Vijay Diwas: పాక్కు చివరికి అవమానమే మిగిలింది..!
ఎక్కడైనా ప్రతి దేశానికి ఓ సైన్యం ఉంటుంది.. కానీ, పాకిస్థాన్లో సైన్యానికి ఒక దేశం ఉందనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నానుడు. ఇక్కడ ఆర్మీచీఫ్కు ప్రధాని అంటే అసలు లెక్కే ఉండదు. కొన్ని దశాబ్దాలుగా అక్కడ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రజాస్వామ్య దేశాలు వెలివేస్తాయనే
అప్పటి పాక్ ప్రధాని నవాజ్కి తెలియకుండా ముషరఫ్ నిర్ణయ ఫలితం
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
ఎక్కడైనా ప్రతి దేశానికి ఓ సైన్యం ఉంటుంది.. కానీ, పాకిస్థాన్లో సైన్యానికి ఒక దేశం ఉందనేది ప్రపంచ వ్యాప్తంగా తెలిసిందే. ఇక్కడ ఆర్మీచీఫ్కు ప్రధాని అంటే అస్సలు లెక్కే ఉండదు. కొన్ని దశాబ్దాలుగా అక్కడ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రజాస్వామ్య దేశాలు వెలివేస్తాయనే భయంతో అక్కడి సైన్యం ఒక కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నడిపించడం ఆనవాయితీ. కార్గిల్ యుద్ధ విషయంలో ఈ అంశం మరోసారి రుజువైంది. ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్కు తెలియకుండా ఆర్మీచీఫ్ ఈ వ్యవహారం నడిపించారు. సైన్యాన్ని పురమాయించి భారత భూభాగాలను ఆక్రమించారు. విషయం తెలుసుకొన్న భారత్ భీకర దాడి చేయడంతో తోకముడిచారు. చివరికి పాక్కు పుట్టెడు అవమానం మిగిల్చారు.
* 22 ఏళ్ల క్రితం పాక్ సైన్యం అక్రమించుకున్న జమ్ము కశ్మీర్లోని కార్గిల్ జిల్లాలోని పర్వత శిఖరాలను భారత్ సైన్యం పూర్తిగా స్వాధీనం చేసుకున్న రోజుకు గుర్తుగా జులై 26న ‘విజయ్ దివస్’ జరుపుకొంటాం. ఈ యుద్ధం భారత సైన్యం తీరుతెన్నులను మార్చేసింది. 1999 మే నుంచి జులై వరకూ ఇది జరిగింది.
* అప్పటి పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్కు తెలియకుండానే ఆ దేశ ఆర్మీ జనరల్ పర్వేజ్ ముషరఫ్ కార్గిల్ ఆక్రమణకు ప్రణాళిక రచించి అమలు చేశాడు. పాక్ ఉగ్రవాదులతో కలిసి ఆ దేశ సైన్యం భారత భూభాగంలోకి ప్రవేశించింది. వారంతా యుద్ధ సమయంలో అనుకూలంగా ఉండేలా ఎత్తైన పర్వత శిఖరాలపై బంకర్లు నిర్మించుకొని తిష్ఠవేశారు.
* గొర్రెల కాపర్లు ఇచ్చిన సమాచారంతో భారత సైన్యం అప్రమత్తమై ‘ఆపరేషన్ విజయ్’ పేరుతో సైనిక చర్యను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ పేరుతోనే ‘విజయ్ దివస్’(దినోత్సవం)ను జరుపుకొంటాం.
* శిఖరాలను ఖాళీ చేయించడానికి మన సైన్యం భీకర యుద్ధమే చేయాల్సి వచ్చింది. శత్రువులు ఎత్తైన పర్వత శిఖరాల్లో ఉండటంతో భారత్ దళాలు వారిపై గురిపెట్టడం కష్టమైంది. ఈ యుద్ధంలో భారత్ రెండు ఫైటర్జెట్ విమానాలను కూడా కోల్పోయింది. కానీ, ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.
* భారత వాయుసేన నియంత్రణ రేఖను దాటకుండా దాడులు చేసేందుకు మే25వ తేదీన వాజ్పేయి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వాయుసేన సరిహద్దులు దాటేందుకు అనుమతి కోరినా.. ప్రధాని అంగీకరించలేదని నాటి వాయుసేన చీఫ్ వై టిప్నిస్ తెలిపారు. పూర్తి స్థాయి యుద్ధానికి భారత్ కవ్వించిందనే చెడ్డపేరు వస్తుందని ప్రభుత్వం భావించింది.
* వాయుసేన ఆపరేషన్ ‘సఫేద్ సాగర్’ను మే26వ తేదీన ప్రారంభించి సైన్యానికి అండగా నిలిచింది. మిగ్ 21,23,25, 27,29, మిరాజ్ -2000, జాగ్వార్ విమానాలు దీనిలో పాల్గొన్నాయి. ఎంఐ-17 హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగాయి.
* అత్యంత తక్కువ వ్యవధిలో 18,000 అడుగుల ఎత్తున ఆపరేషన్ సఫేద్ సాగర్ను నిర్వహించారు.
* భారత అత్యుత్తమ స్క్వాడ్రన్గా పేరున్న ‘గోల్డెన్ యారోస్’ పైలట్లు మిగ్-21 విమానాలతో శత్రు బంకర్లను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో వీరికి రివాల్వర్లు, పాకిస్థాన్ కరెన్సీని కూడా సైన్యం సమకూర్చింది. ప్రమాదవశాత్తు శత్రుభూభాగంలో దిగినా సురక్షితంగా వచ్చేందుకే ఈ ఏర్పాట్లు. ఇప్పుడు భారత్ కొనుగోలు చేసిన రఫేల్ విమానాలను తొలుత ఈ స్క్వాడ్రన్కే కేటాయించారు.
* పాక్ వాయుసేన తమ సైన్యానికి సహకారం అందించేందుకు నిరాకరించింది. ఒక దశలో ఎఫ్-16 కాంబాక్ట్ పెట్రోలింగ్ నిర్వహించాలని ప్రయత్నించినా.. భారత్ మిగ్ 29లు వాటిని తరిమికొట్టాయి.
* ఈ క్రమంలో అమెరికా జోక్యం చేసుకోవాలని పాకిస్థాన్ అభ్యర్థించింది. కానీ, పాక్ దళాలు ఆ శిఖరాలను ఖాళీ చేసేవరకూ తాము ఏమీ చేయలేమని నాటి బిల్క్లింటన్ సర్కారు తేల్చిచెప్పింది. మరోపక్క భారత్ భీకరమైన దాడులు చేస్తుండటంతో పాక్ దళాలు తోకముడిచాయి. చివరికి కీలక శిఖరాన్ని జులై 26న భారత్ స్వాధీనం చేసుకొంది.
* ఈ సైనిక చర్యలో పాక్ సైన్యంతో పాటు భారత దళాలు కూడా భారీ నష్టాన్ని చవిచూశాయి. భారత్ వైపు 527 యోధులు ప్రాణాలు కోల్పోగా.. పాక్ వైపు అత్యధికంగా 400 నుంచి 4,000 మంది మరణించి ఉంటారని అంచనా. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ లెక్కలు మాత్రం పాక్వైపు 700 మంది మరణించినట్లు చెబుతున్నాయి. పాకిస్థాన్ తమ సైనికుల మృతదేహాలకు కనీస మర్యాద కూడా ఇవ్వలేదు. వాటిని స్వీకరించేందుకు అంగీకరించకపోతే.. భారత్ సగౌరవంగా వాటికి అంత్యక్రియలు నిర్వహించింది. శత్రువు అయినా సరే.. ఒక సైనికుడికి భారత్ ఇచ్చిన గౌరవం అది.
* ఈ యుద్ధంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి, త్యాగాలు చేసిన గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్, లెఫ్టినెంట్ మనోజ్కుమార్ పాండే, కెప్టెన్ విక్రమ్ బాత్రా, రైఫిల్మన్ సంజయ్ కుమార్, కెప్టెన్ అంజూ నాయర్, మేజర్ రాజేష్సింగ్ అధికారి, కెప్టెన్ హనీఫ్ ఉద్దీన్, మేజర్ మరియప్పన్ శరవణన్,హవాల్దార్ చూని లాల్ను పురస్కారాలతో భారత ప్రభుత్వం గౌరవించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది. -
నేపాల్ మేయర్ కుమార్తె ఆచూకీ లభ్యం
గోవాలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన నేపాల్లోని ధన్గఢీ నగర మేయర్ కుమార్తె ఆర్తీ హమాల్(36) ఆచూకీ బుధవారం లభ్యమైంది. -
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు తన వద్ద లేవని.. అందుకే పార్టీ ప్రతిపాదనను తిరస్కరించానని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?