Active cases:11 రాష్ట్రాలు.. 25లక్షలు!
భారత్లో కరోనా పెను ఉప్పెనలా విరుచుకుపడుతోంది. ఈ మహమ్మారి రోజురోజుకీ మరింత ఉద్ధృతరూపం దాల్చుతోంది.....
ఇంటర్నెట్ డెస్క్: భారత్లో కరోనా పెను ఉప్పెనలా విరుచుకుపడుతోంది. ఈ మహమ్మారి రోజురోజుకీ మరింత ఉద్ధృతరూపం దాల్చుతోంది. దేశవ్యాప్తంగా అనేకచోట్ల కఠిన ఆంక్షలు అమలులో ఉన్నా.. టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నా వైరస్ వాయువేగంతో వ్యాపిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా శుక్రవారం 4లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో క్రియాశీల కేసుల గ్రాఫ్ భారీగా పెరిగిపోతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ శాఖ తెలిపిన గణాంకాల ప్రకారం.. దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే అత్యధికంగా 19.45లక్షల శాంపిల్స్ పరీక్షించగా.. 4,01,993 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే, 2,99,988 మంది వైరస్ నుంచి కోలుకోగా.. 3523 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 32.68 లక్షలకు పెరిగిపోయింది. వీటిలో దాదాపు 25.5లక్షలకు పైగా (78.22% కేసులు) కేవలం 11 రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం.
ఆ రాష్ట్రాలివే..
మహారాష్ట్రలో 6.64లక్షల క్రియాశీల కేసులు ఉండగా.. ఆ తర్వాత కర్ణాటక, యూపీ, కేరళలో ఒక్కోచోట 3లక్షలకు పైగా ఉన్నాయి. అలాగే, రాజస్థాన్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, బిహార్లలో ఒక్కో రాష్ట్రంలో లక్ష పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
సెకండ్ వేవ్లో మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. శుక్రవారం దేశ వ్యాప్తంగా 3523 మరణాలు నమోదవ్వగా.. వీటిలో 76.75శాతం మరణాలు కేవలం పది రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం. మహారాష్ట్రలో అత్యధికంగా 828మంది ప్రాణాలు కోల్పోగా.. దిల్లీలో 375, యూపీ 332, ఛత్తీస్గఢ్ 269, కర్ణాటక 217, గుజరాత్ 173, రాజస్థాన్ 155, ఉత్తరాఖండ్ 122, జార్ఖండ్ 120, తమిళనాడు 113 చొప్పున కొత్తగా మరణాలు నమోదయ్యాయి. నాలుగు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.