Arvind Kejriwal: సిసోదియాపై దాడులు.. గుజరాత్లో ఆప్ ఓటు షేర్ పెరిగింది..!
దేశ రాజధాని దిల్లీలో భాజపా - ఆప్ మధ్య రాజకీయ విభేదాలు ముదిరిన వేళ సొంత ప్రభుత్వంపై తీసుకొచ్చిన విశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి
భాజపాకు అరవింద్ కేజ్రీవాల్ కౌంటర్
విశ్వాస పరీక్షలో నెగ్గిన దిల్లీ ముఖ్యమంత్రి
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో భాజపా - ఆప్ మధ్య రాజకీయ విభేదాలు ముదిరిన వేళ సొంత ప్రభుత్వంపై తీసుకొచ్చిన విశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నెగ్గారు. ఆప్ ఎమ్మెల్యేలంతా సీఎంకు అనుకూలంగా ఓటేశారు. దీంతో కేజ్రీవాల్ మాట్లాడుతూ భాజపాపై విమర్శల వర్షం కురిపించారు. దిల్లీలో ఆపరేషన్ కమల్ విఫలమైందని రుజువైందని అన్నారు. సీబీఐ దాడులతో కేంద్రం తమను భయపెట్టాలని చూసిందని, కానీ అది వారికే హాని చేసిందన్నారు. ఈ సోదాలతో గుజరాత్లో తమ ఓటు షేరు పెరిగిందన్నారు.
ప్రభుత్వాలను కూలదోసేందుకు భాజపా చేపట్టిన ‘ఆపరేషన్ కమలం’ దిల్లీలో విఫలమైందని రుజువు చేసేందుకు ఆగస్టు 29న కేజ్రీవాల్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై నేడు ఓటింగ్ చేపట్టగా.. ఆప్ సర్కారు విజయం సాధించింది. 70 మంది శాసనసభ్యులున్న దిల్లీ అసెంబ్లీలో ఆప్కు 62, భాజపాకు 8 మంది ఎమ్మెల్యే సంఖ్యా బలం ఉంది. ఇందులో ఇద్దరు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉండగా.. మరో శాసనసభ్యుడు సత్యేంద్ర జైన్ జైల్లో ఉన్నారు. మిగిలిన 59 మందిలో ఒకరు స్పీకర్గా ఉన్నారు. విశ్వాస తీర్మానంపై గురువారం మూజువాణీ, డివిజన్ పద్ధతిలో ఓటింగ్ చేపట్టారు. కేజ్రీవాల్కు అనుకూలంగా 58 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. భాజపా ఎమ్మెల్యేలెవరూ సభలో లేకపోవడంతో వ్యతిరేకంగా ఒక్క ఓటూ పడలేదు. అసెంబ్లీలో ఆందోళనకు దిగినందుకు గానూ ముగ్గరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను స్పీకర్ మార్షల్స్తో బలవంతంగా బయటకు పంపించారు. ఈ ఘటనను నిరసిస్తూ మిగతా ఐదుగురు భాజపా ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.
4 శాతం పెరిగిన ఓటు షేరు..
విశ్వాస పరీక్ష అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ భాజపాపై ఆరోపణలు గుప్పించారు. దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాపై సీబీఐ దాడుల తర్వాత గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటు షేరు 4శాతం పెరిగిందన్నారు. సిసోదియాను అరెస్టు చేసిన తర్వాత ఓటు షేరు మరో 6శాతం పెరుగుతుందన్నారు. సీబీఐ దాడుల్లో సిసోదియా వద్ద ఏమీ దొరకలేదని, ప్రధాని మోదీ తమ నిజాయతీకి ఇచ్చిన సర్టిఫికేట్ ఇదేనని అన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు భాజపా రూ.20 కోట్ల నుంచి రూ.50కోట్ల వరకు ఆఫర్ చేసిందని.. అయితే వారి ఆఫర్ను ఒక్క ఆప్ ఎమ్మెల్యే కూడా స్వీకరించలేదని ఎద్దేవా చేశారు. ‘‘స్కూళ్లు, ఆసుపత్రులు కట్టించి నేనేమైనా తప్పు చేస్తున్నానా? మా పిల్లలిద్దరూ ఐఐటీల్లోనే చదివారు. అలాంటి విద్యనే దేశంలోని ప్రతి చిన్నారికి అందించాలనుకుంటున్నా’’ అని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)