UP Elections 2022: 94వ సారి ఎన్నికల బరిలోకి.. 100 సార్లు ఓడిపోవడమే లక్ష్యం
ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలను వేగంగా మారుతున్నాయి. అధికారంలో ఉన్న భాజపా నుంచి కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు.. ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీలో
లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలను వేగంగా మారుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం అయిన యూపీలో ఈ సారి ఓ వ్యక్తి 94వ సారి ఎన్నికల్లో పోటీ చేయబోతుండటం విశేషం. ఇప్పటివరకు 93సార్లు పోటీ చేసిన ఆయన.. వాటన్నింటిలోనూ ఓటమి పాలుకావడం గమనార్హం. ఆగ్రా జిల్లాలోని ఖేరాగడ్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని 74 ఏళ్ల హసనురామ్ అంబేద్కర్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
డా.బి.ఆర్.అంబేద్కర్ సిద్ధాంతంతో అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు హసనురామ్ పేర్కొన్నారు. ఇతడు వ్యవసాయ కూలీ. హసనురామ్ 1985 నుంచి స్థానిక సంస్థలు, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా వివిధ నియోజకవర్గాల్లో పోటీచేస్తూ వస్తున్నారు. 1988లో రాష్ట్రపతి అభ్యర్థిగానూ నామినేషన్ దాఖలు చేశారు. కానీ, అది తిరస్కరణకు గురైంది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ నుంచి పోటీ చేశారు. 1989 లోక్సభ ఎన్నికల్లో ఫిరోజాబాద్ నుంచి పోటీచేశారు. ఈయన పోటీచేసిన ఎన్నికల్లో అత్యధికంగా ఓట్లు (36,000) వచ్చింది ఇక్కడే. ఇతడు అధికారికంగా విద్య అభ్యసించినట్లు ఆధారాలు లేవు. కానీ, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ చదవడం, రాయడం విశేషం.
‘నిష్పక్షపాత, అవినీతి రహిత అభివృద్ధి, సమాజంలో అట్టడుగు వర్గాల సంక్షేమమే నా ఎజెండా. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం స్థాపించిన అఖిల భారత వెనుకబడిన, మైనార్టీ వర్గాల ఉద్యోగుల సమాఖ్య (బామ్సెఫ్)లో అంకితభావంతో గల కార్యకర్తని. బీఎస్పీలో కూడా పనిచేశా. 1985లో టికెట్ అడిగితే నీ భార్య కూడా నీకు ఓటు వేయదు.. అని హేళన చేశారు. దీంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యా. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేస్తున్నా. నేను ఓడిపోవడానికే ఎన్నికల్లో పోటీ చేస్తాను. గెలిచి తర్వాత నాయకులు ప్రజలను మరిచిపోతారు. ఎన్నికల్లో 100 సార్లు ఓడిపోయి రికార్డు నెలకొల్పడమే నా లక్ష్యం. అంబేద్కర్ సిద్ధాంతాలను విశ్వసించే ఓటర్లకు ఆప్షన్ ఇచ్చేందుకు ఎన్నికల్లో పోటీ చేస్తాను. కాబట్టి నా ప్రత్యర్థులు ఎవరనేది పట్టించుకోను’ అని హసనురామ్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్