.. భారత్లో 6 రాష్ట్రాలు అలర్ట్..!
Respiratory Infections: చైనాలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి నేపథ్యంలో.. ప్రజారోగ్య సంరక్షణ, ఆసుపత్రుల సంసిద్ధతపై తక్షణమే సమీక్ష జరపాలని ఇటీవల భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. -
Uttarakhand Tunnel: ముందే చెప్పా.. ఆ 41 మంది బయటకు వస్తారని..!: ఆర్నాల్డ్ డిక్స్
Uttarakhand Tunnel: ఆస్ట్రేలియా పౌరుడైన ఆర్నాల్డ్ డిక్స్(Arnold Dix).. ఉత్తరాఖండ్ టన్నెల్ ఆపరేషన్లో కీలక పాత్ర పోషించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. -
Anand Mahindra: సమష్టి కృషితో ఏదైనా సాధ్యమే.. కార్మికుల రాకపై ఆనంద్ మహీంద్రా ట్వీట్
దాదాపు 17 రోజులుగా సొరంగంలో చిక్కుపోయిన కార్మికులను సహాయక బృందాలు ఎట్టకేలకు సురక్షింతంగా బయటకు తీసుకువచ్చాయి. దీనిపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా హర్షం వ్యక్తం చేశారు. -
Uttarakhand Tunnel: తొలుత భయపడ్డాం.. కానీ, నమ్మకాన్ని వీడలేదు: మోదీతో కార్మికుల సంభాషణ
Uttarakhand Tunnel: ఉత్తరాఖండ్లో సొరంగం నుంచి బయటపడిన కూలీలు ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడారు. ఈ ప్రభుత్వం తమను కాపాడుతుందనే నమ్మకంతో తాము ధీమాగా ఉన్నామని ప్రధానికి వారు తెలిపారు. -
అడ్డంకులు అధిగమించి.. ఉత్కంఠకు తెరదించి!
ఉత్తరాఖండ్లో చార్ధామ్ మార్గంలో నిర్మాణంలో ఉన్న సిల్క్యారా సొరంగం పాక్షికంగా కూలిపోవడంతో దాని లోపల చిక్కుకుపోయిన 41 మంది కూలీలు. వారిని రక్షించేందుకు రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బీఆర్వో, ఐటీబీపీ తదితర బలగాలు. -
ఆ మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించండి
మణిపుర్లోని మార్చురీలలో భద్రపరిచి ఉన్న మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ప్రభుత్వం ఇప్పటికే గుర్తించిన తొమ్మిది స్థలాల్లో ఎక్కడైనా సరే మృతుల ఆచార వ్యవహారాలకు అనుగుణంగా ఆ క్రతువును నిర్వహించాలని మంగళవారం స్పష్టం చేసింది. -
ఆ పోస్టుకు మరో ఐఏఎస్ అధికారి లేరా?
మరో ఆరు నెలల పాటు దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా నరేశ్ కుమార్ను కొనసాగించాలని భావిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలియజేయడంతో సుప్రీంకోర్టు మంగళవారం కీలక ప్రశ్నలను సంధించింది. -
సామాజిక మాధ్యమాల్లోని సమాచారంతో పిల్
సామాజిక మాధ్యమాల నుంచి సేకరించిన సమాచారంతో ఓ న్యాయవాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడాన్ని బాంబే హైకోర్టు తప్పుబట్టింది. అలాంటి గణాంకాలతో వాదనలు వినిపించడం సరికాదని హితవు పలికింది. -
భర్త వ్యక్తిగత వివరాలు భార్యకు చెప్పాల్సిన అవసరం లేదు
భర్త వ్యక్తిగత వివరాలు భార్యకు తెలపాల్సిన అవసరం లేదని కర్ణాటక హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. వివాహ బంధంలో కొనసాగుతున్నా, విడిపోయినా భాగస్వామి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేందుకు అవకాశం లేదని జస్టిస్ ఎస్.సునీల్దత్ యాదవ్, జస్టిస్ విజయకుమార్ ఏ పాటిల్లతో కూడిన ధర్మాసనం తేల్చిచెప్పింది. -
మమ్మల్ని వేరే కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు పంపండి
మణిపుర్లో ఘర్షణల నేపథ్యంలో తమకు దేశంలోని ఇతర కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో చదువుకునే వెసులుబాటు కల్పించాలంటూ మణిపుర్ విశ్వవిద్యాలయానికి చెందిన 284 మంది విద్యార్థులు తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
జ్ఞానవాపి మసీదు ఆవరణలో సర్వే.. నివేదిక సమర్పణకు గడువు కోరిన ఏఎస్ఐ
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో కాశీ విశ్వనాథుని ఆలయం పక్కన గల జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో జరిపిన శాస్త్రీయ సర్వే నివేదిక సమర్పణకు మరో మూడు వారాల వ్యవధి కావాలని భారత పురాతత్వ సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) మంగళవారం జిల్లా కోర్టును కోరింది. -
వృత్తలేఖినితో దాడి కేసు జువైనల్ జస్టిస్ బోర్డుకు
మధ్యప్రదేశ్లో ఇందౌర్లో తమ తోటి విద్యార్థిని మరో ముగ్గురు విద్యార్థులు వృత్తలేఖిని (జామెట్రీ కంపాస్)తో పొడిచిన కేసును జువైనల్ జస్టిస్ బోర్డుకు అప్పగించాలని ఇందౌర్ పోలీసులు నిర్ణయించారు. -
మన ఆస్ట్రోశాట్ భేష్!
భారత్ ప్రయోగించిన అంతరిక్ష టెలిస్కోపు ‘ఆస్ట్రోశాట్’ ఒక అద్భుత మైలురాయిని సాధించింది. విశ్వంలో 600కుపైగా గామా కిరణ విస్ఫోటాల (జీఆర్బీ)ను గుర్తించింది. -
ఉగ్ర సంబంధాలున్న సంస్థల నిధులు స్తంభింపజేయండి
ఉగ్రవాదంతో సంబంధాలున్నాయని, ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేస్తున్నాయని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పేర్కొన్న సంస్థల ఆస్తులను 24 గంటల్లో స్తంభింపజేయాలని, ఇతర ఆర్థిక ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. -
నౌకాదళానికి సూపర్ ర్యాపిడ్ గన్ వ్యవస్థ
భారత నౌకాదళం కోసం 16 ఆధునిక సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్ (ఎస్ఆర్జీఎం), ఇతర సాధనాలను సరఫరా చేయడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలోని బీహెచ్ఈఎల్ సంస్థ రూ.2,956 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
వికసిత భారత్ సంకల్ప యాత్రలో చురుగ్గా పాల్గొనండి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తన మంత్రివర్గ సహచరులను ప్రధాని మోదీ ఆదేశించారు. -
బిపిన్ రావత్ మృతిపై దర్యాప్తు విరమణ
త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ సహా 14 మంది మృతి చెందిన ఘటనలో కేసు దర్యాప్తును విరమించుకుంటున్నట్లు తమిళనాడు పోలీసుశాఖ ప్రకటించింది. -
ఈలం తమిళుల పోరాటం కొనసాగుతుంది.. వీడియోలో వెల్లడించిన మహిళ
ఈలం తమిళుల రాజకీయ పోరాటం కొనసాగుతుందని ఎల్టీటీఈ అధ్యక్షుడు ప్రభాకరన్ కుమార్తె ద్వారకాగా పేర్కొంటున్న ఓ మహిళ మాట్లాడిన వీడియో వెలుగులోకి వచ్చింది. -
అంగారకుడిపైకి మనిషిని పంపేందుకు ఇస్రో పరిశోధనలు
చంద్రుడు, అంగారకుడిపైకి మానవులను పంపేందుకు ఇస్రో పరిశోధనలు చేస్తోందని ఆదిత్య ఎల్-1 ప్రాజెక్టు డైరెక్టర్ నిగర్ షాజీ తెలిపారు. -
పదవీ విరమణ వయసులో.. సెక్యూరిటీ గార్డు డబుల్ పీజీ
రాజ్కరణ్ బారువా (56).. మధ్యప్రదేశ్లోని జబల్పుర్ నగరంలో రూ.5 వేల జీతానికి రాత్రంతా సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తూ, పగలు ఇళ్లలోనూ పనిచేస్తారీయన. ఇలా చాలామంది చేస్తూ ఉండవచ్చు. -
కార్మికుల మనోధైర్యానికి జాతి వందనం
ఉత్తరాఖండ్లోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకొని దాదాపు 17 రోజుల తర్వాత మంగళవారం సాయంత్రం విజయవంతంగా బయటపడిన 41 మంది కార్మికుల మనోధైర్యానికి జాతి వందనాలు సమర్పిస్తోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు.


తాజా వార్తలు (Latest News)
-
H-1B visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్న్యూస్.. ఇక అమెరికాలోనే వీసా రెన్యువల్!
-
M-cap: 4లక్షల కోట్ల డాలర్లకు మదుపర్ల సంపద.. ఈ మార్క్ దాటిన ఐదో మార్కెట్ భారత్
-
Nara Lokesh: చంద్రబాబు, పవన్ కలవకూడదని జగన్ విశ్వప్రయత్నాలు: నారా లోకేశ్
-
AP High Court: ఏయూలో అవినీతిపై పిటిషన్.. విచారణ 8 వారాల పాటు వాయిదా
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
LIC Jeevan Utsav: ఎల్ఐసీ కొత్త పాలసీ.. ఐదేళ్లు కడితే జీవితాంతం ఆదాయం