National party: జాతీయ పార్టీ హోదాతో ప్రయోజనాలేంటో తెలుసా?
దేశంలో జన్లోక్పాల్(Jan Lokpal) ఉద్యమంతో ప్రాచుర్యం పొందిన అర్వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఇప్పుడు జాతీయ పార్టీ హోదాను దక్కించుకున్న విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో జన్లోక్పాల్(Jan Lokpal) ఉద్యమంతో ప్రాచుర్యం పొందిన అర్వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఇప్పుడు జాతీయ పార్టీ హోదాను దక్కించుకున్న విషయం తెలిసిందే. పదేళ్ల క్రితం దేశ రాజధాని నగరం కేంద్రంగా ఆవిర్భవించిన ఆ పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ దిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడమే కాకుండా తాజాగా జరిగిన గుజరాత్ ఎన్నికల్లో దాదాపు 13శాతం ఓట్లు సాధించి జాతీయ పార్టీ హోదాను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో అసలు జాతీయ పార్టీ గుర్తింపు ఎలా లభిస్తుంది? జాతీయ పార్టీ హోదా సాధించాలంటే ఉండాల్సిన అర్హతలేంటి? ఆ హోదా వస్తే ఏమైనా అదనపు ప్రయోజనాలు ఉంటాయా? అనే వివరాలను ఓసారి పరిశీలిస్తే..
పార్టీ జాతీయ హోదా కోసం..
కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం.. ఏదైనా పార్టీకి జాతీయ హోదా దక్కాలంటే.. సాధారణ ఎన్నికల్లో కనీసం 4 రాష్ట్రాల్లో పోలైన ఓట్లలో 6% చొప్పున ఓట్లు పొందాలి. లేదా.. ఏవైనా మూడు వేర్వేరు రాష్ట్రాల నుంచి 11 లోక్సభ సీట్లు సాధించాల్సి ఉంటుంది. లేదంటే నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు అయినా పొందిఉండాలి. ప్రస్తుతం ఆప్.. దిల్లీ, పంజాబ్లో అధికారంలో ఉండగా.. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలు, 6% ఓట్లు దక్కించుకుంది. తాజాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాలు గెలుచుకొని దాదాపు 12శాతానికి పైగా ఓట్లు సాధించడం ద్వారా ఈ అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంది.
దేశంలో ప్రస్తుతం జాతీయ పార్టీలెన్ని?
దేశంలో ప్రస్తుతం ఎనిమిది జాతీయ పార్టీలు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్, భాజపా, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలకు మాత్రమే జాతీయ పార్టీ హోదా ఉండగా.. 2019లో అరుణాచల్ప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో పోటీచేసి అవసరమైన ఓట్లు, సీట్లు సాధించడం ద్వారా నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) జాతీయ పార్టీ హోదాను పొందింది. ఈ పార్టీకి అంతకముందు మణిపూర్, మేఘాలయా, నాగాలాండ్లలో గుర్తింపు ఉండగా.. 2019లో అరుణాచల్ప్రదేశ్లోనూ రాష్ట్ర పార్టీగా గుర్తింపు సాధించడం ద్వారా 2019 జూన్లో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్పీపీకి జాతీయ హోదాను కల్పించింది. దీంతో దేశంలో ఇప్పటివరకు జాతీయ పార్టీల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఇక తాజగా ఈ జాబితాలో తొమ్మిదో పార్టీగా ఆప్ అర్హత సాధించింది.
రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే..
ఒక రాజకీయ పార్టీ ఈ కింది షరతుల్లో ఏదో ఒకదాన్ని నెరవేర్చినట్లయితే.. రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా పరిగణిస్తారు.
- సాధారణ ఎన్నికలు లేదా శాసనసభ ఎన్నికల్లో అసెంబ్లీలో 3శాతం సీట్లు గెలుచుకోవాలి.
- సార్వత్రిక ఎన్నికల్లో ఆ రాష్ట్రంలోని ప్రతి 25 లోక్సభ స్థానాలకు 1 లోక్సభ సీటైనా గెలుచుకోవాలి.
- లోక్సభ లేదా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కనీసం 6శాతం ఓట్లు సాధించాలి. అదనంగా ఒక లోక్సభ, రెండు అసెంబ్లీ సీట్లు గెలుచుకోవాలి.
- లోక్సభ లేదా శాసనసభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో 8శాతం ఓట్లు సాధించాలి. ఈ నిబంధనలలో ఏ ఒక్క దాన్ని సాధించినా రాష్ట్ర పార్టీగా గుర్తింపు కల్పిస్తారు.
ప్రతి జాతీయ, రాష్ట్ర పార్టీ మళ్లీ ఎన్నికల నాటికి ఆయా షరతుల్ని నెరవేర్చాల్సిందే.. లేదంటే తమ హోదాను కోల్పోతాయి.
జాతీయ పార్టీ హోదాతో ప్రయోజనాలివే..
- దేశవ్యాప్తంగా ఆ పార్టీ ఒకే గుర్తుపై పోటీ చేసే అవకాశం వస్తుంది.
- సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆకాశవాణి, దూరదర్శన్లలో ప్రసారాలకు అవకాశం లభిస్తుంది.
- ఎన్నికల సమయంలో రాష్ట్ర పార్టీలకు 20మంది స్టార్ క్యాంపెయినర్లకు అవకాశం ఉంటే.. జాతీయ పార్టీలకు మాత్రం గరిష్ఠంగా 40మంది దాకా పెట్టుకోవచ్చు. వారి ప్రయాణ ఖర్చులు అభ్యర్థుల ఖర్చు కింద పరిగణించరు.
- తమ పార్టీ ప్రధాన కార్యాలయాలు నిర్మాణానికి ప్రభుత్వ భూమిని పొందొచ్చు.
- అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసేందుకు ప్రతిపాదించేవారు ఒకరు ఉంటే సరిపోతుంది.
- జాబితా సవరణ సమయంలో రెండు ఓటరు జాబితా సెట్లు ఉచితంగా పొందుతారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో జాతీయ పార్టీ అభ్యర్థులు ఒక కాపీని ఉచితంగా పొందే వీలుంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు