Afghan: తాలిబన్లు వచ్చేశారు, మీ కోసం వెతుకుతున్నారు.. అందుకే ఘనీ పరార్!
అఫ్గానిస్థాన్ దాదాపుగా తాలిబన్ల చేతికి వెళ్లిందన్న క్రమంలో దేశం విడిచి పారిపోయారు ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ. కోట్ల రూపాయలతో పరారైనట్లు వార్తలు రాగా.....
వాషింగ్టన్: అఫ్గానిస్థాన్ దాదాపుగా తాలిబన్ల చేతికి వెళ్లిందన్న క్రమంలో దేశం విడిచి పారిపోయారు ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ. కోట్ల రూపాయలతో పరారైనట్లు వార్తలు రాగా.. తాను కట్టుబట్టలతో దేశం విడిచినట్లు ఘనీ వెల్లడించారు. అయితే.. అధ్యక్షుడు అంత హడావుడిగా ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది? అనే విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్ తాజాగా వెలుగులోకి తీసుకొచ్చింది.
తాలిబన్లతో అధికారం పంచుకోవటం, భవిష్యత్తు కార్యాచరణ వంటి విషయాలపై చర్చించేందుకు ఆగస్టు 14న అధ్యక్ష భవనంలో అష్రఫ్ ఘనీ తన సన్నిహితులతో భేటీ అయ్యారు. వారితో విస్తృతంగా చర్చలు సాగిస్తున్నారు. ఈ సందర్భంలోనే అఫ్గాన్లోని ఒక్కో ప్రాంతాన్ని తాలిబన్లు ఆక్రమించుకుంటున్న వార్తలు వరుసగా వస్తున్నాయి. ఈ క్రమంలో లంచ్ సమయానికి ఘనీ మినహా అంతా భోజనానికి వెళ్లారు. సీన్ కట్ చేస్తే.. భోజనం చేసి వచ్చిన అధికారులకు అధ్యక్షుడు కనిపించలేదు. అమెరికా బలగాల ఉపసంహరణ గడువు (ఆగస్టు 31) వరకు అధ్యక్షుడిగా ఘనీ కొనసాగుతారని.. చర్చల ద్వారా అధికార బదలాయింపు జరుగుతుందని నమ్మకంతో ఉన్న అధికారులకు అధ్యక్షుడు కనిపించకపోవడంతో షాక్ తగిలినట్లయింది.
ప్రతి గదిని వెతుకున్నారని చెప్పి..
ఉన్నతాధికారులంతా మధ్యాహ్న భోజనానికి వెళ్లిన క్రమంలో ఘనీకి అత్యంత సన్నిహిత అధికారి ఒకరు వచ్చి తాలిబన్లు ప్యాలెస్లోకి ప్రవేశించారని, మీ కోసం ప్రతి గదిని వెతుకుతున్నారని చెప్పాడు. ఇక్కడే ఉంటే మిమ్మల్ని చంపేస్తారని హెచ్చరించాడు. దాంతో ఆందోళన చెందిన అష్రఫ్ ఘనీ.. దేశం విడిచేందుకు నిర్ణయించుకున్నారు. ఇంటికి వెళ్లి తనకు సంబంధించిన కొన్ని వస్తువులను తెచ్చుకుంటానని ఆ అధికారితో చెప్పినా.. ఆ అధికారి అందుకు ఒప్పుకోలేదు. మీకు సమయం లేదని, వెంటనే వెళ్లకపోతే ప్రాణాలకే ప్రమాదమని భయపెట్టాడు. దాంతో తన సన్నిహితులు, అధికారులకు సమాచారం ఇవ్వకుండానే హెలికాప్టర్ ఎక్కి ఉజ్బెకిస్థాన్ పారిపోయారు. అక్కడి నుంచి విమానం ద్వారా యూఏఈకి వెళ్లారు.
పొలిమేరల్లోనే ఉండిపోయిన తాలిబన్లు
అధ్యక్ష భవనంలోకి తాలిబన్లు ప్రవేశించారనే తప్పుడు సమాచారంతో గందరగోళానికి గురైన అధికారి వల్లే ఘనీ దేశం విడిచినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. నిజానికి గతంలో జరిగిన ఒప్పందానికి కట్టుబడిన తాలిబన్లు కాబుల్ పొలిమేరల్లోనే ఉండిపోయారని, ప్యాలెస్లోకి ప్రవేశించలేదని తెలిపింది. 1996లో తాలిబన్లు దేశాన్ని ఆక్రమించిన క్రమంలో అప్పటి అధ్యక్షుడిని ఏ విధంగా హత్య చేశారో ఊహించుకుని.. ఆ భయంతోనే ఘనీ దేశం విడిచి పారిపోయినట్లు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో