AAP: 100మంది ఎంపీలు.. ఎంతో ప్రచారం.. అయినా మేమే గెలిచాం!
ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని చెప్పుకునే భాజపా, ఓ చిన్న పార్టీ చేతిలో ఓటమి పాలయ్యిందని ఆమ్ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా పేర్కొన్నారు. కేజ్రీవాల్ ఓటమికి కాషాయ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. దిల్లీవాసులు మాత్రం ఆమ్ఆద్మీవైపే ఉన్నారని అన్నారు.
దిల్లీ: దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో (MCD Elections) సత్తా చాటిన ఆమ్ఆద్మీపార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించింది.ఈ నేపథ్యంలో భాజపాపై తీవ్ర స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు విసిరింది. అపరిమిత శక్తి, ముఖ్యమంత్రులు, దర్యాప్తు సంస్థల బలం, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా చెప్పుకునే భాజపా ఓ చిన్న పార్టీ చేతిలో ఓడిపోయిందని విమర్శలు గుప్పించింది.
‘పేద, నిజాయితీ కలిగిన, విద్యావంతమైన ఓ చిన్న పార్టీ.. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీని ఓడించింది. భాజపా, ఆమ్ఆద్మీపార్టీ మధ్య జరిగిన హోరాహోరీ పోరు ఇది. ఏడుగురు ముఖ్యమంత్రులు, 17మంది కేంద్ర మంత్రులు, 100 మంది ఎంపీలు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఐటీలతోపాటు జైల్లో ఉన్న ఓ వ్యక్తి (సుకేశ్ చంద్రశేఖర్) కూడా ఎన్నికల్లో వారి ముఖ్య ప్రచారకర్తలు (Star Campaigner). అయినప్పటికీ సామాన్యుడి చేతిలో ఓడిపోయారు’ అని ఆ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) విజయాన్ని ఆపాలని భాజపా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అభివృద్ధి కోసం పనిచేసిన వారికే దిల్లీ పౌరులు ప్రభుత్వ పగ్గాలు అప్పజెప్పారన్నారు. కేజ్రీవాల్పై భాజపా చల్లుతున్న బురదను తుడిచేసిన దిల్లీవాసులు.. తాజాగా మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యతలను కూడా ఆయనకే కట్టబెట్టారని రాఘవ్ చద్దా స్పష్టం చేశారు.
మరోవైపు, మున్సిపల్ కార్పొరేషన్లో 15 ఏళ్ల భాజపా పాలనకు అడ్డుకట్ట వేసిన ఆమ్ఆద్మీ పార్టీ.. స్పష్టమైన మెజారిటీతో జయకేతనం ఎగురవేసింది. మొత్తం 250 వార్డుల్లో ఆప్ 134 స్థానాలకు కైవసం చేసుకుంది. దీంతో మేయర్ సీటు ఆమ్ ఆద్మీ వశమైంది. ఈ ఎన్నికల్లో భాజపా 104 వార్డులను గెలుచుకోగా.. హస్తం పార్టీ కేవలం 9 స్థానాలకు పరిమితమైంది. మరో మూడు చోట్ల ఇతరులు విజయం సాధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!