Gujarat: నామినేషన్ తర్వాత ఆప్ అభ్యర్థి ‘కిడ్నాప్’.. కేజ్రీవాల్ ట్వీట్
గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి అదృశ్యమయ్యారు. దీని వెనుక భాజపా హస్తం ఉందని ఆప్ ఆరోపిస్తోంది.
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. పోటీలో ఉన్న ఓ అభ్యర్థి అదృశ్యమవడం కలకలం రేపుతోంది. సూరత్ (తూర్పు) నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కంచన్ జరివాలా మంగళవారం మధ్యాహ్నం నుంచి కన్పించట్లేదంటూ పార్టీ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విటర్లో వెల్లడించారు. ఆయన కిడ్నాప్ అయి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం చేశారు.
‘‘సూరత్ (తూర్పు) నుంచి పోటీ చేస్తున్న మా అభ్యర్థి కంచన్ జరివాలా, ఆయన కుటుంబం నిన్నటి నుంచి అదృశ్యమైంది. ముందు.. కంచన్ నామినేషన్ తిరస్కరణకు గురయ్యేలా భాజపా ప్రయత్నాలు చేసింది. కానీ, అధికారులు ఆయన నామినేషన్ను ఆమోదించారు. ఆ తర్వాత, నామినేషన్ ఉపసంహరించుకోవాలని కంచన్పై ఒత్తిడి వచ్చింది. ఆయనను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా?’’ అని కేజ్రీవాల్ ఈ ఉదయం ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్పై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ రాఘవ్ చద్దా మీడియాతో మాట్లాడుతూ భాజపాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కంచన్ను భాజపానే కిడ్నాప్ చేసి రహస్య ప్రాంతానికి తీసుకెళ్లిందని ఆరోపించారు. నామినేషన్ ఉపసంహరించుకునేలా ఆయనపై కాషాయ పార్టీ ఒత్తిడి తెస్తోందని మండిపడ్డారు. దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా మాట్లాడుతూ.. ‘‘మంగళవారం మధ్యాహ్నం నామినేషన్ పత్రాల పరిశీలన కోసం కంచన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి బయటకు వస్తున్నప్పుడు కొందరు ఆయనను బలవంతంగా అపహరించి.. రహస్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఇది చాలా ప్రమాదకరం. ఇది కేవలం ఓ అభ్యర్థిని కిడ్నాప్ చేయడం మాత్రమే కాదు.. ప్రజాస్వామ్యాన్ని అపహరించడమే’’ అని కాషాయ పార్టీపై విరుచుకుపడ్డారు. అటు ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్ గఢ్వీ స్పందిస్తూ.. ‘‘ఆప్ను చూసి భాజపా భయపడుతోంది. అందుకే ఇలాంటి గూండాగిరీకి పాల్పడుతోంది’’ అని దుయ్యబట్టారు.
అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ నేతల ఆరోపణలను భాజపా తీవ్రంగా ఖండించింది. ఆప్ ఉద్దేశపూర్వకంగానే తమపై నిరాధారణ ఆరోపణలు చేస్తోందని భాజపా నేతలు మండిపడ్డారు. ముందు ఆ అభ్యర్థి గురించి వాళ్లు ఫిర్యాదు చేయాలని, ఆ తర్వాత దర్యాప్తులో నిజానిజాలు బయటికొస్తాయని అన్నారు. ఈ ‘కిడ్నాప్’ వ్యవహారంపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆప్ తెలిపింది. సూరత్ (తూర్పు) నియోజకవర్గం నుంచి భాజపా తరఫున అరవింద్ భాయ్ రాణా పోటీలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..