Kota: కోటాలో ఆగని ఆత్మహత్యలు.. 26కు చేరిన విద్యార్థుల మరణాలు
Kota Student's Suicide: రాజస్థాన్లో కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. స్థానిక యంత్రాంగం, హాస్టల్ నిర్వాహకులు కలిసి చర్యలు తీసుకుంటున్నా సరే.. బలవన్మరణాలు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
కోటా: రాజస్థాన్(Rajasthan)లోని కోటా(Kota)లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు (Kota Suicides) కలవరపెడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ.. తాజాగా మరో మరణం వెలుగుచూసింది. ఉత్తర్ప్రదేశ్కు చెందిన విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. (Kota Student's Suicide)
ఉత్తర్ ప్రదేశ్(Uttar Pradesh)కు చెందిన విద్యార్థి కోటాలో సొంతంగానే నీట్ కోసం సిద్ధం అవుతున్నారని తెలిపారు. వివిధ ఎంట్రెన్స్ టెస్టులు, పోటీపరీక్షల కోచింగ్ సెంటర్లకు ప్రసిద్ధి చెందిన ‘కోటా’లో.. పొరుగు రాష్ట్రాల నుంచి ఏటా వేల మంది విద్యార్థులు శిక్షణ పొందుతారు. ఈ ఏడాది దాదాపు 2.5లక్షల మంది అక్కడ శిక్షణ తీసుకుంటున్నట్లు అంచనా. ఈ క్రమంలోనే అక్కడ విద్యార్థులు ఆత్మహత్యలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది 15 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడగా.. ఈ ఏడాది ఆ సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా యూపీ విద్యార్థి మరణంతో ఆ సంఖ్య 26కు చేరింది.
మణిపుర్లో మళ్లీ కల్లోలం.. పుల్వామా దర్యాప్తు ఐపీఎస్ అధికారికి పిలుపు..
ఇదిలా ఉంటే.. ఈ బలవన్మరణాలను నిలువరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో రెండు నెలలపాటు కోటాలోని శిక్షణా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి టెస్టులు నిర్వహించకూడదని స్థానిక యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు సెప్టెంబరు, అక్టోబరులో విద్యార్థులకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు జిల్లా అధికారులు తెలిపారు.
ఇంకోవైపు వసతి గృహాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భవనాల చుట్టూ ఇనుప వలలు, గదుల లోపల స్ప్రింగ్ కాయిల్ ఫ్యాన్లు అమర్చుతున్నారు. జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి వసతి గృహాల యజమానులు ఈ చర్యలు తీసుకొంటున్నారు. భవనాల పై అంతస్తు నుంచి దూకినా గాయపడకుండా కింద ఆవరణల్లోనూ వలలు కడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ మాజీ నేవీ అధికారుల్ని భారత్కు రప్పించేందుకు ప్రయత్నాలు!
ఖతార్లో మరణశిక్ష పడిన భారత నేవీ మాజీ అధికారులను స్వదేశానికి రప్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్ తెలిపారు. -
Gujarat: గుండెపోటుతో 6 నెలల్లో 1052 మంది మృతి.. 80శాతం 25ఏళ్ల లోపువారే!
గుజరాత్లో గడిచిన ఆరు నెలల్లో గుండెపోటు కారణంగా చనిపోయిన 1052 మందిలో 80శాతం మంది 25 ఏళ్లలోపు వారేనని ఆ రాష్ట్ర మంత్రి వెల్లడించారు. -
UGC: యూనివర్సిటీలు, కాలేజీల్లో సెల్ఫీ పాయింట్లు పెట్టండి..!
వివిధ రంగాల్లో భారత్ సాధించిన విజయాలపై యువతలో అవగాహన పెంచేలా కాలేజీలు, యూనివర్సిటీలకు యూజీసీ కీలక సూచనలు చేసింది. -
Indian Navy: తొలి మహిళా కమాండింగ్ ఆఫీసర్ను నియమించిన భారత నౌకాదళం
భారత నౌకా దళంలో తొలి మహిళా కమాండింగ్ అధికారిని నియమించినట్లు నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్. హరికుమార్ తెలిపారు. -
Bengaluru: తల్లిదండ్రులెవరూ ఆందోళన చెందొద్దు: కర్ణాటక హోంమంత్రి విజ్ఞప్తి
బెంగళూరు నగరంలో 44 స్కూళ్లకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ రావడంతో తీవ్ర కలకలం రేపింది. దీనిపై ఆ రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర స్పందించారు. -
Viral news: ఇదేం పెళ్లిరా బాబూ.. తుపాకీ ఎక్కుపెట్టి.. తాళి కట్టించి..!
ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఇటీవలే ఉద్యోగం సాధించిన యువకుడిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి.. బలవంతంగా తన కూతురి మెడలో తాళి కట్టించాడు. -
PM Modi: భారత్లో కాప్-33 సదస్సు.. దుబాయ్లో ప్రతిపాదించిన మోదీ
PM Modi: మరో ఐదేళ్ల తర్వాత ప్రపంచ వాతావరణ సదస్సును భారత్లో నిర్వహించాలని ప్రధాని నరేంద్రమోదీ ప్రతిపాదించారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్గారాలను తగ్గించేందుకు అన్ని దేశాలు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
Electricity bill: రూ.4,950 బిల్లుకు.. రూ.197 కోట్ల రసీదు
ఓ మహిళ రూ.4,950 విద్యుత్ బిల్లు చెల్లించగా.. ఆమెకు సిబ్బంది రూ.197 కోట్లు చెల్లించినట్లు రసీదు ఇచ్చారు. -
Supreme Court: సీఎంతో సమావేశమై సమస్యకు తెరదించండి.. తమిళనాడు గవర్నర్కు ‘సుప్రీం’ సూచన
బిల్లుల ఆమోద సమస్య పరిష్కారానికిగానూ సీఎం ఎంకే స్టాలిన్తో సమావేశం నిర్వహించాలని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని సుప్రీం కోర్టు కోరింది. -
CBSE: 10, 12వ తరగతి ఫలితాల్లో మార్కుల డివిజన్ ప్రకటించం: బోర్డు
10, 12వ తరగతి పరీక్షల ఫలితాల్లో మార్కులకు సంబంధించి ఎటువంటి డివిజన్లు/డిస్టింక్షన్ (Distinction) తాము కేటాయించమని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) స్పష్టం చేసింది. -
Bomb threat: బెంగళూరులో 44 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
బెంగళూరు (Bengaluru)లో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. రెండు విడతలుగా ఈ బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. -
BSF: వీర జవాన్లతో.. పాక్, బంగ్లా సరిహద్దులు సురక్షితం: అమిత్ షా
సరిహద్దులు సురక్షితంగా లేకపోతే దేశం అభివృద్ధి చెందదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. -
ఏడాదిగా తల్లి మృతదేహంతో ఇంట్లోనే అక్కాచెల్లెళ్లు..
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఏడాది క్రితం చనిపోయిన తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని జీవిస్తున్న వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. -
శ్రీనగర్ నిట్లో సోషల్ మీడియా దుమారం
జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్ ఎన్ఐటీలో మతపరమైన అంశంపై సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టుకు నిరసనగా కొందరు విద్యార్థులు ఆందోళనకు దిగారు. -
పల్లెటూరి మేడం యూట్యూబ్ ఆంగ్ల పాఠాలు అదుర్స్
ఉత్తర్ప్రదేశ్లోని కౌశాంబీ జిల్లా సిరాథూ నగర పంచాయతీకి చెందిన యశోద అనే గ్రామీణ యువతి ఆంగ్ల బోధనకు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి విశేష ఆదరణ చూరగొంటోంది. -
Gated community: గేటెడ్ కమ్యూనిటీ రోడ్లపై ఎవరైనా వెళ్లవచ్చు!
గేటెడ్ కమ్యూనిటీల్లోని రహదారులపై బయటి వారు కూడా రాకపోకలు సాగించవచ్చని కర్ణాటక ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. -
సిల్క్యారాలోనా.. సొంత ఊళ్లకా!
మృత్యువు అంచువరకు వెళ్లి రెండ్రోజుల క్రితం క్షేమంగా తిరిగివచ్చిన సిల్క్యారా సొరంగ కార్మికులు ఇప్పుడు అక్కడే ఉండి ఎప్పటిలా పనిచేసుకోవాలా, సొంత ఊళ్లకు వెళ్లిపోవాలా అనే ఊగిసలాటలో ఉన్నారు. -
నా దృష్టిలో పెద్దకులాలు ఆ నాలుగే
‘నా దృష్టిలో నాలుగు పెద్ద కులాలవారంటే పేదలు, యువత, మహిళలు, రైతులు. వారి ఎదుగుదలతోనే దేశం అభివృద్ధి చెందుతుంది’ అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
ఒడిశా అడవుల్లో బ్లాక్ పాంథర్
ఒడిశా అడవుల్లో బ్లాక్ పాంథర్(నల్ల చిరుత) కనిపించింది. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్) సుశాంత నందొ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వివరాలు వెల్లడించారు. -
కన్నూర్ వర్సిటీ వీసీగా రవీంద్రన్ పునర్నియామకం కొట్టివేత
కేరళలోని కన్నూర్ యూనివర్సిటీ ఉప కులపతి (వైస్ఛాన్సలర్/వీసీ)గా గోపీనాథ్ రవీంద్రన్ పునర్నియామకాన్ని సుప్రీం కోర్టు గురువారం కొట్టివేసింది. -
విమానంలో నీటి ధార
విమానంలో క్యాబిన్ పైకప్పు నుంచి ఏర్పడిన నీటి లీకేజీతో ప్రయాణికులు ఇబ్బంది పడిన ఘటన ఇటీవల చోటు చేసుకుంది.


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/12/2023)
-
Surya Kumar Yadav: ఆ ఒక్కటి మినహా.. అంతా మాకు కలిసొచ్చింది: సూర్య
-
Axar Patel: మంచు ప్రభావం తప్పించుకొనేందుకు నా ప్రణాళిక అదే: అక్షర్ పటేల్
-
Chandrababu: సీఈసీని కలవాలని చంద్రబాబు నిర్ణయం
-
Paradip Port: ఒడిశా తీరంలో రూ.220 కోట్ల డ్రగ్స్ పట్టివేత!
-
ఆ మాజీ నేవీ అధికారుల్ని భారత్కు రప్పించేందుకు ప్రయత్నాలు!