
Updated : 02 Jun 2021 05:04 IST
కోపంతో పిల్లాడిని చితకబాదిన రిటైర్డ్ పోలీస్
ఇంటర్నెట్డెస్క్: తన కుమారుడిని గాయపరిచాడనే కోపంతో రిటైర్డ్ పోలీసు ఓ పిల్లాడిని విచక్షణారహితంగా కొట్టిన ఘటన హరియాణాలో జరిగింది. గురుగ్రామ్లో పిల్లలు క్రికెట్ ఆడుకుంటూ ఉండగా వారి స్నేహితుల్లో ఒకరి కంటికి గాయమైంది. తన కుమారుడిని గాయపరిచాడనే కోపంతో విశ్రాంత పోలీస్, అతడి కుటుంబ సభ్యులు ఓ బాలుడ్ని విద్యుత్ స్తంభానికి కట్టేసి నిర్దాక్షిణ్యంగా చావబాదారు. వదిలేయమని బాలుడి సోదరి ప్రాధేయపడినా పట్టించుకోలేదు. సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్టార్ 39లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
ఇవీ చదవండి
Advertisement
Tags :