President of India: సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్లకు అదనపు బాధ్యతలు

సిక్కిం గవర్నర్‌ గంగా ప్రసాద్‌కు మణిపుర్‌ , అరుణాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ డా. బీడీ మిశ్రాకు మిజోరాం రాష్ట్రాల గవర్నర్లుగా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.

Updated : 10 Aug 2021 22:30 IST

దిల్లీ: సిక్కిం గవర్నర్‌ గంగా ప్రసాద్‌కు మణిపుర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ డా. బీడీ మిశ్రాకు మిజోరాం రాష్ట్రాల అదనపు బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం మణిపుర్‌ గవర్నర్‌గా విధులు నిర్వర్తిస్తున్న డా.నజ్మా హెప్తుల్లా సెలవుపై వెళ్లడంతో ఆ బాధ్యతలను గంగా ప్రసాద్‌కు అప్పగించారు. మిజోరాం గవర్నర్‌ కంభంపాటి హరిబాబు సెలవుపై వెళ్లడంతో డా.బీడీ మిశ్రా మిజోరాం బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని