Al-Qaeda: అమెరికాపై మళ్లీ అల్ఖైదా పడగ..!
ఉగ్రముప్పును నిర్మూలించడం ద్వారా అఫ్గానిస్థాన్లో తమ లక్ష్యం నెరవేరిందని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించినప్పటికీ ఇది నూరు శాతం నిజం కాదనే వాదనలు వినిపిస్తూనే
ఇంటర్నెట్డెస్క్: ఉగ్రముప్పును నిర్మూలించడం ద్వారా అఫ్గానిస్థాన్లో తమ లక్ష్యం నెరవేరిందని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించినప్పటికీ ఇది నూరు శాతం నిజం కాదనే వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఆ దేశ నిఘా సంస్థ కూడా ఇదే విషయాన్ని తెలిపింది. అల్ఖైదాతో అమెరికాకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. తాలిబన్ల సంరక్షణలో అఫ్గాన్ గడ్డపై అల్ఖైదా తమను తాము పునర్ నిర్మించుకునే అవకాశం ఉందని, రానున్న ఒకటి రెండేళ్లలో అమెరికా భూభాగంపై దాడులు చేసే ప్రమాదం కూడా ఉందని అమెరికా నిఘా సంస్థ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఈ మేరకు బ్లూమ్బర్గ్ కథనం వెల్లడించింది.
‘‘అఫ్గానిస్థాన్లో వనరులను సమకూర్చుకునేందుకు అల్ఖైదా అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి, రెండేళ్లలో ఆ ముఠా మళ్లీ క్రియాశీలకంగా మారి అమెరికాను బెదిరించే స్థాయికి చేరే అవకాశముంది’’ అని సదరు అధికారి చెప్పినట్లు బ్లూమ్బర్గ్ పేర్కొంది. అటు సీఐఏ డిప్యూటీ డైరెక్టర్ డేవిడ్ కోహెన్ కూడా ఈ విషయాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అఫ్గాన్ భూభాగంలో అల్ఖైదా కార్యక్రమాలు ప్రారంభించిందని కోహెన్ తెలిపారు. అయితే నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అవ్రిల్ హేయిన్స్ మాత్రం భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ‘‘అమెరికాకు ముప్పు పొంచి ఉన్న దేశాల జాబితాలో ప్రస్తుతానికి అఫ్గానిస్థాన్ లేదు. యెమెన్, సోమాలియా, సిరియా ఇరాక్ దేశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన అన్నారు.
ఏడాది కాలంగా చనిపోయాడనుకున్న అల్ఖైదా అగ్రనేత ఐమన్ అల్- జవహరీ ఇటీవల ఓ వీడియోలో ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. జిహాదీ బృందాల ఆన్లైన్ కార్యకలాపాలపై నిఘా పెట్టిన ‘సైట్’ అనే ఇంటెలిజెన్స్ గ్రూప్ గతవారం విడుదల చేసిన ఓ వీడియోలో జవహరీ పలు అంశాలపై మాట్లాడారు. 9/11 దాడుల స్మారకదినం రోజునే ఈ వీడియో బయటకు రావడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో తాజా హెచ్చరికలు మరింత ఆందోళన కలిగించేలా ఉన్నాయి.
2001 సెప్టెంబరు 11న అమెరికాపై అల్ఖైదా భీకర దాడి జరిపింది. ఈ దాడితో ప్రతీకారం పెంచుకున్న అగ్రరాజ్యం.. అల్ఖైదా ఉగ్రవాద సంస్థ సంబంధాలను నిర్మూలించడమే లక్ష్యంగా అఫ్గాన్ భూభాగంలో అడుగుపెట్టింది. అక్కడ తాలిబన్లను పడగొట్టి పౌర ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. 2011లో పాక్లో నక్కిన ఒసామా బిన్ లాడెన్ను మట్టుబెట్టింది. ఆ తర్వాత కూడా అఫ్గాన్లో అమెరికా దళాలు కొనసాగాయి.
అయితే 20ఏళ్ల సుదీర్ఘ విరామానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో తాలిబన్లతో అగ్రరాజ్యం శాంతి ఒప్పందం చేసుకుంది. ఈక్రమంలోనే అఫ్గాన్ భూభాగం నుంచి అమెరికా బలగాలు నిష్క్రమించాయి. దీన్ని అవకాశంగా తీసుకున్న తాలిబన్లు.. ఒక్కసారిగా పేట్రేగిపోయారు. పౌర ప్రభుత్వాన్ని పడగొట్టి దేశాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. దీంతో మరోసారి ఆ దేశం ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారే అవకాశముందని ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
సంక్షిప్త వార్తలు
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’