Shraddha Murder: వారు స్పందించి ఉంటే శ్రద్ధా బతికేది.. మీడియా ముందు తండ్రి ఆవేదన
ముంబయి పోలీసులు స్పందించి ఉంటే తన కుమార్తె శ్రద్ధా వాకర్ (Shraddha Walkar) ఇప్పుడు బతికి ఉండేదని ఆమె తండ్రి వికాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్య గురించి తొలిసారి ఆయన మీడియాతో మాట్లాడారు.
ముంబయి: తన కుమార్తెను అతి దారుణంగా హత్య చేసిన ఆఫ్తాబ్ పూనావాలా (Aaftab Poonawala)ను ఉరితీయాలని శ్రద్ధా వాకర్ (Shraddha Walkar) తండ్రి వికాస్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్సెంటర్ ఉద్యోగి శ్రద్ధా హత్య (Shraddha Murder) కేసులో దిల్లీ పోలీసులు ముమ్మర దర్యాప్తు సాగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మృతురాలి తండ్రి వికాస్ తొలిసారిగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. మహారాష్ట్ర పోలీసులు సమయానికి స్పందించి ఉంటే తన కుమార్తె బతికేదని ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘నా కుమార్తెకు జరిగినట్లు మరెవరికీ జరగకూడదు. ఆఫ్తాబ్ గురించి శ్రద్ధా.. వసయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పుడే వారు స్పందించి దర్యాప్తు చేపట్టి ఉంటే ఆమె బతికేది. మాణిక్పూర్, వసయి పోలీసుల తీరుతో నేను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా. అయితే ఇప్పుడు దిల్లీ పోలీసుల దర్యాప్తు సరైన దిశగానే సాగుతోంది. నా కుమార్తె మరణానికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. ఆఫ్తాబ్ నా కుమార్తెను ఎంత దారుణంగా హింసించాడో.. అంతే ఘోరంగా అతడికి శిక్ష పడాలి. ఈ కేసుకు సంబంధమున్న అతడి కుటుంబం, ప్రతి ఒక్కరినీ విచారించాలి. దర్యాప్తు పారదర్శకంగా జరగాలి. ఆఫ్తాబ్ను ఉరితీయాలి అని నేను కోరుకుంటున్నా’’ అని వికాస్ (Vikas Walkar) తెలిపారు.
శ్రద్ధాతో చివరగా మాట్లాడింది అప్పుడే..
‘‘శ్రద్ధాతో నేను చివరిసారిగా 2021 మధ్యలో మాట్లాడాను. ఎలా ఉన్నావ్.. అని అడిగాను. అదే మా చివరి సంభాషణ. ఆ తర్వాత గతేడాది సెప్టెంబరులో ఆఫ్తాబ్కు ఫోన్ చేసి నా కుమార్తె గురించి అడిగాను. కానీ, అతడు.. శ్రద్ధా ఎక్కడికి వెళ్లిందో తనకు తెలియదని చెప్పాడు. శ్రద్ధాను మేమంతా ఒంటరిగా వదిలేశామని ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు. కానీ, మేం అలా చేయలేదు. ఆఫ్తాబ్ అంతగా వేధించినా ఆమె ఎందుకు తిరిగి ఇంటికి రాలేదో నాకు అర్థం కావట్లేదు. దానికి కారణం తెలుసుకోవాలని చాలాసార్లు ప్రయత్నించా. కానీ శ్రద్ధా ఎప్పుడూ సమాధానం చెప్పలేదు’’ అని వికాస్ ఉద్విగ్నభరితులయ్యారు.
ఆఫ్తాబ్, శ్రద్ధా దిల్లీకి రాకముందు ముంబయి శివారులోని ఓ ఫ్లాట్లో సహజీవనం సాగించారు. అప్పటి నుంచే ఆమె ఆఫ్తాబ్ వేధింపులను భరిస్తూ వస్తోంది. ఆఫ్తాబ్ తనను తీవ్రంగా కొట్టాడని 2020లో శ్రద్ధా ఓసారి వసయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు అప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శలు వచ్చాయి. అయితే, ఆ ఫిర్యాదుపై తాము విచారించామని స్థానిక పోలీసులు చెబుతున్నారు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, ఆ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని శ్రద్ధానే ఆ తర్వాత వాంగ్మూలం ఇచ్చిందని పేర్కొన్నారు.
ఆఫ్తాబ్ కస్టడీ పొడిగింపు..
మరోవైపు ఈ కేసులో ఆఫ్తాబ్ కస్టడీని దిల్లీ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. నిందితుడి జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగియడంతో అతడిని శుక్రవారం దిల్లీ కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపర్చారు. కేసు విచారణ ఇంకా జరుగుతుండటంతో అతడి కస్టడీని పొడగించాలని పోలీసులు కోరగా.. కోర్టు అందుకు అంగీకరించింది. ఈ కేసులో ఇప్పటికే అతడికి నార్కో, పాలిగ్రాఫ్ పరీక్షలు చేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు