అంతర్జాతీయ ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు!

కరోనా స్ట్రెయిన్‌ వ్యాప్తి ఉద్ధృతి నేపథ్యంలో ప్రయాణికులపై ఆంక్షలను పొడిగించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. అమెరికాకు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు విమానం ఎక్కేముందు కచ్చితంగా కరోనా నెగటివ్‌ ధ్రువప్రతం చూపిస్తేనే అనుమతిచ్చే దిశగా

Updated : 13 Jan 2021 10:07 IST

వాషింగ్టన్: కరోనా స్ట్రెయిన్‌ వ్యాప్తి ఉద్ధృతి నేపథ్యంలో ప్రయాణికులపై ఆంక్షలను పొడిగించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. అమెరికాకు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు విమానం ఎక్కేముందు కచ్చితంగా కరోనా నెగటివ్‌ ధ్రువప్రతం చూపిస్తేనే అనుమతిచ్చే దిశగా చర్యలు చేపడుతోంది. ఈ మేరకు యూఎస్‌ సెంటర్‌ ఫర్‌ డీసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఉత్తర్వులు జారీ అయితే జనవరి 26 నుంచి ఈ నిబంధన అమల్లోకి రావచ్చని పేర్కొంటున్నారు. ఇప్పటికే సీడీసీ, ఇతర పరిపాలన అధికారులు దీనిపై కసరత్తు చేస్తున్నారు. 

యూకేలో కరోనా స్ట్రెయిన్‌ ఉద్ధృతి నేపథ్యంలో ఇప్పటికే అమెరికా ఆ దేశం నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు పెట్టింది. అయితే పలు దేశాల్లోనూ కరోనా కొత్త రకం వ్యాప్తి వెలుగుచూస్తుండడంతో అన్ని దేశాల ప్రయాణికులపై ఆంక్షలు పెట్టేందుకు సిద్ధమవుతోంది. సీడీసీ ఉత్తర్వులు అమల్లోకి వస్తే ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చే ప్రయాణికులతో పాటు, విదేశాలకు వెళ్లి అమెరికాకు రానున్న తమ సొంత పౌరులకు కూడా ఇది వర్తించనుంది.

ఇవీ చదవండి..

ట్రంప్‌ను తొలగించబోను: పెన్స్‌‌

చైనాపై విశ్వాసం తగ్గింది..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని