Anand Mahindra: ఆయన వచ్చేలోపు ఊరొదిలి వెళ్లటం మంచిదేమో: ఆనంద్‌ మహీంద్రా

‘అజయ్‌ దేవ్‌గణ్‌ వచ్చేలోపు నేను ఊరొదిలి వెళ్లటం మంచిదనిపిస్తుంది’ అని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా సరదా ట్వీట్‌ చేశారు.

Published : 16 Feb 2022 01:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘అజయ్‌ దేవ్‌గణ్‌ వచ్చేలోపు నేను ఊరొదిలి వెళ్లటం మంచిదనిపిస్తుంది’ అని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా సరదా ట్వీట్‌ చేశారు. నెట్టింట సందడి చేశారు. ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటారో చాలామందికి తెలిసిన విషయమే. ప్రేరణ కలిగించే, ఆలోచన రేకెత్తించే పోస్టులు పెడుతూ, సమకాలీన అంశాలపై సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తుంటారు. అప్పుడప్పుడూ ఫన్నీ వీడియోలు షేర్‌ చేస్తుంటారు. అలా ఆయన పంచుకున్న అజయ్‌ దేవ్‌గణ్‌ యాడ్‌ షూట్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ వీడియోలో ఏముందంటే.. మహీంద్రా గ్రూప్‌నకు చెందిన ట్రక్‌, బస్‌ వాణిజ్య ప్రకటనలో నటించేందుకు అజయ్‌ సిద్ధమవుతారు. షూటింగ్‌ సంబంధించిన స్క్రిప్టులో కొన్ని మార్పులు కనిపించటంతో ఎన్ని సార్లు మారుస్తారని అజయ్‌ కాస్త సీరియస్‌ అవుతారు. ‘నాలుగు సార్లు మాత్రమే మార్చాం సర్‌’ అనే సమాధానంతో ఆయన అసహనానికి గురవుతారు. మహీంద్రా ట్రక్‌ అండ్‌ బస్‌ సంస్థ ట్వీట్‌ చేసిన ఈ వీడియోను ఆనంద్‌ మహీంద్రా షేర్‌ చేస్తూ ‘‘అజయ్‌ దేవ్‌గణ్‌ చిరాకుగా ఉన్నారనే సమాచారం అందింది. ఆయన వచ్చేలోపు నేను ఊరొదిలి వెళ్లటం మంచిదనిపిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. ఆనంద్‌ మహీంద్రా టైమింగ్‌, ఆయన ప్రచారం చేసే విధానాన్ని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని