American Airlines: సాయం కోరినందుకు క్యాన్సర్ రోగిని విమానం నుంచి దించేసిన సిబ్బంది!
శస్త్ర చికిత్స కారణంగా శరీరం బలహీనంగా ఉండటంతో బ్యాగ్ క్యాబిన్లో పెట్టేందుకు సాయం చేయని ఎయిర్హోస్టెస్ను కోరిన ప్రయాణికురాలిని విమానం నుంచి దించేసిన ఘటన దిల్లీలో చోటు చేసుకుంది.
దిల్లీ: విమానాల్లో ప్రయాణికుల అసభ్య ప్రవర్తన, విమాన సిబ్బందికి, ప్రయాణికులకు మధ్య వాగ్వివాదం వంటి ఘటనలు ఇటీవల తరచూ వెలుగుచూస్తున్నాయి. తాజాగా సిబ్బంది సాయం కోరినందుకు మహిళా ప్రయాణికురాలిని విమానం నుంచి దింపేసిన ఘటన దిల్లీలో చోటుచేసుకుంది. జనవరి 30న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. మీనాక్షి సేన్గుప్తా అనే మహిళకు కొద్ది రోజుల క్రితం క్యాన్సర్ సంబంధిత శస్త్రచికిత్స జరిగింది. జనవరి 30న ఆమె దిల్లీ నుంచి న్యూయార్క్కు ప్రయాణించేందుకు అమెరికన్ ఎయిర్లైన్స్ (American Airlines) విమానం 293 లో టికెట్ బుక్ చేసుకున్నారు. శస్త్ర చికిత్స కారణంగా బలహీనంగా ఉన్న ఆమె వీల్ఛైర్ అసిస్టెంట్ ద్వారా విమానంలోకి వచ్చినట్లు తెలిపారు. తర్వాత తన వెంట తెచ్చుకున్న బ్యాగ్ను క్యాబిన్లో పెట్టాలని ఎయిర్హోస్టెస్ (Air Hostess) సాయం కోరగా అందుకు ఆమె తిరస్కరించి, విమానం నుంచి దిగిపోవాలని కోరినట్లు మీనాక్షి చెప్పారు. శరీరానికి సపోర్ట్గా ఉండే బెల్ట్ ధరించి ఉండటం వల్ల తాను బ్యాగ్ను పైకి ఎత్తలేకపోయానని, అందుకే విమాన సిబ్బంది సాయం కోరినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
‘‘ గ్రౌండ్ స్టాఫ్ నన్ను విమానంలో విడిచిపెట్టిన తర్వాత నా బ్యాగ్ను క్యాబిన్లో పెట్టేందుకు ఎయిర్హోస్టెస్ సాయం కోరాను. అది తన ఉద్యోగం కాదని ఆమె వెళ్లిపోయింది. నా ఆరోగ్య పరిస్థితి గురించి ఆమెకు వివరించినా సాయం చేసేందుకు సుముఖత చూపలేదు. దీంతో నా బ్యాగ్ను సీటు పక్కన ఉంచి కూర్చునున్నాను. కొద్దిసేపటి తర్వాత నా దగ్గరికి వచ్చిన ఆమె మీరు అసౌకర్యంగా భావిస్తుంటే విమానం నుంచి దిగిపొమ్మని అమర్యాదగా నాతో చెప్పింది. విమాన సిబ్బంది మొత్తం నేను దిగిపోవాలని కోరారు. దీంతో విమానం నుంచి దిగిపోయాను’’ అని మీనాక్షి దిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటన సంబంధించిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో విమాయాన సంస్థ, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ (MoCA), డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)ను కోరుతూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. మరోవైపు ఘటనపై స్పందించిన డీజీసీఏ నివేదిక సమర్పించాలని అమెరికన్ ఎయిర్లైన్స్ను కోరింది. ‘‘జనవరి 30 దిల్లీ-న్యూయార్క్ విమానంలో సిబ్బంది సూచనలు పాటించని కారణంగా ప్రయాణికురాలిని మా క్యాబిన్ సిబ్బంది విమానం నుంచి దించేశారు. మా కస్టమర్ రిలేషన్స్ సిబ్బంది సదరు ప్రయాణికురాలితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాం ’’అని అమెరికన్ ఎయిర్లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..