Afghanistan Crisis: తాలిబన్లకు షాక్.. హక్కుల కోసం రోడ్డెక్కిన మహిళలు
అఫ్గానిస్థాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై తాలిబన్లు జోరుగా పావులు కదుపుతున్నారు. అమెరికా బలగాలు పూర్తిగా నిష్క్రమించడంతో సాధ్యమైనంత త్వరగా కొత్త ప్రభుత్వాన్ని కొలువుదీర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నానికే .....
కాబుల్: అఫ్గానిస్థాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై తాలిబన్లు జోరుగా పావులు కదుపుతున్నారు. అమెరికా బలగాలు పూర్తిగా నిష్క్రమించడంతో సాధ్యమైనంత త్వరగా కొత్త ప్రభుత్వాన్ని కొలువుదీర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నానికే కేబినెట్ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొంతమంది మహిళలు తమ హక్కుల కోసం రోడ్డెక్కారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో మహిళలకూ భాగస్వామ్యం కల్పించాలంటూ డిమాండ్ చేయడం గమనార్హం. ఇరాన్ సరిహద్దుకు సమీపంలోని హెరాత్ నగరంలోని సిల్క్ రోడ్డుపై కొందరు మహిళా కార్యకర్తలు, విద్యార్థులు, పలు ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు తమ హక్కుల కోసం గళం విప్పారు. తాలిబన్ల ప్రభుత్వంలో మహిళలకు చోటు దక్కకపోవచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ నిరసనలు కీలక ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న అఫ్గానిస్థాన్లో ప్రజల్లో అపనమ్మకం, తీవ్ర అశాంతి వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో తాలిబన్లు ఏర్పాటు చేసే ప్రభుత్వంలో తమ హక్కుల కోసం మహిళలు గళం వినిపిస్తున్నారు. విద్య, భద్రతను, పనిని పొందడం తమ హక్కు అంటూ మహిళలు నినాదాలు చేశారు. తమకేం భయంలేదని.. అంతా ఐక్యంగా ఉన్నాం అంటూ దాదాపు 50 మంది మహిళలు ప్లకార్డులతో రోడ్డుపై నిరసన వ్యక్తంచేశారు. తాలిబన్ ప్రభుత్వ కేబినెట్లో మహిళలకు కూడా చోటు కల్పించాలని బసీరా తాహెరీ అనే మహిళ డిమాండ్ చేశారు. తాలిబన్లు తమతో చర్చలు జరపాలని కోరుకుంటున్నామన్నారు. తాలిబన్ల సమూహాల్లో, సమావేశాల్లో ఒక్క మహిళను కూడా తాము చూడలేదంటున్నారు. మహిళలు లేకుండా ప్రభుత్వం మనుగడ సాగించలేదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
అఫ్గాన్ మహిళలు ఉద్యోగం చేసేందుకు అవకాశం కల్పించినప్పటికీ వారికి కేబినెట్లో గానీ, ప్రభుత్వంలో, ఏ ఇతర ఉన్నత పదవుల్లో గానీ స్థానం కల్పించే అవకాశం లేదంటూ తాలిబన్ల సీనియర్ నేత మహమ్మద్ అబ్బాస్ ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.