అదర్‌ పూనావాలాకు Yకేటగిరీ భద్రత

పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదర్‌ పూనావాలాకు కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించింది. ఆయనకు వై కేటగిరీ...

Published : 28 Apr 2021 21:33 IST

దిల్లీ: పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదర్‌ పూనావాలాకు కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించింది. ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పిస్తూ హోంమంత్రిత్వశాఖ బుధవారం ఆదేశాలు జారీచేసింది. వై కేటగిరీ భద్రత కింద అదర్‌ పూనావాలాకు ఒకరు లేదా ఇద్దరు కమెండోలతో పాటు 11 మంది పోలీసు సిబ్బంది భద్రతగా ఉండనున్నారు. అదర్‌ పూనావాలాకు భద్రత కల్పించాలని కోరుతూ ప్రభుత్వ, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా రెగ్యులేటరీ వ్యవహారాల డైరెక్టర్‌ ప్రకాశ్‌ కుమార్‌ సింగ్‌ ఈ నెల  16న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు లేఖ రాశారు. కరోనా నివారణ టీకా ‘కొవిషీల్డ్‌’ సరఫరాకు సంబంధించి కొన్ని వర్గాల నుంచి ఆయనకు బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు