American Airlines: సాయం కోరినందుకు క్యాన్సర్ రోగిని విమానం నుంచి దించేసిన సిబ్బంది!
శస్త్ర చికిత్స కారణంగా శరీరం బలహీనంగా ఉండటంతో బ్యాగ్ క్యాబిన్లో పెట్టేందుకు సాయం చేయని ఎయిర్హోస్టెస్ను కోరిన ప్రయాణికురాలిని విమానం నుంచి దించేసిన ఘటన దిల్లీలో చోటు చేసుకుంది.
దిల్లీ: విమానాల్లో ప్రయాణికుల అసభ్య ప్రవర్తన, విమాన సిబ్బందికి, ప్రయాణికులకు మధ్య వాగ్వివాదం వంటి ఘటనలు ఇటీవల తరచూ వెలుగుచూస్తున్నాయి. తాజాగా సిబ్బంది సాయం కోరినందుకు మహిళా ప్రయాణికురాలిని విమానం నుంచి దింపేసిన ఘటన దిల్లీలో చోటుచేసుకుంది. జనవరి 30న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. మీనాక్షి సేన్గుప్తా అనే మహిళకు కొద్ది రోజుల క్రితం క్యాన్సర్ సంబంధిత శస్త్రచికిత్స జరిగింది. జనవరి 30న ఆమె దిల్లీ నుంచి న్యూయార్క్కు ప్రయాణించేందుకు అమెరికన్ ఎయిర్లైన్స్ (American Airlines) విమానం 293 లో టికెట్ బుక్ చేసుకున్నారు. శస్త్ర చికిత్స కారణంగా బలహీనంగా ఉన్న ఆమె వీల్ఛైర్ అసిస్టెంట్ ద్వారా విమానంలోకి వచ్చినట్లు తెలిపారు. తర్వాత తన వెంట తెచ్చుకున్న బ్యాగ్ను క్యాబిన్లో పెట్టాలని ఎయిర్హోస్టెస్ (Air Hostess) సాయం కోరగా అందుకు ఆమె తిరస్కరించి, విమానం నుంచి దిగిపోవాలని కోరినట్లు మీనాక్షి చెప్పారు. శరీరానికి సపోర్ట్గా ఉండే బెల్ట్ ధరించి ఉండటం వల్ల తాను బ్యాగ్ను పైకి ఎత్తలేకపోయానని, అందుకే విమాన సిబ్బంది సాయం కోరినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
‘‘ గ్రౌండ్ స్టాఫ్ నన్ను విమానంలో విడిచిపెట్టిన తర్వాత నా బ్యాగ్ను క్యాబిన్లో పెట్టేందుకు ఎయిర్హోస్టెస్ సాయం కోరాను. అది తన ఉద్యోగం కాదని ఆమె వెళ్లిపోయింది. నా ఆరోగ్య పరిస్థితి గురించి ఆమెకు వివరించినా సాయం చేసేందుకు సుముఖత చూపలేదు. దీంతో నా బ్యాగ్ను సీటు పక్కన ఉంచి కూర్చునున్నాను. కొద్దిసేపటి తర్వాత నా దగ్గరికి వచ్చిన ఆమె మీరు అసౌకర్యంగా భావిస్తుంటే విమానం నుంచి దిగిపొమ్మని అమర్యాదగా నాతో చెప్పింది. విమాన సిబ్బంది మొత్తం నేను దిగిపోవాలని కోరారు. దీంతో విమానం నుంచి దిగిపోయాను’’ అని మీనాక్షి దిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటన సంబంధించిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో విమాయాన సంస్థ, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ (MoCA), డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)ను కోరుతూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. మరోవైపు ఘటనపై స్పందించిన డీజీసీఏ నివేదిక సమర్పించాలని అమెరికన్ ఎయిర్లైన్స్ను కోరింది. ‘‘జనవరి 30 దిల్లీ-న్యూయార్క్ విమానంలో సిబ్బంది సూచనలు పాటించని కారణంగా ప్రయాణికురాలిని మా క్యాబిన్ సిబ్బంది విమానం నుంచి దించేశారు. మా కస్టమర్ రిలేషన్స్ సిబ్బంది సదరు ప్రయాణికురాలితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాం ’’అని అమెరికన్ ఎయిర్లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
4 వాంగ్మూలాలతో సీఎం అరెస్టా?
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని అణచివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. -
నిరంతర ప్రేరణ శక్తి.. స్వామి స్మరణానంద
రామకృష్ణమఠం, రామకృష్ణ మిషన్లకు 16వ అధిపతిగా ఉన్న స్వామి స్మరణానంద కన్నుమూత తనను నిర్ఘాంతపరిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లకు కుతంత్రాలు
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లు తీసుకువచ్చి, న్యాయస్థానాల ప్రతిష్ఠను మసకబార్చేందుకు ‘స్వార్థ ప్రయోజనాలతో కూడిన ఒక బృందం’ ప్రయత్నాలు చేస్తోందని 600 మందికిపైగా న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్కు ఉమ్మడిగా లేఖ రాశారు. -
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు