Plane: ఇంజిన్ కవర్ లేకుండా విమానం.. ముంబయి టు గుజరాత్
ఇంజిన్ కవర్ ఊడిపోయినా గుర్తించకుండా ఓ విమానం ముంబయి నుంచి గుజరాత్ వెళ్లింది. అయితే అదృష్టవశాత్తూ ఆ విమానం సురక్షితంగా ల్యాండ్ అవవడంతో 70
70 మంది ప్రయాణికులకు తప్పిన ప్రమాదం
ముంబయి: ఇంజిన్ కవర్ ఊడిపోయినా గుర్తించకుండా ఓ విమానం ముంబయి నుంచి గుజరాత్ వెళ్లింది. అయితే అదృష్టవశాత్తూ ఆ విమానం సురక్షితంగా ల్యాండ్ అవవడంతో 70 మంది ప్రయాణికులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే..
ముంబయి ఎయిర్పోర్టు నుంచి బుధవారం ఉదయం ఓ అలియన్స్ ఎయిర్ విమానం గుజరాత్లోని భుజ్ వెళ్లేందుకు రన్వేపై సిద్ధంగా ఉంది. ఆ సమయంలో విమానం ఇంజిన్ కౌల్(ఇంజిన్ను కప్పి ఉంచే భాగం) ఊడిపోయి రన్వేపై పడిపోయింది. దీన్ని గమనించకుండానే పైలట్ విమానాన్ని టేకాఫ్ చేశారని ముంబయి ఎయిర్పోర్టు వర్గాలు వెల్లడించాయి. అయితే భుజ్ ఎయిర్పోర్టులో ఈ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని పేర్కొన్నాయి. ఈ విమానంలో 70 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు.
ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) అధికారులు వెల్లడించారు. అయితే నిర్వహణలోపం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుని ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ‘‘సాధారణంగా మెయింటనెన్స్ సమయంలో నట్లు, బోట్లను సరిగ్గా బిగించకపోతే ఇలా ఇంజిన్ కవర్లు ఊడుతుంటాయి. విమానం టేకాఫ్ చేసేముందుకు ఇంజిన్ కౌల్ సరిగ్గా ఉందా లేదా అనేది సిబ్బంది కచ్చితంగా చూసుకోవాలి’’ అని విమానయాన నిపుణులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్