Bharat Jodo Yatra: రాహుల్ పాదయాత్రలో మరో నటి సందడి
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) నిరాటంకంగా కొనసాగుతోంది. తమిళనాడులో మొదలైన ఈ పాదయాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో నడుస్తోంది.
ఉజ్జయిని: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) నిరాటంకంగా కొనసాగుతోంది. తమిళనాడులో మొదలైన ఈ పాదయాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో కొనసాగుతోంది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి రాహుల్ మొదలుపెట్టిన ఈ యాత్రకు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు హాజరై తమ మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ ఉజ్జయినిలో భారత్ జోడో యాత్రలో సందడి చేశారు. రాహుల్ గాంధీ పాదయాత్రకు తన మద్దతు ప్రకటించారు. ఆయనతో కలిసి కాసేపు నడుస్తూ ముచ్చటించిన ఫొటోలను కాంగ్రెస్ తన ట్విటర్ ఖాతాలో పంచుకుంది.
ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు రాహుల్ పాదయాత్రలో పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. వీరిలో అమోల్ పాలేకర్, సంధ్యా గోఖలే, పూజా భట్, పూనమ్ కౌర్, రియా సేన్, సుశాంత్ సింగ్, మోనా అంబేగావ్కర్, రష్మీ దేశాయ్, ఆకాంక్ష పూరీ తదితరులు ఉన్నారు. హాలీవుడ్ స్టార్ జాన్ కుసాక్ కూడా రాహుల్ పాదయాత్రకు ట్విటర్ వేదికగా మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ రూపొందించిన షెడ్యూల్ ప్రకారం.. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర డిసెంబర్ 4న రాజస్థాన్లోకి ప్రవేశించనుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Pak Cricket: భారత్ మోడల్కు తొందరేం లేదు.. ముందు ఆ పని చూడండి.. పాక్కు మాజీ ప్లేయర్ సూచన
-
General News
Taraka Ratna: విషమంగానే తారకరత్న ఆరోగ్యం: వైద్యులు
-
Movies News
Yash: రూ. 1500 కోట్ల ప్రాజెక్టు.. హృతిక్ వద్దంటే.. యశ్ అడుగుపెడతారా?
-
India News
Gorakhnath: గోరఖ్నాథ్ ఆలయంలో దాడి.. ముర్తజా అబ్బాసీకి మరణశిక్ష
-
Politics News
KTR: రాజ్భవన్లో రాజకీయ నాయకుల ఫొటోలు సరికాదు: కేటీఆర్
-
Crime News
TS news: ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి.. దిల్లీ ముఠా మోసాలు