Delhi: బైక్ దొంగల వెనుక ఉగ్ర నెట్వర్క్.. ఆ టెర్రరిస్టులందరూ ఇంజినీర్లే..!
దిల్లీలో అరెస్టు చేసిన ఐసిస్ ఉగ్రవాది షానవాజ్ను తొలుత పోలీసులు ఓ బైక్ దొంగతనం యత్నంలో అరెస్టు చేశారు. ఆ విచారణ సమయంలో అతడి వెనుక ఉన్న భారీ ఉగ్ర నెట్వర్క్ బయటపడింది. అంతేకాదు.. మైనింగ్ ఇంజినీర్గా పేలుళ్లపై ఉన్న పరిజ్ఞానాన్ని జోడించి దేశ వ్యాప్తంగా బ్లాస్ట్లకు అతడు కుట్ర పన్నినట్లు అధికారులు చెబుతున్నారు.
ఇంటర్నెట్డెస్క్: దిల్లీ, ఉత్తర్ప్రదేశ్ల్లో నిన్న జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకొన్న ఐసిస్ ఉగ్రవాదులందరూ ఉన్నత విద్యావంతులే. ఈ విషయాన్ని దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సీనియర్ అధికారి హెచ్జీఎస్ దాలివాల్ వెల్లడించారు. వీరిలో కీలక నిందితుడైన షానవాజ్, అతడి అనుచరులు రిజ్వాన్ అష్రాఫ్, మొహమ్మద్ అర్షద్ వార్సి ఇప్పటికే దేశవ్యాప్తంగా రెక్కీలు నిర్వహించినట్లు కూడా వెల్లడించారు.
మైనింగ్ రంగంలో అనుభవంతో ఉగ్రవాదం..
ప్రధాన నిందితుడు షానవాజ్ ఝార్ఖండ్లోని హజారీబాగ్ ప్రాంతానికి చెందినవాడు. అతడు మైనింగ్లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఇంజినీరింగ్ బ్లాస్ట్లపై అతడికి మంచి అనుభవం ఉంది. అతడు మతాంతర వివాహాం చేసుకొన్నాడు. ప్రస్తుతం అతడి భార్య కూడా పరారీలో ఉంది.
ఈ కేసులో మరో నిందితుడు మహమ్మద్ అర్షద్ వార్సి కూడా ఝార్ఖండ్కు చెందిన వాడే. ఇతడు అలీగఢ్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. ప్రస్తుతం దిల్లీలోని జామియా మిలియాలో పీహెచ్డీ చేస్తున్నాడు.
మూడో నిందితుడైన రిజ్వాన్ కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేశాడు. ఇతడిది ఉత్తరప్రదేశ్లోని ఆజమ్గఢ్. ఇతడు మతగురువుగా శిక్షణ పొందాడు. ఈ అరెస్టులపై దిల్లీ పోలీసుశాఖకు చెందిన దాలివాల్ మాట్లాడుతూ.. ‘‘దేశవ్యాప్తంగా పాపులర్ వ్యక్తులను చంపేలా, అత్యధిక మంది మరణించేలా పేలుళ్లు జరపాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఐసిస్ మాడ్యుల్ను ఛేదించేందుకు ప్రస్తుత దాడులు జరుగుతున్నాయి’’ అని వెల్లడించారు.
నిత్యం ఐసిస్ హ్యండ్లర్తో టచ్లో..
నిన్న అరెస్టు చేసిన నిందితుల వద్ద నుంచి ఓ తుపాకీని కూడా స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు. షానవాజ్ దిల్లీ స్థావరం నుంచి జిహాద్కు సంబంధించిన పుస్తకాలు, రసాయనాలు వంటివి స్వాధీనం చేసుకొన్నామన్నారు. ఇతడు విదేశాల్లోని తన ఐసిస్ హ్యాండ్లర్కు నిత్యం సమాచారం పంపేవాడని పోలీసులు చెప్పారు.
బైక్ దొంగతనానికి యత్నించి దొరికిపోయి..
షానవాజ్ను పోలీసులు తొలిసారి నాటకీయ ఫక్కీలో పట్టుకొన్నారు. అతడు మహమ్మద్ ఇమ్రాన్ మహమ్మద్ యూనిస్, మహమ్మద్ యాకూబ్ షేక్ అనే మరో ఇద్దరితో కలిసి పుణేలో ఓ బైక్ దొంగతనానికి యత్నించాడు. ఈ కేసులో అక్కడి పోలీసులు జులైలో వారిని అరెస్టు చేశారు. అనంతరం పోలీసులు వారి ఇళ్లల్లో సోదాలు చేసేందుకు నిందితులను తీసుకెళ్లిన సమయంలో షానవాజ్ పోలీస్ వ్యాన్ దూకి పారిపోయాడు. ఆ సమయంలో వీరి ఇళ్ల నుంచి బాంబుల తయారీకి వాడే పదార్థాలు, బ్యాటరీలు, టైమర్లు, బల్బులు, షోల్డరింగ్ గన్లు స్వాధీనం చేసుకొన్నారు. ఈ వ్యవహారం చూసి పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమైపోయారు. విచారణలో యూనిస్, యాకూబ్ మధ్యప్రదేశ్కు చెందినవారిగా తెలిసింది. మార్చిలో రాజస్థాన్లో దొరికిన కారుబాంబు కేసులో వీరి హస్తం ఉన్నట్లు గుర్తించారు.
కెనడాకు భారత్ అల్టిమేటం.. అక్టోబరు 10లోగా దౌత్యసిబ్బందిని తగ్గించుకోవాలని డెడ్లైన్..!
షానవాజ్ బోప్తాఘాట్ అనే ప్రదేశంలో యాసిడ్ దాచినట్లు గుర్తించి.. పోలీసులు అక్కడ దాడులు నిర్వహించారు. వీరికి మరోసారి భారీగా రసాయనాలు దొరికాయి. దీంతోపాటు దాదాపు 500 జీబీ డేటాను కూడా స్వాధీనం చేసుకొన్నారు. వీటిల్లో బాంబుల తయారీ వీడియోలు, దేశంలోని వివిధ ప్రాంతాల ఫొటోలు ఉన్నాయి. షానవాజ్ ఇప్పటికే కొల్హాపుర్, సంగ్లీ, సతారా ప్రాంతాలకు బృందాలను పంపించి రెక్కీలు నిర్వహించినట్లు తేలింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదవీ విరమణ వయసులో.. సెక్యూరిటీ గార్డు డబుల్ పీజీ
రాజ్కరణ్ బారువా (56).. మధ్యప్రదేశ్లోని జబల్పుర్ నగరంలో రూ.5 వేల జీతానికి రాత్రంతా సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తూ, పగలు ఇళ్లలోనూ పనిచేస్తారీయన. ఇలా చాలామంది చేస్తూ ఉండవచ్చు. -
కార్మికుల మనోధైర్యానికి జాతి వందనం
ఉత్తరాఖండ్లోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకొని దాదాపు 17 రోజుల తర్వాత మంగళవారం సాయంత్రం విజయవంతంగా బయటపడిన 41 మంది కార్మికుల మనోధైర్యానికి జాతి వందనాలు సమర్పిస్తోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. -
పేదలకు అండగా ట్రాన్స్జెండర్
పేద కుటుంబాల అమ్మాయిలకు వివాహం చేయడానికి వారి తల్లిదండ్రులు పడే ఇబ్బందులు అన్నిఇన్నీ కావు. అలాంటి వారి బాధను అర్థం చేసుకున్నారు రాజస్థాన్కు చెందిన ఓ ట్రాన్స్జెండర్. ఏటా 10 మంది పేద కుటుంబాల అమ్మాయిలకు వివాహం చేస్తూ తన గొప్ప మనసు చాటుకుంటున్నారు. -
కేజ్రీవాల్కు గోవా కోర్టు సమన్లు
ఆప్ జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గోవా కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలపై మపూసా ఫస్ట్క్లాస్ జుడీషియల్ మేజిస్ట్రేట్ జారీచేసిన ఈ సమన్లలో బుధవారం కోర్టు ముందు హాజరు కావలసిందిగా పేర్కొన్నారు. -
శీతాకాల సమావేశాల వేళ.. రాహుల్ మళ్లీ విదేశాలకు
పార్లమెంటు శీతాకాల సమావేశాలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ గైర్హాజరు కానున్నట్టు సమాచారం. ఈ సమయంలో ఆయన విదేశీ పర్యటనకు వెళుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. -
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు దిల్లీలో ఓటరు కార్డు
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మారిన చిరునామాతో కొత్త ఓటరు కార్డును మంగళవారం అందుకున్నారు. దిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి పి.కృష్ణమూర్తి రాష్ట్రపతిభవన్లో ముర్మును కలిసిఈ కార్డును అందజేశారు. -
సీజేఐ కోర్టులో విదేశాల ప్రధాన న్యాయమూర్తులు
సుప్రీంకోర్టులో మంగళవారం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం భేటీ అయిన కోర్టుకు ఐవరీ కోస్ట్, దక్షిణ సూడాన్, ఘనా, కిర్గిజ్స్థాన్, ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్, కామెరూన్, బోట్స్వానా దేశాల ప్రధాన న్యాయమూర్తులు విచ్చేశారు. -
ఆంగ్ల భాష, అధిక ఫీజులే సమ న్యాయానికి అడ్డంకి
అత్యున్నత న్యాయ వ్యవస్థలో అధిక ఫీజులు, ఆంగ్ల భాషే సమ న్యాయానికి అడ్డంకిగా నిలుస్తున్నాయని, వాటిని అధిగమించాల్సి ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పష్టం చేశారు. -
నేవీకి మరో స్వదేశీ విమానవాహక నౌక!
హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో భారత నౌకాదళానికి సరికొత్త బలం లభించబోతోంది. స్వదేశీ పరిజ్ఞానంతో రెండో విమానవాహక నౌకను నిర్మించాలన్న నేవీ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించబోతోంది. -
2024 చివర్లోగా ఐఎస్ఎస్లోకి భారత వ్యోమగామి
అంతరిక్ష కేంద్ర నిర్మాణంలో భారత్కు సాయం చేయడానికి తాము సిద్ధమని అమెరికా రోదసి సంస్థ-నాసా అధిపతి బిల్ నెల్సన్ తెలిపారు. మన దేశంలో పర్యటిస్తున్న ఆయన మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. -
భర్త వ్యక్తిగత వివరాలు భార్యకు చెప్పాల్సిన అవసరం లేదు
భర్త వ్యక్తిగత వివరాలు భార్యకు తెలపాల్సిన అవసరం లేదని కర్ణాటక హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. వివాహ బంధంలో కొనసాగుతున్నా, విడిపోయినా భాగస్వామి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేందుకు అవకాశం లేదని జస్టిస్ ఎస్.సునీల్దత్ యాదవ్, జస్టిస్ విజయకుమార్ ఏ పాటిల్లతో కూడిన ధర్మాసనం తేల్చిచెప్పింది. -
మృత్యుంజయులు
-
నిషేధించిన పనే ఆదుకుంది
ర్యాట్ హోల్ మైనింగ్.. ఉత్తర్కాశీ సొరంగ ప్రమాద ఉదంతంతో రెండ్రోజులుగా ప్రాచుర్యంలోకి వచ్చిన పని ఇది. ఇంతవరకు ఈశాన్య రాష్ట్రాలకు, ప్రధానంగా మేఘాలయకు పరిమితమైన ఈ ప్రక్రియే చార్ధామ్ రహదారి పనుల్లో భాగంగా చిక్కుకుపోయిన కూలీలను బయటకు తెచ్చేందుకు ఉపయోగపడింది. -
Rat hole Miners: ‘మమల్ని గట్టిగా కౌగిలించుకున్నారు.. ఇలాంటిది జీవితంలో ఒకేసారి వస్తుంది’
సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసుకురావడంపై ర్యాట్ హోల్ మైనర్లు జాతీయ మీడియాతో మాట్లాడారు.


తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి తుపాను ముప్పు.. డిసెంబరు తొలి వారంలో అతి భారీ వర్షాలు!
-
Cyber Attack: అమెరికా ఆస్పత్రులపై సైబర్ దాడి.. నిలిచిపోయిన వైద్య సేవలు
-
Rishab Shetty: అది చాలా బాధాకరం: ఓటీటీ సంస్థలపై రిషబ్ శెట్టి
-
Salaar: అందుకు వారికి సారీ.. ‘సలార్’ రూమర్స్పై ప్రశాంత్ నీల్ క్లారిటీ
-
Crime News: కాల్పులకు తెగబడినా.. చీపురు కర్రతో తరిమికొట్టిన మహిళ..!
-
Social Look: చీరలో మాళవిక హొయలు.. జాక్వెలిన్ ట్రిప్