National Security: ఏ వైపు నుంచి ముప్పు వచ్చినా తిప్పికొట్టగలం: రాజ్నాథ్
తాలిబన్ల చెరలో చిక్కుకున్న అఫ్గానిస్థాన్లో నెలకొన్న పరిస్థితులు భద్రతాపరమైన కొత్త ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ అన్నారు.......
చండీగఢ్: తాలిబన్ల చెరలో చిక్కుకున్న అఫ్గానిస్థాన్లో నెలకొన్న పరిస్థితులు భద్రతాపరమైన కొత్త ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పరిస్థితులనైనా సమర్థంగా, అప్రమత్తతో ఎదుర్కోగలదని ధీమా వ్యక్తం చేశారు. భాజపా సీనియర్ నేత బలరామ్ దాస్ టాండన్ మూడో వర్థంతి సందర్భంగా జాతీయ భద్రత అంశంపై పంజాబ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన వర్చువల్గా పాల్గొని స్మారకోపన్యాసం చేశారు. అఫ్గానిస్థాన్లో పరిణామాలను ఆసరాగా తీసుకొని సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ఎగదోసే దేశ వ్యతిరేకశక్తులను ఎట్టిపరిస్థితుల్లో అనుమతించరాదన్నారు. అఫ్గానిస్థాన్లో జరుగుతున్న అంశాలు భద్రతాపరమైన కొత్త ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. అక్కడి పరిణామాలను మన ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తోందని తెలిపారు. దేశ వ్యతిరేక శక్తులు సరిహద్దుల నుంచి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు అవకాశం ఇవ్వరాదన్నారు. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉందన్నారు.
దృఢమైన భారతదేశమే లక్ష్యంగా..
వాయు, జల, భూ మార్గాల్లో ఏ వైపు నుంచి ముప్పు వచ్చినా ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నట్టు చెప్పారు. కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు జాతీయ భద్రతా వ్యవస్థలను ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తున్నట్టు చెప్పారు. ఆధునిక సాంకేతిక అభివృద్ధి దృష్ట్యా కొత్త తరహా సవాళ్లు ఎదురవుతున్నాయన్న కేంద్ర రక్షణ మంత్రి.. జమ్మూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద ఇటీవల డ్రోన్లతో రెండు బాంబులను విడిచిపెట్టిన ఘటనను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇలాంటి కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు నిరంతరం జాతీయ భద్రతా వ్యవస్థను అప్డేట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు. భారత్ను బలమైన, దృఢమైన, సురక్షితమైన దేశంగా నిలపడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోందని చెప్పారు. భారత్- పాక్ మధ్య అపనమ్మకాలు ఉందన్న ఆయన.. జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాల్పుల విరమణ ఒప్పందాల్ని ఉల్లంఘించడం ద్వారా సాధించేదేమీ లేదని పాకిస్థాన్ గ్రహించి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
పాక్.. ఉగ్రవాదులకు ఓ నర్సరీ
1965, 1971లలో జరిగిన యుద్ధాల్లో పరాజయం పాలైన పాకిస్థాన్కు భారత్తో పూర్తిస్థాయి యుద్ధం చేసే పరిస్థితి లేదని రుజువైపోయిందన్నారు. మనతో నేరుగా తలపడే ధైర్యం లేని పాకిస్తాన్ తన భూభాగాన్ని ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం, ఆయుధాలు, ఆర్థికవనరులను సమకూర్చడం ద్వారా భారత్ను లక్ష్యంగా చేసుకుంటోందన్నారు. 1980ల తర్వాత ప్రపంచం మొత్తంలోనే పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఓ నర్సరీగా మారిపోయిందన్నారు. గత ఏడేళ్లుగా భారత సైన్యం ఉగ్రవాదుల కుట్రలను తిప్పికొడుతున్నాయని చెప్పారు. కశ్మీర్లో మిగిలిన ఉగ్రవాదం కూడా అంతమవుతుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు. ఎందుకంటే వేర్పాటువాద శక్తుల బలోపేతానికి ప్రాణవాయువుగా ఉన్న ఆర్టికల్ 370, 35ఏ రద్దు చేసినందువల్లే తానీ మాట చెప్పగలగుతున్నానన్నారు. దేశ భద్రత విషయంలో మోదీ సర్కార్ రాజకీయాలు చేయదు.. అనుమతించదన్నారు. తమ విధులు నిర్వర్తించడంలో సైన్యానికే పూర్తి స్వేచ్ఛనిచ్చామన్నారు.
చైనాతో వివాదం చర్చలతోనే పరిష్కారం
పొరుగుదేశం చైనాతో సరిహద్దు వివాదం చర్చలతో పరిష్కారమవ్వాలని భారత్ కోరుకుంటోందని కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. వాస్తవాధీన రేఖ వద్ద ఏకపక్ష చర్యలను భారత్ ఎన్నటికీ అంగీకరించబోదని, సరిహద్దుల్లో నిబంధనల ఉల్లంఘనను అనుమతించేదది లేదని తేల్చి చెప్పారు. ‘‘సరిహద్దు విషయమై భారత్, చైనా మధ్య విభేదాలున్నాయి. వాటిని పక్కనబెడితే వాస్తవాధీన రేఖ వెంబడి పెట్రోలింగ్ నిర్వహించేందుకు రెండు దేశాల మధ్య కొన్ని ఒప్పందాలు ప్రొటోకాల్స్ ఉన్నాయి. అయితే వీటిని చైనా బలగాలు విస్మరించాయి’’ అని గతేడాది తూర్పు లద్దాఖ్ ఉద్రిక్తతలను కేంద్రమంత్రి ప్రస్తావించారు. ప్రొటోకాల్స్ను ఉల్లంఘించడం వల్లే ఆ రోజు(గల్వాన్ ఘర్షణలను ఉద్దేశిస్తూ) గల్వాన్లో చైనా బలగాలను భారత జవాన్లు అడ్డుకుని వెనక్కి పంపించారని తెలిపారు. ‘‘దేశ సరిహద్దులు, ఆత్మగౌరవం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ రాజీపడదు. చైనాతో సరిహద్దు వివాదం చర్చల ద్వారా పరిష్కారం అవ్వాలని భారత్ కోరుకుంటోంది. అయితే సరిహద్దుల పవిత్రతను ఉల్లంఘించడాన్ని సహించేది లేదు. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా బలగాల ఏకపక్ష చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదు’’ అని రాజ్నాథ్ చెప్పుకొచ్చారు. ఇక సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను పెంచేందుకు కూడా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. రోహ్తంగ్లో అటల్ టన్నల్ ప్రాజెక్టును పూర్తిచేశామని, వ్యూహాత్మకంగా ఇది చాలా కీలకమైన సొరంగమని చెప్పారు. లద్దాఖ్లోనూ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు రావడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. లోక్సభ ఎన్నికలకు ముందు తమను ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆరోపించింది. -
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
Sunita Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్కు మద్దతుగా ఆయన సతీమణి సునీత వాట్సప్ ప్రచారాన్ని ప్రారంభించారు. -
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
Arvind Kejriwal: కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. -
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1800 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1800 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు