Jammu kashmir: లభ్యమైన మృతదేహం ఆయనదే..!

జమ్మూకశ్మీర్‌లోని కుల్గాంలో లభ్యమైన మృతదేహాన్ని రైఫిల్‌మ్యాన్‌ షాకిర్‌ మంజూర్‌దేనని పోలీసులు ధ్రువీకరించారు

Published : 24 Sep 2021 00:05 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని కుల్గాంలో లభ్యమైన మృతదేహం రైఫిల్‌మ్యాన్‌ షాకిర్‌ మంజూర్‌దేనని పోలీసులు ధ్రువీకరించారు. గతేడాది ఆగస్టు 2న షాకిర్‌ తప్పిపోయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి అతని కోసం గాలిస్తునే ఉన్నారు. తాజాగా నిన్న కుళ్లిపోయిన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మృతదేహాన్ని పరీక్షించి తప్పిపోయిన షాకిర్‌గా ధ్రువీకరించారు. అతడు అదృశ్యమైన 13 నెలల తర్వాత అతడి మృతదేహాన్ని గుర్తించడం గమనార్హం. ఉగ్రవాదులు అతడ్ని కిడ్నాప్‌ చేసి చిత్రహింసలు పెట్టి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.

దీనిపై షాకిర్‌ తండ్రి మంజూర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ..‘‘ఇన్ని రోజులు కొడుకు తప్పిపోయాడని అతని కోసం వెతుకుతూనే ఉన్నాను. చివరకు మృతదేహమైనా లభించింది. ఎన్నిసార్లు షాకిర్‌ గురించి అడిగిన పోలీసులు తెలియలేదనే సమాధానం ఇచ్చారు. పాకిస్థాన్‌లో ఉండొచ్చు. ఉగ్రవాదులతో కలిసి పోవచ్చు అనే మాటలు నాకు చాలా బాధ కలిగించాయి. ఈరోజు నా కొడుకును కోల్పోయినందుకు బాధగా ఉంది. కానీ మాయని మచ్చ తొలగిపోయినందుకు సంతోషిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. కాగా,  మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సైనిక లాంఛనాలతో మృతుని స్వగ్రామంలోనే అంత్యక్రియలు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని