అక్కడ ఇంటికో సొంత విమానం!
ఈ మధ్య కాలంలో గేటెట్ కమ్యూనిటీ ఇళ్లు పెరిగిపోయాయి. అక్కడ ఒకేలా ఉండే వందలాది ఇళ్లు. ఇంటికో కారు, కారు కోసం గ్యారేజీ తప్పనిసరిగా ఉంటాయి. కానీ, ప్రపంచవ్యాప్తంగా కొన్ని చిత్రమైన గేటెడ్ కమ్యూనిటీ ఇళ్లు ఉన్నాయి. అక్కడ ఇంటికో కారుతోపాటు విమానం కూడా ఉంటుంది. ఆ విమానాలు
ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్య కాలంలో గేటెడ్ కమ్యూనిటీ ఇళ్లు పెరిగిపోయాయి. ఒకేలా ఉండే వందలాది ఇళ్లు. ఇంటికో కారు, కారు కోసం గ్యారేజీ తప్పనిసరిగా ఉంటాయి. కానీ, ప్రపంచవ్యాప్తంగా కొన్ని చిత్రమైన గేటెడ్ కమ్యూనిటీ ఇళ్లు ఉన్నాయి. అక్కడ ఇంటికో కారుతోపాటు విమానం కూడా ఉంటుంది. ఆ విమానాలు పార్క్ చేయడానికి ప్రతి ఇంటికి భారీ గ్యారేజీలు కనిపిస్తుంటాయి. స్థానికులు ఎక్కడికి వెళ్లాలన్నా సొంత విమానంలోనే వెళ్లి వస్తుంటారట. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఈ కమ్యూనిటీ ఇళ్లను ఎయిర్పార్క్ అని పిలుస్తుంటారు. ప్రపంచంలో ఇలాంటి ఎయిర్పార్క్లు దాదాపు 650 ఉంటాయని అంచనా.
వాటిలో చెప్పుకోదగ్గ ఎయిర్పార్క్.. యూఎస్లోని కాలిఫోర్నియాలో ఉన్న కామెరాన్ పార్క్. తాజాగా ఇక్కడి ఇళ్లను అమ్మకానికి పెట్టడంతో మరోసారి ఎయిర్పార్క్లు వార్తల్లోకెక్కాయి. ఒకప్పుడు ఈ కామెరాన్ పార్క్ ప్రాంతంలో ఎయిర్పోర్టు నిర్మించారు. అయితే, దీన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడానికి అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. దీంతో ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పక్కనపెట్టేసింది. ఆ తర్వాత 61 ఎకరాల ఈ ఎయిర్పోర్టు చుట్టూ ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. పైలట్లు, విమానం నడిపించాలనే ఆసక్తి ఉన్నవాళ్లు, సంపన్నులు ఆ ఇళ్లను కొనుగోలు చేశారు. దాదాపు వంద ఇళ్లు ఉన్న ఈ ప్రాంతంలో జనరల్ ఏవియేషన్కు అనుమతి ఉండటంతో చిన్నపాటి విమానాలను సొంతగా నడిపించుకునే అవకాశం ఉంది. అలా పైలట్లు, డబ్బులున్న వాళ్లంతా చిన్న విమానాలను కొనుగోలు చేశారు. వాటిని పార్క్ చేసుకునేలా ఇంటికి ఆనుకొని భారీ గ్యారేజీలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి ఇంటి నుంచి ప్రధాన రన్వేకి వెళ్లడానికి చిన్న చిన్న రన్వేలు.. విమానాలు ఢీ కొట్టుకోకుండా 100 అడుగుల వెడల్పుతో రోడ్లు ఉన్నాయి. ఇక్కడి 98శాతం విమానాలను కుటుంబాలు వ్యక్తిగతంగా ఉపయోగిస్తుండగా.. 2 శాతం విమానాలు ట్యాక్సీ సేవలు అందిస్తున్నాయి. విమానం ల్యాండింగ్ చేసుకోవడానికి వీలుండే ఏ చోటుకైనా గాల్లో ప్రయాణిస్తూ వెళ్లిపోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.