Delta Plus Variant: పండుగల్లో జాగ్రత్త.. ఇప్పటివరకు నమోదైన డెల్టా ప్లస్ కేసులెన్నంటే?
భారత్ సహా ప్రపంచదేశాలను ఇంకా పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి వీక్లీ పాజిటివిటీ రేటు ట్రెండ్ మన దేశంలో తగ్గినట్టు కనబడుతున్నప్పటికీ కరోనా సెకండ్ వేవ్ ఇంకా తొలగిపోలేదని.....
వివరాలు వెల్లడించిన కేంద్రం
దిల్లీ: దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 300 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదైనట్టు కేంద్రం వెల్లడించింది. భారత్ సహా ప్రపంచదేశాలను ఇంకా పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి వీక్లీ పాజిటివిటీ రేటు ట్రెండ్ మన దేశంలో తగ్గినట్టు కనబడుతున్నప్పటికీ కరోనా సెకండ్ వేవ్ ఇంకా తొలగిపోలేదని తెలిపింది. దేశంలో కరోనా వైరస్ పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 31 నాటికి దేశంలో 39 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 10శాతం కన్నా అధికంగా ఉందని పేర్కొన్నారు. మరో 38 జిల్లాల్లో మాత్రం ఈ రేటు 5 నుంచి 10 శాతంగా ఉన్నట్టు చెప్పారు. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న ఆందోళనల నేపథ్యంలో రాబోయే పండుగల సీజన్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. జనం భారీగా గుమిగూడొద్దని, ఒకవేళ తప్పనిసరైతే పూర్తిగా వ్యాక్సినేషన్ అయ్యేలా చూసుకోవాలని కోరారు. ప్రజలంతా ఇళ్లలోనే పండుగలు జరుపుకోవాలని, వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
దేశంలో ప్రస్తుతం ఉన్న మూడున్నర లక్షలకు పైగా ఉన్న క్రియాశీల కేసుల్లో 2,30,461 (59.16శాతం) కేసులు ఒక్క కేరళలోనే ఉన్నాయన్నారు. 54,606 కేసులు (14.02 శాతం) మహారాష్ట్రలో, 18,438 కేసులు (4.73శాతం) కర్ణాటక, 16,620 కేసులు (4.27శాతం) తమిళనాడు, 14,473 కేసులు (3.71శాతం) ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు వివరించారు. యాక్టివ్ కేసులు లక్ష కన్నా అధికంగా ఒక రాష్ట్రంలో ఉండగా.. 10 వేలు నుంచి లక్ష వరకు నాలుగు రాష్ట్రాల్లో, 10వేల కన్నా తక్కువ కేసులు 31 రాష్ట్రాల్లో ఉన్నట్టు తెలిపారు.
దేశంలో సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో త్వరలో రాబోయే వినాయక చవితి, దీపావళి, ఈద్ వంటి పండుగలను ఇంట్లోనే జరుపుకోవాలని, బయట గుంపులు గుంపులుగా గూమిగూడద్దని అధికారులు కోరారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) వీకే పాల్ మాట్లాడుతూ..‘‘ గతేడాది కొవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ.. పండుగలను ఎలాగైతే జరుపుకొన్నామో.. ఈఏడాదీ అదే పద్ధతిని కఠినంగా అమలుచేయాలి. జనసంచార ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి’’ అని అన్నారు. ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ బలరామ్ భార్గవ మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత్లో సెకెండ్ వేవ్ కొనసాగుతోందని, అందుకే ప్రజలు తమ ప్రాంతాల్లో కొవిడ్ నిబంధనల్ని తూ.చ.తప్పకుండా అమలు చేయాలని సూచించారు. పండుగ సీజన్ సమీపించడంతో పాటు పాఠశాలలు పునఃప్రారంభం కావడం, కేరళలో పెరుగుతున్న కేసులు.. ఇలా మొత్తంగా కలుపుకొని గత రెండు నెలలుగా నమోదుకానంత స్థాయిలో గురువారం ఒక్కరోజే 47వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
బెంగళూరులోని బ్రూక్ఫీల్డ్లో ‘రామేశ్వరం కేఫ్’ బాంబు పేలుడు ఘటనలో కీలక కుట్రదారుని అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. -
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
ఎయిరిండియాకు విమానాలను లీజుకు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయంటూ నమోదైన కేసును కొట్టివేస్తూ.. నిందితుడిగా ఉన్న అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్కు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. -
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
ఇతరులను వేధించడం, వారిపై కన్నెర్ర చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. -
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు వేధిస్తున్నారని ఆయన సతీమణి సునీత ఆరోపించారు. -
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, దేశ సరిహద్దులు పూర్తి సురక్షితమని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. -
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం