ఊరు వెళ్లాలంటే ఇవి పాటించాల్సిందే!
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్డౌన్ నిబంధనలను సడలించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ 4.0లో భాగంగా దేశీయంగా
మార్గదర్శకాలను విడుదల చేసిన ఆరోగ్య మంత్రిత్వశాఖ
న్యూదిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్డౌన్ నిబంధనలను సడలించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ 4.0లో భాగంగా దేశీయంగా ప్రయాణాలకు అనుమతులు ఇస్తున్నారు. నిబంధనల మేరకు విమాన, రైలు, బస్సుల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ దేశీయంగా ప్రయాణాలు చేసేవారు ఎలాంటి నియమ, నిబంధనలు పాటించాలి, విదేశాల నుంచి వచ్చే వారు ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న మార్గదర్శకాలను విడుదల చేసింది.
విమాన/రైలు/అంతర్రాష్ట్రీయంగా ప్రయాణాలు
> ప్రయాణ సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? అన్న వివరాలను ట్రావెలర్స్, ఏజెన్సీలు టికెట్తో పాటు ముద్రించాల్సిందే.
> స్మార్ట్ఫోన్ వినియోగించే ప్రయాణికుడు ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలి.
> కొవిడ్-19 వ్యాప్తి నియంత్రణకు విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో ప్రకటించిన విధి,విధానాలను తప్పక పాటించాలి.
> రాష్ట్రాలు/కేంద్ర పాలితప్రాంతాలు తప్పనిసరిగా ప్రయాణికులను థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. కరోనా లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే అనుమతించాలి.
> ప్రయాణ సమయంలో ప్రయాణికులు తప్పనిసరిగా ఫేస్ మాస్క్ ధరించాలి. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసే బాధ్యత కూడా ప్రయాణికుడిదే.
> విమానాశ్రయాలు/రైల్వేస్టేషన్లు/బస్టాండ్లలో ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి.
> విమానాశ్రయాలు/రైల్వేస్టేషన్లు/బస్టాండ్లను తరచూ శానిటైజ్ చేయాలి. క్రిమినాశక ద్రావణాలతో శుభ్రపరచాలి. అదే విధంగా ప్రయాణికులకు సబ్బులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి.
>ప్రయాణం ముగించుకుని బయటకు వెళ్లే సమయంలోనూ ప్రయాణికులను థర్మల్ స్క్రీనింగ్ చేయాలి.
>కరోనా లక్షణాలు కనిపించిన ప్రయాణికులను దగ్గర్లో ఐసోలేషన్ సౌకర్యం ఉన్న ఆస్పత్రికి తరలించాలి. ప్రయాణికుడి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలి.
>తీవ్ర కరోనా లక్షణాలు ఉన్నవారిని కొవిడ్-19 చికిత్స కేంద్రాలకు తరలించాలి.
>కరోనా లక్షణాలు స్వల్పంగా ఉంటే వారిని హోం క్వారంటైన్కు లేదా ఐసోలేటెడ్ కొవిడ్-19 వార్డుకు తరలించాలి. ఇది వారి ఎంపికను బట్టి ఉంటుంది. ఐసీఎంఆర్ ప్రామాణికాల ఆధారంగా ఇవి ఉండాలి.
>ఐసోలేటెడ్ వార్డుకు తరలించిన తర్వాత ఎవరికైనా నెగిటివ్ వస్తే అలాంటి వారిని వారం రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచిన తర్వాత పంపాలి. ఆ తర్వాత కూడా మరో వారం హోం క్వారంటైన్ విధిగా పాటించేలా జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వాలి.
విదేశాల నుంచి వచ్చే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
> విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ప్రయాణ తేదీ నుంచి 14రోజులు క్వారంటైన్లో తప్పనిసరిగా ఉండాలి. ఇందులో ఏడు రోజుల పాటు సొంత ఖర్చులతో ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉండాలి. ఆ తర్వాత మరో ఏడు రోజుల పాటు స్వీయ పర్యవేక్షణలో హోం క్వారంటైన్లో ఉండాలి.
> తీవ్ర ఒత్తిడికి గురయ్యే వారు, గర్భిణిలు, కుటుంబంలో మరణం సంభవించిన వారు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు, 10 సంవత్సరాలలోపు వయసు కలిగిన చిన్నారులు, వారి తల్లిదండ్రులకు నిర్దేశిత క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే వీరు తప్పనిసరిగా 14రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలి.
> ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా ఆరోగ్యసేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.
> ఎటువంటి కరోనా లక్షణాలు లేని వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు.
> రోడ్డు మార్గాన దేశంలోకి ప్రవేశించే ప్రయాణీకులు కూడా అన్ని ప్రోటోకాల్ నిబంధనలు అనుసరించాల్సిందే. ఎటువంటి లక్షణాలు లేని వారు మాత్రమే సరిహద్దు ద్వారా భారతదేశంలోకి వచ్చేందుకు అనుమతిస్తారు.
> విమానంలో, ఓడలో వచ్చే వారు.. స్వీయ-డిక్లరేషన్ ఫారం నింపాలి. దాని ప్రతిని విమానాశ్రయం, ఓడరేవుల్లోని ఇన్యాడ్పోర్ట్ వద్ద ఉన్న ఆరోగ్య, ఇమ్మిగ్రేషన్ అధికారులకు అందించాలి.
> విమానాలు, విమానాశ్రయాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలి.
> బోర్డింగ్ సమయంలో ప్రయాణికులు వ్యక్తిగత దూరం పాటించాలి.
> ప్రయాణ సమయంలో విధిగా మాస్క్ ధరించాలి. చేతులు శుభ్రంగా ఉండేలా హ్యాండ్ శానిటైజర్లు వాడాలి
> ఆరోగ్య, ఇమిగ్రేషన్ అధికారులు చేసే థర్మల్ స్క్రీనింగ్కు అందరూ సహకరించాలి.
> కరోనా లక్షణాలు ఉన్నవారిని ఐసోలేషన్కు తరలించడంతో పాటు, మిగిలిన ప్రయాణికులకు క్వారంటైన్ వసతిని ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కల్పించాలి.
> ప్రతి ప్రయాణికుడిని ఐసీఎంఆర్ ప్రమాణాల ప్రకారం పరీక్షించాలి.
> ఐసోలేటెడ్ వార్డుకు తరలించిన తర్వాత ఎవరికైనా నెగిటివ్ వస్తే అలాంటి వారిని వారం రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచిన తర్వాత పంపాలి. ఆ తర్వాత కూడా మరో వారం హోం క్వారంటైన్ విధిగా పాటించేలా జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వాలి.
> సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్న కాలంలో, ఆ తరువాత అయినా.. ఏదైనా లక్షణాలు ఉంటే.. వారు జిల్లా నిఘా అధికారికి లేదా రాష్ట్ర లేదా జాతీయ కాల్ సెంటర్కు 1075 తెలియజేయాలి.
కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల పీడీఎఫ్ కోసం క్లిక్ చేయండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!