Amritpal Singh: భారత్పై అమృత్పాల్ విషకుట్ర ఇదీ..!
అమృత్పాల్ చరిత్ర మొత్తం భయానకంగా ఉంది. డ్రగ్ డీలర్లతో సంబంధాలు, డీఆడిక్షన్ కేంద్రాల్లో ప్రైవేటు సైన్యాలు, హంతకులతో సంబంధాలు బయటపడుతున్నాయి.
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
అతడి పేరు అమృత్పాల్ సింగ్(Amritpal Singh).. ఏడాది క్రితం వరకు అనామకుడు.. ఎవరో వెనుకుండి కథ నడిపినట్లు దాదాపు ఆరు నెలల్లో పాపులర్ అయ్యాడు. భారత్ నుంచి రాష్ట్రాన్ని విడదీయాలంటూ పాకిస్థాన్ భాషను మాట్లాడటం మొదలుపెట్టాడు. అందుబాటులో ఉన్న అవకాశాలను.. అమాయక ప్రజల భావోద్వేగాలను వాడుకొంటూ ప్రైవేటు సైన్యం ఏర్పాటుకు కుట్రపన్నాడు. అంతేకాదు.. సిక్కుల టాప్ సంస్థనే హైజాక్ చేయడానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేశాడు.
ఎస్జీపీసీపై కన్ను..
సిక్కుల అత్యున్నత సంస్థ శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ సిక్కులకు మినీ పార్లమెంట్ వంటిది. ఈ సంస్థ తాను అనుకొన్నట్లు సిక్కు చరిత్రను అన్వయించాలని అమృత్పాల్(Amritpal Singh) భావించాడు. అంతేకాదు తాను కోరుకొన్న అంశాలకే అది ప్రాధాన్యమిచ్చేలా చేయాలని చూశాడని సీనియర్ అధికారులు చెబుతున్నారు. అమృత్పాల్ మత ప్రచారం పేరిట సిక్కుల్లో తన హింసాత్మక భావజాలాన్ని వ్యాప్తి చేయడం మొదలుపెట్టాడు. గురుద్వారాల పవిత్రతను కూడా ఇతడు లెక్కచేయకుండా హింసాత్మకంగా వ్యవహరించాడు. అతడి అనుచరులు కపుర్తల, జలంధర్లలో రెండు గురుద్వారాలను కూడా ధ్వంసం చేశారు.
డ్రగ్స్ను అడ్డంపెట్టుకొని..
పంజాబ్లో మాదకద్రవ్యాల వినియోగం ఎక్కువ. దీనిని అడ్డంపెట్టుకొని అమృత్పాల్ సింగ్ ఆనంద్పూర్ ఖల్సా ఫోర్స్ పేరిట ప్రైవేటు సైన్యాన్ని సిద్ధం చేశాడు. మాదకద్రవ్యాల డీఅడిక్షన్ కోసం అతడు తన పూర్వీకుల గ్రామంలో ఓ కేంద్రం ఏర్పాటు చేశాడు. గత నెల అజ్నాలా పోలీస్స్టేషన్పై దాడి ఫుటేజీని చూస్తే ఈ డీఅడిక్షన్ కేంద్రంలోని చాలా మంది అందులో పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. తాము వ్యసనాల నుంచి విముక్తి కోసం అక్కడ చేరినట్లు వెల్లడించారు. చాలా మంది అమృత్పాల్ డేరాలో సభ్యులమని అంగీకరించారు.
అమృత్పాల్ గన్మెన్ తేజిందర్ సింగ్ గిల్ ఫోన్ నుంచి ఖన్నా పోలీసులు కీలక వీడియోలను స్వాధీనం చేసుకొన్నారు. దీనిలో ఏకేఎఫ్ బృంద సభ్యులకు తుపాకుల వినియోగంపై శిక్షణ ఇస్తున్న క్లిప్లు ఉన్నాయి. అమృతపాల్ టైగర్ ఫోర్స్ పేరుతో మరో దళాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో పాటు, ఖలిస్థాన్ కరెన్సీ, మ్యాప్ను కూడా సిద్ధం చేస్తున్నట్లు తేజిందర్ అరెస్టుతో బయటపడింది.
డీఅడిక్షన్ కేంద్రం ఓ నాటకం..
పంజాబ్ను అశాంతిలోకి నెట్టడానికి అతడి డీఅడిక్షన్ సెంటర్ ఓ నాటకమని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అమృత్సర్ డీఎస్పీ హరికిషన్ సింగ్ ఓ ఆంగ్లపత్రికకు వెల్లడించారు. ఈ మత్తు బానిసలను ఏకేఎఫ్లోకి తీసుకెళ్లాలని అమృత్పాల్ కలలుగన్నాడని వెల్లడించారు. వాస్తవానికి డీఅడిక్షన్ కేంద్రంపై కూడా ఏకేఎఫ్ అని రాసి ఉంది. కేవలం వ్యసనపరులను ముగ్గులోకి లాగేందుకు ఇది ఒక బూటకపు కేంద్రమని హరికిషన్ తెలిపారు. అక్కడ చేరిన వారిని వెంటేసుకొని అమృత్పాల్ తిరిగాడని పేర్కొన్నారు. వారిలో చాలా మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వీరితోనే ఏకేఎఫ్ మొదలుపెట్టాడని చెప్పారు. ఆనందపూర్ ఖల్సా ఫెడరేషన్లో ఈ దళం ఓ భాగం మాత్రమే అని పేర్కొన్నారు.
మత్తు వ్యసనాలను వదిలించేందుకు తాను దిగివచ్చిన వ్యక్తిగా అమృత్పాల్ చిత్రీకరించుకొన్నాడు. కొన్నాళ్ల క్రితం ఓ గ్రామంలో మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం మనం ఎంత ఆనందంగా ఉన్నాం? మన యువత వ్యసనాలతో చనిపోతున్నారు. వారు చనిపోక ముందే అంత్యక్రియలు చేస్తున్నాం’’ అంటూ భావోద్వేగపూరితంగా ప్రసంగించాడు. కానీ, ఆయన డీఅడిక్షన్ సెంటర్లో మాత్రం ఎటువంటి వైద్యుడు లేడు. ఆ కేంద్రంలో చేరిన వారికి ఏవో ట్యాబ్లెట్లు ఇచ్చి బలవంతంగా ఐదు రోజులు వాడించేవారు. అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నిస్తే తీవ్రంగా కొట్టేవారని అక్కడ ఉన్న రాజీందర్ అనే వ్యక్తి వెల్లడించాడు.
అమృత్పాల్ వచ్చాకే పెరిగిన పాక్ డ్రోన్ల కదలికలు..
అమృత్పాల్ వెనుక ఉన్న జశ్వంత్ సింగ్ రోడే.. పాకిస్థాన్ నుంచి భారత్కు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో అమృత్పాల్ డ్రగ్ డీఅడిక్షన్ కేంద్రాలపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అమృత్పాల్ భారత్ వచ్చాక పాక్ నుంచి డ్రోన్లతో డ్రగ్స్ సరఫరాలు పెరిగిపోయినట్లు తెలుస్తోంది. బీఎస్ఎఫ్ లెక్కల ప్రకారం 2021లో ఇటువంటి ఘటనలు 67 చోటు చేసుకోగా.. 2022లో ఏకంగా ఇవి 256కు చేరాయి. ఇవన్నీ అమృత్సర్, గుర్దాస్పూర్, ఫిరోజ్పూర్ ప్రాంతాల్లో చోటు చేసుకొన్నాయి. ఈ నేపథ్యంలో అమృత్పాల్కు పాకిస్థాన్లోని బిలాల్, రాణా వంటి డ్రగ్ డీలర్లతో కూడా సంబంధాలు ఉండే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు.
అమృత్పాల్ వెనుక ఉన్న మరో కీలక ఉగ్రవాది హర్వీందర్ సింగ్ రిండా. ఇతడు పంజాబ్ నుంచి మహారాష్ట్ర వరకూ మాదక ద్రవ్యాల సామ్రాజ్యాన్ని విస్తరించాడు. దీంతోపాటు అమృత్పాల్కు మెర్సిడెస్ కారును ఇచ్చిన రవీల్సింగ్పై డ్రగ్స్ ఆరోపణలు ఉన్నాయి.
ఓ హత్యలో అమృత్పాల్ సింగ్ అనుచరుడు..
హక్కుల కార్యకర్త సుధీర్ సూరి గతేడాది నవంబర్లో అమృత్సర్లో హత్యకు గురయ్యాడు. సూరి హంతకుడు కూడా అమృత్పాల్ అనుచరుడే. అతడి కారుపై ఏకేఎఫ్ స్టిక్కర్ ఉంది. ఈ హత్యకు నాలుగు రోజుల ముందు అమృత్పాల్ అతడిని కలిసినట్లు ఓ ఆంగ్ల వార్తా సంస్థ కథనంలో పేర్కొంది.
జైల్ బ్రేక్ భయంతోనే అస్సాంకు..
వారిస్ పంజాబ్ దే నాయకుడు అమృత్పాల్ అనుచరులను అస్సాంలోని డిబ్రూఘర్ సెంట్రల్ జైలుకు పంపడానికి కారణాలున్నాయి. ఈ నిందితులంతా జైల్లో చేరి సాటి నేరగాళ్లలో అతివాద భావజాలం వ్యాప్తి చేస్తారని అధికారులు భయపడ్డారు. దీనికి తోడు బయట ఉన్నవారు మిగిలిన వారిని రెచ్చగొట్టి జైళ్లను బద్దలుకొట్టే అవకాశాలు ఉండటంతో అస్సాంకు తరలించారు. దీనికి తోడు పంజాబ్ జైళ్ల నుంచే వీరు తమ కార్యకలాపాలు కొనసాగించే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
ఈడీ విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధమేనని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కోర్టులో గురువారం ఆయన తన వాదనలు స్వయంగా వినిపించారు. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది. -
నేపాల్ మేయర్ కుమార్తె ఆచూకీ లభ్యం
గోవాలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన నేపాల్లోని ధన్గఢీ నగర మేయర్ కుమార్తె ఆర్తీ హమాల్(36) ఆచూకీ బుధవారం లభ్యమైంది.
తాజా వార్తలు (Latest News)
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!