Ropeway Accident: సహాయక చర్యల్లో అపశృతి.. హెలికాప్టర్ నుంచి కిందపడి వ్యక్తి మృతి
రోప్ వే కేబుల్ కార్ల ప్రమాదం అనంతరం సహాయక చర్యల్లో భయానక ఘటన చోటుచేసుకుంది.......
దేవ్ధర్: ఝార్ఘండ్లోని దేవ్ధర్ జిల్లాలోని త్రికూట పర్వతాల్లో రోప్ వే కేబుల్ కార్లు ఆదివారం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉంటే.. ప్రమాదం అనంతరం సోమవారం సహాయక చర్యల్లో భయానక ఘటన చోటుచేసుకుంది. వైమానిక దళ సిబ్బంది ఓ వ్యక్తిని రక్షించే క్రమంలో అతడు హెలికాప్టర్ నుంచి కిందపడి మృతిచెందాడు.
వైమానిక దళానికి చెందిన రెండు Mi-17 హెలికాఫ్టర్లు రక్షణ చర్యల్లో పాల్గొంటున్నాయి. ప్రమాదంలో చిక్కుకుపోయిన ఓ వ్యక్తిని కాపాడేందుకు రక్షణ బలగాలు యత్నించాయి. గాల్లో ఉన్న హెలికాప్టర్ వద్దకు తాడు సాయంతో చేరుకోగలిగిన సదరు వ్యక్తి.. కాక్పిట్ వద్దే వేలాడుతూ కనిపించాడు. కింద ఉండి ఇదంతా చూస్తున్న కొందరు ఈ దృశ్యాలను వీడియో తీశారు. అతడు క్షేమంగా ఉండాలని దేవుడిని వేడుకున్నారు. అయితే అతడిని హెలికాప్టర్ లోపలికి లాక్కునేందుకు సైన్యం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాసేపటికే పట్టుతప్పి కిందపడిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బాధితుడు కిందపడిపోతుండగా.. ఆ దృశ్యాలను చూస్తున్నవారి హాహాకారాలు వీడియోలో వినిపించాయి. మృతిచెందిన వ్యక్తిని పశ్చిమ బెంగాల్ వాసిగా గుర్తించినట్లు తెలుస్తోంది.
దేవ్ధర్లోని బైద్యనాథ్ ఆలయ సందర్శనకు వచ్చే ప్రజలు.. 20 కిలోమీటర్ల దూరంలోని త్రికూట పర్వతాల్లోని రోప్ వే వద్ద పర్యటిస్తుంటారు. అయితే ఆదివారం ఆ రోప్ వే ద్వారా నడిచే కేబుల్ కార్లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురు మరణించారు. దాదాపు 50 మంది అనేక గంటలపాటు రోప్ వే క్యాబిన్లలో చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ త్రికూట్ రోప్వే భారత్లోనే ఎత్తయిన వర్టికల్ రోప్ వే. ఇది 766 మీటర్ల పొడువు ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!