Afghanistan: అమ్రుల్లా సలేహ్ దేశం విడిచి పారిపోయారా?
అఫ్గానిస్థాన్ అపద్ధర్మ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సలేహ్ దేశాన్ని విడిచి పరారైనట్లు తెలుస్తోంది.
కాబుల్: అఫ్గానిస్థాన్ ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సలేహ్ దేశాన్ని విడిచి పరారైనట్లు తెలుస్తోంది. కొందరు పంజ్షేర్ కమాండర్లతో కలిసి రెండు విమానాల్లో తజికిస్థాన్కు వెళ్లిపోయినట్లు సమాచారం. అఫ్గాన్ పౌరుల స్వేచ్ఛ కోసం పంజ్షేర్ పోరాటం సాగిస్తుందని గురువారం పేర్కొన్న అమ్రుల్లా.. ఆ మరుసటి రోజే దేశాన్ని విడిచి వెళ్లినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. పంజ్షేర్ను తాలిబన్లు చుట్టుముట్టడంతో ప్రాణభయంతోనే ఆ ప్రాంతంలోని పలు ప్రధాన ఫైటర్లతో కలిసి పారిపోయినట్లు వార్తలు రాగా.. వాటిని ఆయన ఖండించారు.
కాబుల్ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత అమ్రుల్లా సలేహ్ పంజ్షేర్ దళాలతో కలిసిపోయారు. అనంతరం పలుమార్లు తాలిబన్లతో చర్చలు జరిపినట్లు తెలిపారు. అఫ్గాన్ ప్రజలకు వారి దేశం ఎలా ఉండాలో ఎంచుకునే హక్కు ఉందని, వారి వ్యక్తిగత గుర్తింపు కోల్పోవడం తమకు ఏ మాత్రం ఇష్టం లేదని పేర్కొన్నారు. అఫ్గాన్ను తాలిబనిస్థాన్ కానీయమని వెల్లడించారు. ‘నా హృదయంలోని అరుణ వర్ణం అఫ్గానిస్థాన్. ఈ గడ్డపై నుంచి నా ఆత్మను వేరుచేసే శక్తి ఒక్క భగవంతుడికే ఉంది’ అని కొద్దిరోజుల క్రితమే మరో ట్వీట్లో పేర్కొన్నారు.
మరోవైపు అమ్రుల్లా సలేహ్ శుక్రవారం పలు ట్వీట్లు చేశారు. ‘పంజ్షేర్కు అన్ని రకాల రాకపోకలపై నిషేధం విధించారు. ఫోన్ సిగ్నళ్లు, విద్యుత్తు సరఫరా, చివరకు వైద్య సంబంధిత సామగ్రిని కూడా నిలిపివేశారు’ అని ట్వీట్ చేశారు. ‘23 ఏళ్ల క్రితం ఎమర్జెన్సీ మొదలైనప్పటి నుంచి కూడా తాలిబన్లకు అత్యవసర వైద్య సదుపాయాలను మేం నిలిపివేయలేదు. తాలిబన్లు యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. వారి ఈ తీవ్రవాద ప్రవర్తనను ఐక్యరాజ్య సమితి, ప్రపంచ నేతలు గుర్తించాలి’ అని మరో ట్వీట్లో పేర్కొన్నారు. అయితే తాజా ట్వీట్లు సైతం ఆయన దేశం విడిచి వెళ్లిపోయారనే వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. పంజ్షేర్లో ఇంటర్నెట్ సేవలను తాలినబ్లు నిలిపివేశారని, అమ్రుల్లా అక్కడే ఉంటే ఈ ట్వీట్లు ఎలా చేయగలిగారని స్థానిక మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, దేశం విడిచి పారిపోయారని తనపై వస్తున్న ఆరోపణలను అమ్రుల్లా సలేహ్ కొట్టిపారేశారు. తాను పంజ్షేర్లోనే ఉన్నట్లు ఓ ఆంగ్ల మీడియా సంస్థకు వెల్లడించారు. ప్రస్తుతం తన బేస్పాయింట్నే నుంచే మాట్లాడుతున్నట్లు తెలిపారు. తమ కమాండర్లు, రాజకీయ నేతలతో ఇక్కడే ఉన్నట్లు పేర్కొన్నారు. పంజ్షేర్ వ్యాలీలోని పలు ప్రాంతాలను తాలిబన్లు హస్తగతం చేసుకున్నారనే వార్తలను సైతం ఆయన కొట్టిపారేశారు. ఈ ప్రాంతం మొత్తం తమ అధీనంలోనే ఉన్నట్లు స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’