Vehicle Theft: దేశ రాజధానిలో.. ప్రతి 12 నిమిషాలకో వాహనం చోరీ..!
దేశంలో చోటుచేసుకుంటున్న వాహన దొంగతనాల జాబితాలో దేశ రాజధాని దిల్లీ అగ్రస్థానంలో ఉన్నట్లు తాజా నివేదిక వెల్లడించింది.
దిల్లీ: దేశంలో చోటుచేసుకుంటున్న వాహన దొంగతనాల (Vehicle theft) జాబితాలో దేశ రాజధాని దిల్లీ అగ్రస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా జరిగే వాహన చోరీల్లో 56శాతం దిల్లీలోనే జరుగుతున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. అక్కడ ప్రతి 12నిమిషాలకు ఒక వాహనం మాయమవుతున్నట్లు అంచనా. ఎక్కువగా కార్లు చోరీకి గురవుతోన్న రెండో నగరంగా బెంగళూరు, చెన్నై నగరాలు నిలిచాయి. కాగా.. దేశంలో అతి తక్కువ వాహన చోరీలు జరుగుతోన్న నగరాలుగా హైదరాబాద్, ముంబయి, కోల్కతాలు ఉన్నట్లు తాజా నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా వాహన చోరీలకు సంబంధించి ఏసీకేఓ ఇన్సూరెన్స్ (ACKO Insurance) కంపెనీ రూపొందించిన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
* దిల్లీ పోలీసుల సమాచారం ప్రకారం, 2011 నుండి 2020 మధ్యకాలంలో కేవలం ఒక్క దిల్లీలోనే 3లక్షల వాహనాలు చోరీకి గురయ్యాయి.
* దేశ రాజధానిలో నమోదవుతోన్న మొత్తం నేరాల్లో 20శాతం వాహన చోరీ కేసులే ఉండటం గమనార్హం.
* రోహిణి, భజన్పురా, ఉత్తమ్నగర్, సెక్టార్ 12 నోయిడా, సౌత్ సిటీ I, గురుగ్రామ్, దయాళ్పుర్తోపాటు సుల్తాన్పుర్ ప్రాంతాలు ఈ దొంగతనాలకు కేంద్రంగా మారాయి.
* దేశ రాజధానిలో అత్యధికంగా వాగన్ ఆర్, స్విఫ్ట్ డిజైర్ మోడల్ కార్లే చోరీకి గురవుతున్నాయి.
* తర్వాతి స్థానాల్లో హ్యూందాయ్, సాంత్రో, హోండా సిటీ కార్లు ఉన్నాయి. సాధారణంగా డిమాండ్ అధికంగా ఉన్న కార్లే చోరులకూ ఇష్టమైనవిగా నివేదిక బట్టి తెలుస్తోంది.
* ద్విచక్రవాహనాల విషయానికొస్తే.. హీరో స్ప్లెండర్ మోడల్ అధికంగా దొంగతనాలకు గురవుతోంది.
* హోండా, హీరో, బజాజ్, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలకు చెందిన బైకులు ఎక్కువగా చోరీకి గురవుతోన్న వాహనాల జాబితాలో వరుస క్రమంలో ఉన్నాయి.
* దేశంలో వాహన చోరీలు అధికంగా ఉన్న జాబితాలో దిల్లీ తర్వాత.. బెంగళూరు, చెన్నై నగరాలు నిలిచాయి. దేశం మొత్తంలో జరిగే చోరీల్లో 9శాతం బెంగళూరులో, 5శాతం చెన్నైలలో జరుగుతున్నట్లు అంచనా.
* దేశంలో అతి తక్కువ వాహన చోరీలు చోటుచేసుకుంటున్న నగరాలుగా హైదరాబాద్, ముంబయి, కోల్కతాలు నిలిచినట్లు తాజా నివేదిక తెలిపింది.
* భవనాలు, కాలనీల్లో పార్కింగ్కు సరైన స్థలం లేకపోవడంతో రోడ్లపైనే వాహనాలను పార్కింగ్ చేయడం.. దిల్లీలో అధికంగా చోరీలు జరగడానికి ప్రధాన కారణంగా తాజా నివేదిక విశ్లేషించింది.
* దేశంలో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ అధికంగా దిల్లీలోనే ఉండడం ఇందుకు మరో కారణం.
* దిల్లీ నగరంతో ఇతర రాష్ట్రాల సరిహద్దు అతి చేరువలో ఉండటం.. దొంగతనం చేసే వారు తేలికగా తప్పించుకునే అవకాశం ఉండటం అక్కడ ఎక్కువ వాహన దొంగతనాలకు మూడో కారణంగా పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ (Modi) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. వాటిపై అందిన ఫిర్యాదు ఈసీ పరిశీలనలో ఉందని సమాచారం. -
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. -
నూడుల్స్లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!
నూడుల్స్లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. -
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు. -
రాహుల్పై పరువు నష్టం కేసు.. విచారణ మే 2కు వాయిదా
కేంద్ర హోం మంత్రి అమిత్షాను ఉద్దేశించి ఆరేళ్ల క్రితం కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై విచారణను ఉత్తర్ప్రదేశ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మే 2కు వాయిదా వేసింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్