Amritpal Singh: అశ్లీల సందేశాలు.. పాక్ నుంచి ఆయుధాలు.. అమృత్పాల్ నేరాల చిట్టా..!
Amritpal Singh: అమృత్పాల్ కోసం వేట తీవ్రమైంది. అతడు పలువురు మహిళలతో సంబంధాలు పెట్టుకొన్నట్లు గుర్తించారు. మరోవైపు అతడి ఖలిస్థాన్ బ్లూప్రింట్ను ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి.
ఇంటర్నెట్డెస్క్: ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్పాల్ సింగ్(Amritpal Singh) కోసం పోలీసులు వేటను కొనసాగిస్తున్నారు. అలాగే అతడి గత చరిత్రను మొత్తం తవ్వితీస్తున్నారు. అతడి దేశ వ్యతిరేక అజెండాను కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు బట్టబయలు చేసేపనిలో ఉన్నాయి. తరచూ ఖలిస్థాన్ గురించి మాట్లాడే అమృత్పాల్(Amritpal Singh)కు చాలా మంది మహిళలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. వీటికి సంబంధించి మహిళలతో ఛాటింగ్లు, వాయిస్నోట్లు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే 12 వాయిస్ నోట్లు ఓ మీడియా సంస్థ చేతికి వచ్చాయి. వాటిల్లో మహిళలతో టైంపాస్ కోసం సంబంధాలు పెట్టుకొంటున్నట్లు అతడు చెబుతున్న మాటలు ఉన్నాయి. ఈ మహిళల్లో కొందరు వివాహితలు కూడా ఉన్నట్లు గుర్తించారు. అతడి ఇన్స్టాగ్రామ్ సందేశాల్లో ఓ మహిళను వివాహేతర సంబంధం గురించి అడుగుతున్నట్లు ఉంది. తాజాగా అమృత్పాల్ తన బైకును మరో వాహనంపై పెట్టి ప్రయాణిస్తున్న చిత్రాలను పోలీసులు గుర్తించారు. అతడి భార్య, తల్లిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
పాకిస్థాన్ నుంచి ఆయుధాలు..
అమృత్పాల్ పాకిస్థాన్ నుంచి ఆయుధాలు సేకరించే పనిలో ఉన్నాడని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఇంటెలిజెన్స్ అధికారి ఆంగ్లవార్తా సంస్థ ‘ఎన్డీటీవీ’కి వెల్లడించారు. దీంతోపాటు పంజాబ్లో కల్లోలం సృష్టించాలనే ప్రణాళికతో అతడు పనిచేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. అమృత్పాల్ సింగ్(Amritpal Singh) పాక్ ఐఎస్ఐ సాయంతో తెప్పించిన ఆయుధాలను డీఅడిక్షన్ సెంటర్లు, జల్పూర్ ఖేడా వద్ద కొన్ని ప్రార్థనా మందిరాల్లో భద్రపర్చినట్లు సమాచారం. దీంతోపాటు అక్రమ ఆయుధాల తరలింపు, తుపాకులను బహిరంగంగా ప్రదర్శించడం వంటి పనులు చేశాడు.
సేకరించిన సొమ్ముకు లెక్కాపత్రం లేదు..
‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ ఆధ్వర్యంలో ఖల్సా వాహీర్ వంటి కార్యక్రమం నిర్వహించి సేకరించిన మొత్తానికి అమృత్పాల్ వద్ద ఎటువంటి లెక్కాపత్రం లేదు. ఖలిస్థాన్ పేరిట సేకరించిన సొమ్మును దుర్వినియోగం చేస్తున్నాడని అధికారవర్గాలు చెప్పాయి. ఆ సొమ్ముతో ఖరీదైన వాహన కాన్వాయ్ల్లో తిరిగినట్లు వెల్లడించారు.
ఇతర రాష్ట్రాల వారిపై అసహనం పెంచడం..
పంజాబ్ సమాజాన్ని మతం ఆధారంగా విడదీయడం అమృత్పాల్(Amritpal Singh) అజెండాగా తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బిహార్ నుంచి పొట్టపోసుకొనే కూలీలపై స్థానికంగా వ్యతిరేకత పెంచేందుకు యత్నిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆనందర్పూర్ ఖల్సా ఫౌజీ సాయంతో ఇతర మతాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసి టెన్షన్లు పుట్టించాలన్నది అమృత్పాల్ ప్లాన్గా తెలుస్తోంది. దీంతోపాటు పంజాబ్ యువతలో తుపాకీ సంస్కృతిని పెంచేందుకు అమృత్పాల్ ప్రయత్నించాడు. దీనికి గురువుల బోధనలను వక్రీకరించేందుకు యత్నించాడు.
మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తం..
అమృత్పాల్ వేట ఇప్పుడు మహారాష్ట్రకు కూడా విస్తరించింది. తాజాగా నాందేడ్ పోలీసులు అప్రమత్తమైన వాహనాల రాకపోకలపై దృష్టిపెట్టారు. దీంతోపాటు మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసులు కూడా హైఅలర్ట్లో ఉన్నారు. ఇప్పటికే అమృత్పాల్కు సంబంధించిన ఏడు రకాల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వలకు చిక్కిన 30 కిలోల చేప