Aaditya Thackeray: మీకోసం తలుపులు తెరిచే ఉంటాయి.. ఆ నేతలకు ఆదిత్య పిలుపు!
పార్టీని వీడిన నేతల కోసం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, రావాలనుకునేవారు రావొచ్చని మాజీ సీఎం తనయుడు ఆదిత్య ఠాక్రే కోరారు........
ముంబయి: ఏక్నాథ్ శిందే వర్గం నేతలు తిరుగుబాటు చేయడంతో మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వందిగిపోయి కొత్త సర్కారు ఏర్పడిన విషయం తెలిసిందే. ఉద్ధవ్కు మరో షాక్ ఇస్తూ.. ఆయన నేతృత్వంలోని పార్టీకి చెందిన 12 మంది ఎంపీలు విడిపోయి, నూతన ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందేకు విధేయులై ఉంటామని ఈనెల 19న ప్రకటించారు. అయినప్పటికీ ఆ నేతలపై ఉద్ధవ్ వర్గం పూర్తిగా విశ్వాసం కోల్పోయినట్లు లేదు. పార్టీని వీడిన నేతల కోసం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, రావాలనుకునేవారు రావొచ్చని మాజీ సీఎం తనయుడు ఆదిత్య ఠాక్రే కోరారు.
ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ శిందేల మధ్య సయోధ్య కుదిరే అవకాశం ఉందా? అని ఆదిత్యను విలేకర్లు ప్రశ్నించగా.. ‘మాకు ద్రోహం చేసి, వారితో చేరిన వారికి అప్పుడే చెప్పాను. వారు తిరిగి రావాలనుకుంటే తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి’ అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి శిందే సహా పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఆదిత్య థాక్రే ఈ సందర్భంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వం ‘చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం’ అని పేర్కొన్నారు.
కొద్దిరోజుల వ్యవధిలో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని సర్కారుపై తిరుగుబాటు ఏక్నాథ్ శిందే వర్గం తిరుగుబాటు చేయగా.. ఠాక్రే మెజార్టీ కోల్పోయి అధికారం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అనంతరం భాజపా మద్దతుతో శిందే ముఖ్యమంత్రి అయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?