ఊరు వెళ్లాలంటే ఇవి పాటించాల్సిందే!

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ 4.0లో భాగంగా దేశీయంగా

Updated : 24 May 2020 19:25 IST

మార్గదర్శకాలను విడుదల చేసిన ఆరోగ్య మంత్రిత్వశాఖ

న్యూదిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ 4.0లో భాగంగా దేశీయంగా ప్రయాణాలకు అనుమతులు ఇస్తున్నారు. నిబంధనల మేరకు  విమాన, రైలు, బస్సుల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ దేశీయంగా ప్రయాణాలు చేసేవారు ఎలాంటి నియమ, నిబంధనలు పాటించాలి, విదేశాల నుంచి వచ్చే వారు ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న మార్గదర్శకాలను విడుదల చేసింది.

విమాన/రైలు/అంతర్రాష్ట్రీయంగా ప్రయాణాలు

> ప్రయాణ సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? అన్న వివరాలను ట్రావెలర్స్‌, ఏజెన్సీలు టికెట్‌తో పాటు ముద్రించాల్సిందే.

> స్మార్ట్‌ఫోన్‌ వినియోగించే ప్రయాణికుడు ఆరోగ్యసేతు యాప్‌ తప్పనిసరిగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

> కొవిడ్‌-19 వ్యాప్తి నియంత్రణకు విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లలో ప్రకటించిన విధి,విధానాలను తప్పక పాటించాలి.

> రాష్ట్రాలు/కేంద్ర పాలితప్రాంతాలు తప్పనిసరిగా ప్రయాణికులను థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయాలి. కరోనా లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే అనుమతించాలి.

> ప్రయాణ సమయంలో ప్రయాణికులు తప్పనిసరిగా ఫేస్‌ మాస్క్‌ ధరించాలి. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసే బాధ్యత కూడా ప్రయాణికుడిదే.

> విమానాశ్రయాలు/రైల్వేస్టేషన్లు/బస్టాండ్‌లలో ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి.

> విమానాశ్రయాలు/రైల్వేస్టేషన్లు/బస్టాండ్‌లను తరచూ శానిటైజ్‌ చేయాలి. క్రిమినాశక ద్రావణాలతో శుభ్రపరచాలి. అదే విధంగా ప్రయాణికులకు సబ్బులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి.

 >ప్రయాణం ముగించుకుని బయటకు వెళ్లే సమయంలోనూ ప్రయాణికులను థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయాలి.

>కరోనా లక్షణాలు కనిపించిన ప్రయాణికులను దగ్గర్లో ఐసోలేషన్‌ సౌకర్యం ఉన్న ఆస్పత్రికి తరలించాలి. ప్రయాణికుడి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలి.

>తీవ్ర కరోనా లక్షణాలు ఉన్నవారిని కొవిడ్‌-19 చికిత్స కేంద్రాలకు తరలించాలి.

>కరోనా లక్షణాలు స్వల్పంగా ఉంటే వారిని హోం క్వారంటైన్‌కు లేదా ఐసోలేటెడ్‌ కొవిడ్‌-19 వార్డుకు తరలించాలి. ఇది వారి ఎంపికను బట్టి ఉంటుంది. ఐసీఎంఆర్‌ ప్రామాణికాల ఆధారంగా ఇవి ఉండాలి.

>ఐసోలేటెడ్‌ వార్డుకు తరలించిన తర్వాత ఎవరికైనా నెగిటివ్‌ వస్తే అలాంటి వారిని వారం రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచిన తర్వాత పంపాలి. ఆ తర్వాత కూడా మరో వారం హోం క్వారంటైన్‌ విధిగా పాటించేలా జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వాలి.


విదేశాల నుంచి వచ్చే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ప్రయాణ తేదీ నుంచి 14రోజులు క్వారంటైన్‌లో తప్పనిసరిగా ఉండాలి. ఇందులో ఏడు రోజుల పాటు సొంత ఖర్చులతో ఇనిస్టిట్యూషనల్‌  క్వారంటైన్‌లో ఉండాలి. ఆ తర్వాత మరో ఏడు రోజుల పాటు స్వీయ పర్యవేక్షణలో హోం క్వారంటైన్‌లో ఉండాలి.

తీవ్ర ఒత్తిడికి గురయ్యే వారు, గర్భిణిలు, కుటుంబంలో మరణం సంభవించిన వారు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు, 10 సంవత్సరాలలోపు వయసు కలిగిన చిన్నారులు, వారి తల్లిదండ్రులకు నిర్దేశిత క్వారంటైన్‌ నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే వీరు తప్పనిసరిగా 14రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి.

ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా ఆరోగ్యసేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

ఎటువంటి కరోనా లక్షణాలు లేని వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు.

> రోడ్డు మార్గాన దేశంలోకి ప్రవేశించే ప్రయాణీకులు కూడా అన్ని ప్రోటోకాల్‌ నిబంధనలు అనుసరించాల్సిందే. ఎటువంటి లక్షణాలు లేని వారు మాత్రమే సరిహద్దు ద్వారా భారతదేశంలోకి వచ్చేందుకు అనుమతిస్తారు.

> విమానంలో, ఓడలో వచ్చే వారు.. స్వీయ-డిక్లరేషన్ ఫారం నింపాలి. దాని ప్రతిని విమానాశ్రయం,  ఓడరేవుల్లోని ఇన్‌యాడ్‌పోర్ట్ వద్ద ఉన్న ఆరోగ్య, ఇమ్మిగ్రేషన్ అధికారులకు అందించాలి.

విమానాలు, విమానాశ్రయాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలి.

బోర్డింగ్‌ సమయంలో ప్రయాణికులు వ్యక్తిగత దూరం పాటించాలి.

ప్రయాణ సమయంలో విధిగా మాస్క్‌ ధరించాలి. చేతులు శుభ్రంగా ఉండేలా హ్యాండ్‌ శానిటైజర్లు వాడాలి

ఆరోగ్య, ఇమిగ్రేషన్‌ అధికారులు చేసే థర్మల్‌ స్క్రీనింగ్‌కు అందరూ సహకరించాలి.

కరోనా లక్షణాలు ఉన్నవారిని ఐసోలేషన్‌కు తరలించడంతో పాటు, మిగిలిన ప్రయాణికులకు క్వారంటైన్‌ వసతిని ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కల్పించాలి.

ప్రతి ప్రయాణికుడిని ఐసీఎంఆర్‌ ప్రమాణాల ప్రకారం పరీక్షించాలి.

ఐసోలేటెడ్‌ వార్డుకు తరలించిన తర్వాత ఎవరికైనా నెగిటివ్‌ వస్తే అలాంటి వారిని వారం రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచిన తర్వాత పంపాలి. ఆ తర్వాత కూడా మరో వారం హోం క్వారంటైన్‌ విధిగా పాటించేలా జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వాలి.
> సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్న కాలంలో, ఆ తరువాత అయినా..  ఏదైనా లక్షణాలు ఉంటే..  వారు జిల్లా నిఘా అధికారికి లేదా రాష్ట్ర లేదా జాతీయ కాల్ సెంటర్‌కు 1075 తెలియజేయాలి.

కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల పీడీఎఫ్‌ కోసం క్లిక్‌ చేయండి..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని