Afghanistan: అఫ్గాన్ మహిళలు ఆటలాడొద్దు.. తాలిబన్ల ఆదేశాలు..!
అఫ్గానిస్థాన్లో 20ఏళ్ల కిందట తాలిబన్లు అధికారంలో ఉన్నప్పుడు మహిళల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించారు. వారి హక్కులను కాలరాశారు.
కాబుల్: అఫ్గానిస్థాన్లో 20ఏళ్ల కిందట తాలిబన్లు అధికారంలో ఉన్నప్పుడు మహిళల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించారు. వారి హక్కులను కాలరాశారు. ఇప్పుడు మరోసారి వారి పాలన మొదలవడంతో మహిళలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. తాలిబన్ల రాజ్యం మొదలయ్యాక అక్కడి మహిళల హక్కులు ఒక్కొక్కటిగా హరించుకుపోతున్నాయి. షరియా చట్టాలకు అనుగుణంగానే పాలన సాగిస్తామని చెప్పిన తాలిబన్లు.. అందుకు తగినట్లుగా మహిళలపై అనేక ఆంక్షలు విధిస్తున్నారు. తాజాగా అఫ్గాన్ మహిళలు క్రికెట్ సహా ఎలాంటి క్రీడల్లో పాల్గొనవద్దని ఆదేశించారు. వారు ఆటలు ఆడేందుకు అనుమతించట్లేదని స్పష్టం చేశారు. అమ్మాయిలకు క్రీడలు అవసరం లేదని, వాటి వల్ల బాడీ ఎక్స్పోజింగ్ అవుతుందని తాలిబన్ కల్చరల్ కమిషన్ డిప్యూటీ హెడ్ అహ్మదుల్లా వాసిఖ్ తెలిపారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘మహిళలకు ఆటలు ముఖ్యమని అనుకోవట్లేదు. క్రికెట్, ఇంకే ఆటైనా సరే అమ్మాయిలు ఆడాల్సిన అవసరం లేదు. క్రీడల్లో మహిళలకు ఇస్లామిక్ డ్రెస్ కోడ్ ఉండదు. అక్కడ ఆడేవారి ముఖం, శరీరం కవర్ చేసుకోలేరు. ఇక ఇప్పుడున్న మీడియా ద్వారా ప్రపంచంలో వారి ఫొటోలు, వీడియోలను ప్రపంచమంతా చూస్తారు. మహిళలు అలా కన్పించడాన్ని ఇస్లామిక్ ఎమిరేట్(తాలిబన్ల ప్రభుత్వం) అంగీకరించదు. అందువల్ల మహిళలకు క్రీడల్లో పాల్గొనేందుకు అనుమతినివ్వట్లేదు’’ అని వాసిఖ్ చెప్పుకొచ్చారు.
అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు గతేడాదే 25 మంది మహిళా క్రికెటర్లకు కాంట్రాక్ట్లు ఇచ్చింది. ఇప్పుడు వారి భవితవ్యంపై ఆందోళన నెలకొంది. మరోవైపు ఇప్పటికే ఆ దేశ మహిళా ఫుట్బాల్ జాతీయ జట్టు సభ్యులు తమ జెర్సీలను తగలబెట్టినట్లు వార్తలు వచ్చాయి. అటు చదువుకునే అమ్మాయిలపైనా తాలిబన్లు అనేక ఆంక్షలు విధించారు. అమ్మాయిలకు పురుషులు బోధించొద్దని విద్యాసంస్థలను ఆదేశించారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు వెళ్లే మహిళలు తప్పనిసరిగా బుర్ఖా, నికాబ్ ధరించాలని, క్లాసుల్లో అమ్మాయిలు, అబ్బాయిల మధ్య పరదా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అబ్బాయిలు క్యాంపస్ నుంచి పూర్తిగా బయటకు వెళ్లిన తర్వాతే అమ్మాయిలను పంపించాలని ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్