Galwan : గల్వాన్లో ఏడాది తర్వాత కూడా..!
2020 జూన్ 15న దాదాపు 45 ఏళ్ల తర్వాత వాస్తవాధీన రేఖ రక్తమోడింది.16 బిహార్ రెజిమెంట్కు చెందిన కర్నల్ సంతోష్బాబు సహా 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
మోహరించి ఉన్న ఇరు దేశాల సేనలు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
2020 జూన్ 15న దాదాపు 45 ఏళ్ల తర్వాత వాస్తవాధీన రేఖ రక్తమోడింది.16 బిహార్ రెజిమెంట్కు చెందిన కర్నల్ సంతోష్బాబు సహా 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు ఏడాది పూర్తికావడంతో సైన్యం నేడు వారికి నివాళులర్పించింది. ఈ సందర్భంగా ఫైర్ అండ్ ఫ్యూరీ కోర్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. మేజర్ జనరల్ అశోక్ కౌశిక్ లేహ్లోని యుద్ధస్మారకం వద్ద నివాళి అర్పించారు. ‘‘దేశ భూభాగాన్ని కాపాడేందుకు అత్యంత ఎత్తైన పర్వత శిఖరాల్లో వీరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేశారు. వీరి త్యాగాలను దేశప్రజలు ఎన్నటికి మరిచిపోరు’’ అని పేర్కొన్నారు. మరోపక్క ఏడాదిపాటు 11 విడతలు కోర్ కమాండర్ స్థాయి చర్చలు జరిగినా సమస్య పరిష్కారం కాలేదు.
వేసవి రాగానే పెరిగిన దళాల కదలికలు..
వేసవిలో కొంచెం పరిస్థితి అనుకూలించగానే చైనా మూకలు మళ్లీ ఆయుధాలతో వాస్తవాధీన రేఖ వెంట చేరిపోయాయి. గోగ్రా, హాట్స్ప్రింగ్స్, దెప్సాంగ్, దెమ్చోక్లలో చైనా దళాల తిష్ట కొనసాగుతోంది. ఇటీవల చైనా దళాలు యుద్ధవిన్యాసాలు నిర్వహించాయి. దెప్సాంగ్, దెమ్చోక్ వివాదం కాస్త పాతది. దెప్సాంగ్లో 2013, 2017లలో కూడా ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం ఇక్కడ 10, 11, 11ఏ, 12, 13 పెట్రోలింగ్ పాయింట్లకు భారత దళాలు వెళ్లకుండా చైనా సేనలు అడ్డుకొంటున్నట్లు ది ప్రింట్ కథనం పేర్కొంది.
భారత్ వేగాన్ని తగ్గించేందుకు..
చైనా సరిహద్దుల వెంట అనుసరించే వ్యూహాన్ని ఏ2ఏడీ అంటారు. అంటే ‘యాంటీ యాక్సెస్- ఏరియా డినైల్’..! ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంలో కూడా ఇదే వ్యూహాన్ని పాటిస్తోంది. తొలుత ప్రత్యర్థులను అడ్డుకొనేందుకు తన వద్ద ఫైటర్ జెట్లు, యుద్ధనౌకలు, బాలిస్టిక్ క్షిపణులు, క్రూజ్ క్షిపణలను కీలక లక్ష్యాలపైకి గురిపెడుతుంది. తన కార్యకలాపాలు జరిగే ప్రదేశంలోకి శత్రువులు రాకుండా చేయడం కోసం ఇలా చేస్తుంది. ఇక దీనికి సమీప ప్రాంతాల్లో స్నేహపూర్వక నియంత్రణతో శత్రువుల కదలికలను అదుపు చేస్తుంది.
ఏడాదిగా అలుపెరుగని వాయుసేన..
గల్వాన్లో ఘర్షణ చోటు చేసుకోన్న విషయం తెలియగానే వాయుసేన యుద్ధవిమానాలు హుటాహుటిన లద్ధాఖ్ దిశగా పయనం అయ్యాయి. నాటి నుంచి ఏడాది పాటు అలుపెరుగకుండా సేవలు అందిస్తున్నాయి. దళాలు, రేషన్,పరికరాలు, ఆయుధాల తరలింపులో ఐఏఎఫ్ కీలక పాత్ర పోషించింది. అంతేకాదు వాయుసేనకు చెందిన రాడార్లు, క్షిపణులను కూడా లద్ధాఖ్కు తరలించారు. భారత్కు చెందిన ఏఎన్32,సీ130జే,సీ-17 వంటి భారీ రవాణా విమానాలతోపాటు అపాచీ, చినూక్ హెలికాప్టర్ల సేవలను వాడుకొంది. వివిధ స్థావరాల నుంచి వాయుసేన బలగాలను సిద్ధం చేశారు. ఎందుకంటే ఎటు అవసరమైతే అటు వైపు వినియోగించుకోవచ్చని ప్రభుత్వ యోచన.
భారత్ 2019లోనే వాస్తవాధీన రేఖ వద్ద ఘర్షణలను ఎలా ఎదుర్కోవాలనే ప్రణాళిక సిద్ధం చేసుకొన్నట్లు సమాచారం. అందుకే గల్వాన్ ఘర్షణ జరిగిన గంటల్లో వివిధ ఎయిర్ బేస్ల నుంచి లద్దాఖ్ సమీపానికి ఫైటర్ జెట్లు చేరుకొన్నాయి. వెంటనే కాంబాట్ ఎయిర్ పెట్రోల్స్ (సీఏపీ)కూడా ప్రారంభించాయి. చైనా కదలికలు తెలుసుకొనేందుకు నిరంతరం డ్రోన్ల నిఘాను ఏర్పాటు చేశారు. గత జులైలో రఫేల్స్ భారత్కు రాగానే వెంటనే వాటిని వాస్తవాధీన రేఖ వద్దకు తరలించారు.
పోటాపోటీగా గగనతల రక్షణ వ్యవస్థలు..
చైనా వద్ద గగనతల రక్షణ వ్యవస్థ బలంగా ఉండగా.. వాయుసేన కొంత బలహీనంగా ఉంది. ఆ దేశ వైమానిక స్థావరాలు ఎత్తులో ఉండటంతో ఫైటర్ జెట్లు హిమగిరుల్లో పూర్తి సామర్థ్యం మేరకు పనిచేయలేవు. ఆయుధాలు, చమురు పరిమితంగా తీసుకొని గాల్లోకి ఎగరాల్సి ఉంటుంది. 2020 జులై నాటికి చైనా ఐదు జె-20 స్టెల్త్ జెట్ విమానాలను అక్కడ మోహరించింది. వాటిని ఈ ఏడాది మార్చి వరకు కొనసాగించింది. దీంతోపాటు 10 వరకు హెచ్క్యూ 9,22,16 రకాల ఎస్ఏఎం (సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్) వ్యవస్థలను ఏర్పాటు చేసింది. చైనా వైపు భౌగోళిక ప్రాంతం వీటి మోహరింపునకు అనుకూలంగా ఉంటుంది.
భారత్ కూడా దీనిని అధిగమించడానికి వాయుసేకు చెందిన ఎస్ఏఎంలను తరలిచింది. భారత వాయుసేనకు చెందిన నిపుణులు క్షేత్ర స్థాయిలో సైన్యం, ఐటీబీపీ సిబ్బందితో కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. వాయుసేన పరికరాలను మోహరిస్తేనే వీరిని తరలిస్తారు..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
తిహాడ్ జైల్లో అరవింద్ కేజ్రీవాల్పై కుట్ర జరుగుతోందని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ శనివారం ఆరోపించారు. -
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
Isha Arora: యూపీలో విధులు నిర్వహించిన పోలింగ్ ఏజెంట్ ఈశా అరోడా ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్గా మరారు. ఇంతకీ ఎవరామె..? -
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
Doordarshan: ‘డీడీ న్యూస్’ లోగోను కాషాయ రంగులోకి మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ‘ప్రసార భారతి’ కాదని ‘ప్రచార భారతి’గా మారిందని పలువురు మండిపడుతున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?