ఏఐడీఎంకేతో కలిసి ఎన్నికల్లో పోటీ: నడ్డా

తమిళనాడులో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఏఐఏడీఎంకే పార్టీతో తమ పొత్తు కొనసాగుతుందని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆదివారం మధురైలో నిర్వహించిన బహిరంగసభలో.....

Updated : 31 Jan 2021 05:29 IST

చెన్నై: తమిళనాడులో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఏఐఏడీఎంకే పార్టీతో తమ పొత్తు కొనసాగుతుందని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆదివారం మధురైలో నిర్వహించిన బహిరంగసభలో వెల్లడించారు. ‘ఏఐఏడీఎంకే పార్టీతో భాజపా పొత్తు కొనసాగుతుంది. రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తాయి’ అని నడ్డా తెలిపారు. అంతకుముందు ఆయన మధురైలోని మీనాక్షి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం తమిళనాడు భాజపా కోర్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి హాజరై రాష్ట్ర స్థాయి నాయకులతో ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు.

ఇప్పటికే గత నవంబర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తమిళనాడు పర్యటనలో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి రెండు పార్టీల పొత్తుపై కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ‘లోక్‌సభ ఎన్నికల మాదిరే భాజపా అన్నాడీఎంకే పొత్తు కొనసాగుతుంది. 2021 ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తుంది. మోదీకి తమిళనాడు ప్రజల మద్దతు ఎప్పటికీ ఉంటుంది’ అని తెలిపారు. గత లోక్‌సభ ఎన్నికల్లో భాజపా-ఏఐఏడీఎంకే కూటమి ఆశించిన మేర రాణించలేకపోయింది.

ఇదీ చదవండి

దిల్లీ పేలుడు ఆ ఉగ్రవాదుల పనేనా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని